S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పవన్కల్యాణ్ కథానాయకుడుగా నటించిన ‘కాటమరాయుడు’ చిత్రం శుక్రవారం విడుదలై తొలి రోజు కలక్షన్లను గత చిత్రాలన్నిటి రికార్డులన్నిటినీ అధిగమించి నెం.1 స్థానంలో కొనసాగుతోందని దర్శకుడు డాలి తెలియజేశారు. బాక్సాఫీస్వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ఆదివారం ఉదయం తెలంగాణ ఐటి, పురపాలక శాఖామంత్రి కెటిఆర్ కాటమరాయుడు చిత్రాన్ని వీక్షించారు.
చిరంజీవి 151వ సినిమాకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ చివరలో సెట్స్ పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ప్రముఖ రచయితలూ పరుచూరి బ్రదర్స కసరత్తు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 101వ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏం పెడతాడు పూరి అనే సందేహం అందరిలో మొదలైంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ సినిమాకు ఎక్కువగా నెగిటివ్ టైటిల్స్ పెడతాడు.. అలాగే ఈ సినిమాకు కూడా నెగిటివ్ టైటిల్ పెడతారా అన్న సందేహాలు కలిగాయి.
మానస్, కారుణ్య, మహిమా అలేఖ్య ప్రధాన తారాగణంగా ఎస్.బి. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై హరిబాబు మల్లూరి దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజ రూపొందించిన చిత్రం ‘సోడా గోలీ సోడా’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ప్రారంభోత్సవ సన్నివేశంపై నిర్మాత సత్య సంధుజ క్లాప్ ఇవ్వగా స్వామిగౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
అల్లరి నరేష్, నిఖిలావిమల్ జంటగా జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై జి.ప్రజిత్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘మేడమీద అబ్బాయి’. మలయాళంలో విజయవంతమైన ఒరువడక్కమ్ సెల్ఫీ చిత్రానికి రీమేక్గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 16నుండి పొల్లాచ్చిలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత చిత్ర విశేషాలు తెలుపుతూ..
గత డిసెంబర్ 30న రిలీజైన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలు పొంది మంచి చిత్రంగా నిలిచింది. హైదరాబాద్లోని ఒక యువకుడి నిజ జీవితంతలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో నారా రోహిత్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించగా, శ్రీవిష్ణు మరొక కీలకమైన పాత్ర పోషించారు. భిన్నమైన కథ, ఆకట్టుకునే కథనమే ప్రధాన బలాలుగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్ట్ చేశాడు.
శ్రీ సిద్ధి వినాయక సెవెన్ హిల్స్ క్రియేషన్స్ పతాకంపై క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్, కోయల్దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘చంద్రుడిలో ఉండే కుందేలు’. వెంకట్రెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకట్రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో శనివారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..
శ్రీవేంకటేశ్వరా క్రియేషన్స్, మద్రాస్ టాకీస్ పతాకాలపై మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన ‘చెలియా’ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. కార్తీ, అతిథిరావు హైదరి జంటగా నటించిన ఈ చిత్రానికి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లక్స్పాపగా టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఆషాశైని, తొలినాళ్లలో హిట్ చిత్రాలతో ఆకట్టుకున్నా, ఆ తరువాత ఆమెకు అవకాశాలు కలిసిరాలేదు. రకరకాల పేర్లు పెట్టుకుని కలిసి వస్తుందేమో అని ప్రయత్నాలూ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్లో బేగం జాన్ సినిమాపై ఆశలు పెట్టుకుంది. విద్యాబాలన్ లీడ్రోల్లో నటిస్తుండగా, గుజరాత్కు చెందిన మైనా అనే ఓ గిరిజన యువతి పాత్రాలో ఆశాషైని నటించింది.
సునీల్ కథానాయకుడుగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో రూపొందిస్తున్నట్లుగా యూనిట్ తెలియజేస్తోంది.