S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజ్తరుణ్ కథానాయకుడు ఎ.కె.మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వంశీకృష్ణ దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. గత వారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.
స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై ఆర్.జె.రూపేశ్ శెట్టి, రమ్య జంటగా దేవరాజ్కుమార్ దర్శకత్వంలో సాయివెంకట్ అందిస్తున్న చిత్రం ‘పిశాచి-2’ (డేంజర్ జోన్). అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ విడుదల చేశారు.
పవన్, కారుణ్య, రాకేష్ ప్రధాన తారాగణంగా శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్కుమార్రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏటిఎం వర్కింగ్’. కిషోర్బసిరెడ్డి, యక్కలి రవీంద్ర సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..
మహేష్బాబు- స్టార్ డైరెక్టర్ మురుగదాస్ల కలయికలో రూపొందుతున్న చిత్రంపై ప్రేక్షకులు, అభిమానుల్లో ఎంతటి భారీ అంచనాలున్నాయి వేరే చెప్పనక్కర్లేదు. చాలావరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అనంతరం 11వ తేదీ నుండి చెన్నైలో షెడ్యూల్ జరుపునన్న యూనిట్ ఆ తర్వాత 23న వియత్నాం వెళ్లనున్నారు.
రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న చిత్రం శరవేగంగా ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. చరణ్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో సినిమా అనగానే ఇటు ప్రేక్షకులు, అటు మెగా అభిమానులు సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ ట్రేడ్ వర్గాల్లో కూడా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్లో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తనకోసమే కథలు రాసుకునే రేంజ్ విద్యాబాలన్ది. దర్శక, రచయితలు ఆమెను దృష్టిలో పెట్టుకుని స్టోరీలు రాస్తుంటారు. ఇటీవలి ‘కహానీ’ సిరీస్ ఆ కోవలో వచ్చినదే. ‘కహానీ’, ‘కహాని 2’ బాలన్కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే కోవలో మరో నటనా ప్రాధాన్యమున్న సినిమాలో నటిస్తోంది బాలన్. ‘బేగం జాన్’ అనేది తాజా సినిమా టైటిల్.
క్రమక్రమంగా ‘బాహుబలి-2’ చిత్రంకోసం రాజవౌళి ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్కు సంబంధించిన కొన్ని పోస్టర్లను విడుదలచేసిన రాజవౌళి త్వరలో ఆడియో వేడుకని కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
శ్రీవిష్ణు హీరోగా రూపొందిన ‘మా అబ్బాయి’ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమవుతోంది. వెనె్నల క్రియేషన్స్ పతాకంపై కుమార్ వట్టి దర్శకత్వంలో బలగ ప్రకాష్రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత బలగ ప్రకాష్రావు మాట్లాడుతూ- అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.
యాకూబ్ అలీ దర్శకత్వంలో రూపొందిన ‘వెళ్లిపోమాకే’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోని ఇటీవలే హైదరాబాద్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. మార్చి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ, ఈ చిత్రాన్ని ఇప్పుడు మార్చి 17న విడుదల చేయాలనీ నిర్ణయించారు. నిర్మాత రాజు మాట్లాడుతూ- ‘వెళ్లిపోమాకే’ సినిమా మేకింగ్ చాలా బాగా వచ్చింది.