S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఈమధ్య హీరోయిన్స్ బాగా హుషారు అవుతున్నారు. అందుకే హీరోయిన్గా క్రేజ్ వున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనక వేసుకునేందుకు సిద్ధం అవుతూ.. దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే కొందరు భామలు సొంతంగా వ్యాపార రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ లిస్ట్లోకి చేరనుంది హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించే అమీ జాక్సన్?
సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం ఫస్ట్లుక్ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించడం తెలిసిందే. సినిమా మొదలై ఎనిమిది నెలలైనా ఫస్ట్లుక్ విడుదల కాకపోవడంతో మహేశ్ ఫాన్స్ అసహనానికి గురయ్యారు. అప్పుడు ఇప్పుడు అంటూ వాయిదాలు పడుతున్న సమయంలో ఫాన్స్ సోషల్ మీడియాలో ఘాటుగానే స్పందించారు.
దాదాపు ఐదేళ్లు బాహుబలి సినిమాకు కేటాయించిన ప్రభాస్ హీరో ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకున్నాడు. ప్రభాస్ క్రేజ్ పెంచిన ప్రాజెక్టులో ‘కన్క్లూజన్’ పార్ట్ బాహుబలి-2 28న విడుదలవుతోంది. దీని తరువాత ఆయన నటిస్తున్న చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని యువీ క్రియేషన్స్ భారీస్థాయిలో నిర్మిస్తోంది.
శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా శింభు సినీ ఆర్ట్స్, జేసన్రాజ్ ఫిలింస్ పతాకాలపై పాండిరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ రూపొందించిన చిత్రం ‘సరసుడు’. శింబు సోదరుడు టి.ఆర్.కురళ అరసన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను మే 2న విడుదల చేయనున్నారు.
రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా రేవన్యాదు దర్శకత్వంలో ఇఎంవి స్టుడియో పతాకంపై రూపొందిన చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు రేవన్ యాదు మాట్లాడుతూ బూచమ్మ- బూచోడు తర్వాత నేను రూపొందించిన రెండో చిత్రమిది. హౌరా బ్రిడ్జి నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన ప్రేమ కథ.
దన్సికని తెలుగువారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనే లేదు. కబాలి సినిమాతో ఈ అమ్మడు తెలుగులోనూ పాపులర్ అయింది. ఆ సినిమాలో లేడీ డాన్గా ఫైరింగ్ చేసే దన్సిక స్టైల్ ఇప్పటికీ కుర్రాళ్ళ కళ్ళల్లో అలాగే కనిపిస్తుంటుంది. అంతటి స్టైలిష్, క్రేజీ గాళ్ ధన్సిక. ఈ అమ్మడు అంతకంటే ముందే పలు చిత్రాల్లో తెలుగువారిని పలకరించింది. అందానికి అందం.. పెర్ఫామెన్స్కి పెర్ఫామెన్స్.. విలక్షణత ఈ అమ్మడికే చెల్లింది.
ప్రముఖ సంగీత దర్శకుడు రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్కు దక్షిణాదిలో ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ తాజాగా విదేశాల్లో మ్యూజిక్ షో ఇవ్వనున్నాడు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘దేవిశ్రీ ప్రసాద్ పాపులారిటీ ఉన్న సంగీత దర్శకుడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ మంచి చిత్రాలకు ఆదరణ లేదన్న బాధే లేదు. మంచి చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకులు ముందువరుసలో నిలుస్తారు. ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించలేదూ అంటే.. సదరు దర్శకుడో, నిర్మాతో కథాబలం లేని చిత్రాలు పట్టుకుని పరిశ్రమకు వచ్చారనే అర్థం. ఎవరి కథ వారికి ఇష్టం. అందులో సినిమా తీయడానికి నిర్ణయించుకున్న తరువాత ఆ కథకు ఎన్ని హంగులు, రంగులద్దాలో అన్నీ జోడిస్తారు.
వివాదానికి కారకుడూ ఆయనే. ఇప్పుడు పరిష్కరానికి కారకుడూ ఆయనే. కావేరీ నదీ జలాలకు సంబంధించి కన్నడ ప్రజలకు కాకపుట్టేలా కామెంట్ చేసిన సత్యరాజ్, బాహుబలి చిత్రాన్ని కర్నాటకలో బతికించేందుకు కూల్ కామెంట్లు చేసి వివాదానికి తెరదించారు. సత్యరాజ్ నటించిన చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో విడుదల కానిచ్చేది లేదని కన్నడ సంఘాలు భీష్మించిన సంగతి తెలిసిందే.
యాక్షన్ స్టార్ గోపీచంద్, ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ క్రేజీ కాంబినేషన్లో జయబాలాజి రియల్ మీడియా పతాకంపై తాండ్ర రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార హీరోయిన్. ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు.