S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2017 - 00:57

ప్రముఖ సీనియర్ నటుడు మోహన్‌బాబు రెండేళ్ళ గ్యాప్ తరువాత మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. ఇటీవలే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు సినిమాలో నటించిన మోహన్‌బాబు, ఆ తరువాత ఏ చిత్రంలోనూ కనిపించలేదు. తాజాగా తెరకెక్కే ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

07/30/2017 - 00:56

స్క్రీన్ ప్లే మాయతో అద్భుతాలు సృష్టించొచ్చు. అలాంటి ప్రయత్నమే షాలిని. స్ర్తి గౌరవాన్ని ఇనుమడించేలా సినిమాను తెరకెక్కించే కథలు అప్పుడప్పుడూ దొరుకుతాయి. అశ్లీలత, అసభ్యతకు తావులేకుండా ఓ మంచి కథను సినిమాగా మలిచామన్న సంతృప్తి షాలినితో నాకు దక్కింది అంటున్నాడు దర్శకుడు షిరాజ్. షాలిని చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది.

07/28/2017 - 22:01

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తరువాత అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం 3యుద్ధం శరణం. తమిళ దర్శకుడు క్రిష్ణ ఆర్.వి. మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపింది. ఈ నేపథ్యంలో ఈ టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. ఇందులో నటుడు శ్రీకాంత్ విలన్‌గా నటిస్తుండడం విశే షం.

07/28/2017 - 22:00

అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న 3నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా2 కోసం ఫిజికల్‌గా మేకోవర్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో మిలటరీ అధికారిగా కనిపించనున్నాడు. దానికోసం ప్రత్యేకంగా మిలటరీలో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే, ఆయన అమెరికాలో ఈ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

07/28/2017 - 21:03

మహానటి సావిత్రి జీవిత కథ తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటిస్తుండగా, దుల్కర్ సల్మాన్ తమిళ నటుడు జెమినీ గణేశన్ పాత్రలో నటించనున్నాడు.

07/28/2017 - 21:02

శేఖర్ మూవీస్ పతాకంపై ఆది పినిశెట్టి దర్శకత్వంలో ఎస్.చంద్రశేఖర్ రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, టీజర్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. రవిచంద్రన్, సమయ జంటగా నటిస్తున్న ఈ చిత్రం గూర్చి చంద్రశేఖర్ మాట్లాడుతూ- 3ఆది పినిశెట్టి చెప్పిన కథ నచ్చడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమా రూపొందిస్తున్నామని, కథ అంత బాగా వచ్చిందనీ, మిగత విషయాలు త్వరలో తెలియజేస్తామ2ని అన్నారు.

07/28/2017 - 21:00

ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి విలన్‌గా పలు చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటున్నాడు అరవింద్ స్వామి. ఆ మధ్య ఆయన ధృవ చిత్రంలో కొత్త తరహా విలనిజాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్న ఆయన త్వరలోనే దర్శకుడిగా మారుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.

07/28/2017 - 20:59

చరిత్రలోనే అత్యంత విషాదకరమైనది టైటానిక్ షిప్ దుర్ఘటన. ఇద్దరు ప్రేమికుల గాఢమైన ప్రేమతో చరిత్రలో చూడని ఎఫెక్ట్‌లతో ఈ సినిమాను తెరకెక్కించాడు హాలీవుడ్ దర్శకుడు జేన్స్ కామెరూన్. ఆ సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. టైటానిక్ ప్రమాదం జరిగి వందేళ్ళయిన సందర్భంగా 2012లో టైటానిక్ 3డి వెర్షన్ విడుదల చేశారు. అది కూడా పెద్ద విజయం సాధించింది.

07/28/2017 - 20:58

బాహుబలితో క్రేజ్ తెచ్చుకున్న రానా సోలో హీరోగా నటిస్తున్న సినిమాకు అప్పుడే మంచి క్రేజ్ ఏర్పడింది. రానా హీరోగా నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా ట్రైలర్‌తో దుమ్ము రేపాడు. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, కథనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు శాటిలైట్ హక్కులు ఏకంగా 3 కోట్లకు అమ్ముడుకావడం సంచలనం రేపింది.

07/28/2017 - 20:56

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది ఫిదా చిత్రం విజయం. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫిదా వేడుకలను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, నాగబాబు, నారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

Pages