S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాగంటి శ్రీనాథ్ హీరోగా మిసిమి క్రియేషన్స్ పతాకంపై రాజాశ్రీ దర్శకత్వంలో రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘సమయం’. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో మా హీరో శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాం. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది.
చేతన్ చీను కథానాయకుడుగా సూర్యకిరణ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిమ్ నగర్ సాయిబాబా గుడిలో జరిగింది. పరిటాల రాంబాబు రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ నెల రెండవ వారం నుండి ప్రారంభించనున్నారు.
సినిమాల్లో హీరోయిన్గాకంటే కూడా బికినీలు, సెమీ న్యూడ్, గ్లామర్ షోలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది పూనమ్ పాండే. ఏ సందర్భం వచ్చినా వదలకుండా తన గ్లామర్ని ఆరబోసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తోందట.
ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారింది కీర్తి సురేష్. ‘నేను శైలజ’ తరువాత ఈ అమ్మడికి అవకాశాలు దక్కాయి. అయితే ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటున్న కీర్తి, తాజాగా నానితో ‘నేను లోకల్’ అంటూ మరో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ ఫేట్ మారింది. ఆమె ఉంటే చాలు సినిమా హిట్ గ్యారంటీ అనే తరహాలో ఈమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
అర్జున్ మహి, అశ్విని జంటగా రవిచంద్ర కన్నికంటి దర్శకత్వంలో శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై వీరగంగాధర్ రిమ్మలపూడి నిర్మించిన ‘నువ్వు నేను ఒరేయ్ ఒసేయ్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన ప్రెస్మీట్లో హీరోయిన్ అశ్విని మాట్లాడుతూ- టైటిల్ చాలా కొత్తగా వుంది. మంచి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా.
పవన్, గట్టు మను, సోనియా ప్రధాన తారాగణంగా టి.ఆర్. మూవీ మేకర్ పతాకంపై సంతోష్ నేలంటి దర్శకత్వంలో గట్టు వెంకన్న, పవన్ సోని సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 7న విడుదలకు సిద్ధమైంది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రోబో 2.0’. ఇండియాలోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రమిదే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి కొన్ని రకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.
మూడు సంవత్సరాల క్రితమే సినిమాల్లోకి రావాలనుకున్నా. మహాభారతం సీరియల్లో నటిస్తున్నపుడు నా నటన పలువురికి నచ్చింది. ఎలాగైనా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించాలని ఇక్కడికి వచ్చినపుడు ఆయన ‘టెంపర్’ షూటింగ్లో వున్నారు. ఇపుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘రోగ్’ చిత్రంలో పరిచయం కావడం సంతోషంగా వుందని నటుడు అనూప్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
ప్రస్తుతం టాలీవుడ్లో ఈ న్యూస్ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తరహా చిత్రాల్ని రూపొందించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడట.