S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/04/2017 - 19:56

రాబోయే 2018 సంక్రాంతి సీజన్ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, బాలకృష్ణ ‘జైసింహ’తో పోటీకి దిగుతుండగా స్టార్ హీరోయిన్ అనుష్క కూడా తన తర్వాతి సినిమా ‘్భగమతి’తో ఈ బరిలో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ చిత్రం డిసెంబర్ నాటికల్లా పూర్తి సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని తెలిసింది.

11/04/2017 - 19:54

ఇటీవలే జై లవకుశ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, తన తాజా చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈలోపు చిత్రానికి సంబంధించిన పాత్ర ఆహార్యాన్ని సమకూర్చుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఇంకా సమయం వుంది కనుక మరిన్ని కథలు విని ఫైనలైజ్ చేయనున్నారు.

11/04/2017 - 19:53

శ్రీ కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోడి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ది ప్రాంక్’. అర్జున్ కళ్యాణ్, పూజిత, ఐశ్వర్య, నోయల్ ప్రధాన తారాగణంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పోస్టర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. మోషన్ పోస్టర్‌ను దర్శకుడు మారుతి, డిజిటల్ పోస్టర్‌ను రాజ్ కందుకూరి విడుదల చేశారు.

11/04/2017 - 19:51

నూతన తారలతో శ్రీలతా క్రియేషన్స్ పతాకంపై సురేష్ యాదవల్లి దర్శకత్వంలో శ్రీలతా.ఎస్ రూపొందించిన చిత్రం ‘సరోవరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా పాటలు బాగున్నాయని, సినిమా పాటలతో విజయవంతం అవ్వాలని తెలిపారు.

11/04/2017 - 19:50

గూఢచారి చిత్రాలు అంటేనే తెలుగు ప్రేక్షకులకు చాలా ఆసక్తి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్‌లో దర్శకులు చిత్రాలను రూపొందించి ఆయా హీరోలకు స్టార్‌డమ్ కట్టబెట్టారు. అదే దారిలో ప్రస్తుతం అడివి శేష్ కూడా వెళుతున్నారు. క్షణం లాంటి ట్రెండ్ సెట్టర్ హిట్ అందుకున్న ఆయన, తాజాగా గూఢచారి చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.

11/04/2017 - 19:49

‘కొమరం భీమ్’ ఫేం భూపాల్ ప్రధాన పాత్రలో మాస్ట సాయి, బేబి కావేరి, బేబి అభి, వింజమూరి మధు ప్రధాన పాత్రలో అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ఫిల్మిడియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి చింతా లక్ష్మీ నాగేశ్వరరావు సమర్పణలో నిర్మించిన చిత్రం ‘డూ డూ ఢీ డీ’ (మా ఊరి కొండ). ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ పూర్తయిందని దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ తెలిపారు.

11/04/2017 - 19:47

తమిళ హీరో ధనుష్ జోరు మామూలుగా లేదు. ఇప్పటికే కోలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ధనుష్ అటు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటాడు. తెలుగులో కూడా ధనుష్ అంటే మంచి క్రేజ్ వుంది. తాజాగా ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కెన్‌ష్కాట్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న ‘ది ఎక్సార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ పేరుతో రూపొందే సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు.

11/04/2017 - 19:46

విజయ్, సమంత, కాజల్, నిత్యామీనన్ ప్రధాన తారాగణంగా తేనాండాళ్ స్టూడియోస్ ప్రై.లి.పతాకంపై అట్లీ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అదిరింది’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 9న విడుదలకు సిద్ధం చేశారు.

11/04/2017 - 19:44

రామ్‌చరణ్ ప్రస్తుతం నటిస్తున్న రంగస్థలం జోరుగా షూటింగ్ జరుకుంటున్న విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తరువాత చరణ్ కోసం ఇద్దరు ముగ్గురు దర్శకులు క్యూలో ఉన్నారు. అందులో బోయపాటి శ్రీనుతో సినిమాకు చరణ్ కమిట్ అయ్యాడట. అలాగే కొరటాల శివతో కూడా మరో సినిమా ఉంది. తాజాగా నాని హీరోగా ‘నేను లోకల్’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న త్రినాథరావు కూడా చరణ్‌కు కథ చెప్పాడట.

11/03/2017 - 20:04

సంచలన దర్శకుడు వర్మ దర్శకుడిగా పరిచయం అయిన ‘శివ’ సినిమా అప్పట్లోనే సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాతో టాలీవుడ్‌లో దర్శకుడిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వర్మ.. దాదాపు 28 సంవత్సరాల తరువాత ‘శివ’కు సీక్వెల్‌గా ‘శివ-2’కు సన్నాహాలు మొదలుపెట్టాడు. తాజాగా ‘రాజుగారి గది-2’లో నటించిన నాగార్జున మళ్లీ వర్మతో సినిమా చేయడానికి ఓకే చెప్పడంతో వర్మ సన్నాహాలు ప్రారంభించాడు.

Pages