S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనమ్కపూర్ గత కొంతకాలంగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజాతో ప్రేమలో పడ్డట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ అలాంటిదేం లేదంటూ దాటేస్తున్న సోనమ్, ఈమధ్యే అతగాడితో షికార్లు చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. చేసేదేమీ లేక ఔను, మా ఇద్దరిమధ్యా ప్రేమాయణం సాగుతోందని చెప్పేసింది.
ఈ ఏడాది ‘ధ్రువ’ సినిమా ఘనవిజయంతో మంచి జోరుమీదున్నాడు రామ్చరణ్. ఈ సినిమాతోపాటు ఆయన నిర్మించిన ఖైదీ నెం 150వ చిత్రం సంచలన విజయం సాధించి 100 కోట్ల మార్కెట్ను కొల్లగొట్టడంతో మళ్లీ చిరంజీవితో రెండవ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న చిత్రం ఈనెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
ఇటీవలే తెలుగు వీరుడు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథను తెలుగు ప్రేక్షకులకు అందించి మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు క్రిష్, తన తదుపరి చిత్రంగా మరో నందమూరి హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈసారి ఆయన దర్శకత్వంలో నటించేది ఎవరో కాదు కల్యాణ్రామ్. పటాస్ విజయం తరువాత కల్యాణ్రామ్కు చెప్పుకోదగ్గ సక్సెస్ దక్కలేదు.
శ్రీ నటరాజ లక్ష్మీనరసింహ స్వామి మూవీస్ పతాకంపై వారణాసి సూర్య దర్శకత్వంలో యు.వేదప్రకాష్ నిర్మిస్తున్న ‘యాత్రికుడు’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ను పోచారం భాస్కర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్, కె.వి.మోహన్గౌడ్, సురేష్ కొండేటి, బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- ట్రైలర్ బాగుంది.
అమోగ్ దేశపతి, అర్చన ముఖ్యపాత్రల్లో షెరాజ్ దర్శకత్వంలో స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై పి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘షాలిని’. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లో జరిగింది. నిర్మాత సాయి వెంకట్ టీజర్ను ఆవిష్కరించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ- సినిమా బాగా వచ్చిందని, ముఖ్యంగా టీజర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తి కలుగుతోందని, ఇదొక మంచి హారర్ థ్రిల్లర్ అని అన్నారు.
ప్రతి సమస్యకి యుద్ధం సమాధానం కాదు. యుద్ధం లేని ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ మేజర్ కథే ఈ 1971 భారత సరిహద్దు చిత్రం. 1971వ సంవత్సరంలో పాకిస్తాన్కి, భారతదేశానికి మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో ఈ కథాంశం నడుస్తుంది. అంతేకాదు, ఆ యుద్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించడం జరిగింది. రియల్గా యుద్ధ ట్యాంకర్స్ని వాడి షూట్ చేశారు.
గోవా తీరంలో బాలీవుడ్ భామలు అందచందాలతో అలరించారు. మూడురోజులపాటు సాగిన ఇండియన్ బీచ్ ఫ్యాషన్ వీక్-2017లో భాగంగా వారు సరికొత్తతరహా దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రఖ్యాత డిజైనర్ల జంట రిద్ది-సిద్ది రూపొందించిన అందమైన నీలిరంగు దుస్తుల్లో గౌహర్ ఆకట్టుకుంటే మరో డిజైనర్ జంట సుకృతి-ఆకృతి రూపొందించిన ఎర్రని లెహంగా, చోళీతో కృతిసనన్ అలరించింది.
ప్రేమన్నది యూనివర్సెల్. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్నవిషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీనివల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తనవల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు?
జయంత్, శే్వతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘మిక్చర్పొట్లం’. సతీష్కుమార్.ఎం.వి. దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు శ్రీలక్ష్మిప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాధవపెద్ది సురేష్ చంద్ర సంగీతం అందించిన ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలై శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఓ వైపు భక్తిరస చిత్రాలు, మరోవైపు సోషల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో నటిస్తూ, అన్ని పాత్రలను అద్భుతంగా పోషిస్తున్న నాగార్జున తాజా చిత్రం మళ్లీ సోషల్ ఎలిమెంట్తోనే అని అర్థమైపోయింది.