S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ గ్లామర్ భామ పరిణితీ చోప్రా ప్రస్తుతం భలే ఖుషీ మీదుంది. దానికి కారణం ఆమె తాజాగా నటించిన ‘గోల్మాల్ ఎగైన్’ చిత్రం మంచి విజయం సాధించడంతోపాటు, అందులో తన పాత్రకు కూడా మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఈ ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ విజయంతో చాలా ఆనందం కలుగుతోంది. అందరూ ఖుషీ పాత్ర గురించే మాట్లాడుకుంటున్నారంటూ తెగ మురిసిపోతోంది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రానికి ‘జై సింహ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి.కల్యాణ్ సి.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ చిత్రంతో కథా రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ నవంబర్ 5 నుంచి హైదరాబాద్లో రెగ్యులర్గా జరగనుంది. ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలతోపాటుగా యాక్షన్ ఫైట్స్ చిత్రీకరించనున్నారు.
ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ సినిమా ప్రేక్షకులు ప్రతి ఒక్కరికీ బాగా పరిచయం. ఎందుకంటే ఏ థియేటర్లోనైనా సినిమాకు ముందు వచ్చే కేన్సర్ యాడ్లోని డైలాగ్ ఇది. ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి అంటూ వచ్చే డైలాగులోని మొదటి పదాన్ని తన చిత్రానికి టైటిల్గా పెట్టేందుకు ప్రముఖ నటుడు వెంకటేష్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గురు సినిమా తరువాత ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం త్వరలో సెట్స్పైకి రానుంది.
బుల్లితెర 45మంది కళాకారులతో మొట్టమొదటిసారిగా జానపద ఆటపాటల కార్యక్రమాన్ని విక్రమ్ ఆర్ట్స్ సమర్పణలో మేము పక్కా లోకల్, దద్దరిల్లే జానపదం అనే క్యాప్షన్తో విక్రంరెడ్డి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. పోస్టర్ను ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు.
డిస్ట్రిబ్యూటర్గా కెరీర్ మొదలుపెట్టి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు బన్నీ వాసు. అల్లు అర్జున్పై వున్న అభిమానంతో బన్నీ వాసుగా మారాడు. అటుపై గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా ఆది, వైభవి, రష్మి ముఖ్యపాత్రల్లో నటుడు ప్రభాకర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4 మూవీస్ పతాకంపై ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
నాగ అనే్వష్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాజవౌళి శిష్యుడు ‘బాహుబలి’ పళని దర్శకుడు. ‘సింధూర పువ్వు’ కృష్ణారెడ్డి నిర్మాత. నవంబర్ 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు చెబుతూ- సినిమా వ్యవధి రెండు గంటల ఎనిమిది నిమిషాలు. ఇటీవలే యూనిట్ అంతా సినిమా చూశాం. సంతోషంగా అనిపించింది.
మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో తెరకెక్కించారు. ‘ప్రేమమ్’ టాలీవుడ్కు పరిచయమైన మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా తరువాత వరుస అవకాశాలతో బిజీగా మారిన అనుపమ, తాజాగా నటించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’.
రాజశేఖర్, పూజాకుమార్, శ్రద్ధాదాస్ ప్రధాన తారాగణంగా జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కోటేశ్వరరాజు రూపొందించిన చిత్రం ‘పిఎస్వి గరుడవేగ 125.18ఎం’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసి నవంబర్ 3న విడుదలకు సిద్ధం చేశారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో నిర్వహించారు.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనుంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటివరకూ టైటిల్ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ప్రచారంలో వుంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా ఈ టైటిల్కే ఫిక్స్ అవుతున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.