S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అది సినిమా అని తెలిసినా భక్తి సినిమాల్లో మునిగితేలిపోయే తెలుగు ప్రేక్షకుడు నిజంగా భోళాశంకరుడిలాంటివాడే. శివుడైనా, రాముడైనా, కృష్ణుడైనా సరే తెరమీదకనిపిస్తే ఆధ్యాత్మికతత్వంలో మునిగిపోయి పులకించిపోవడం కొత్తకాదు. ఇప్పుడైతే కొత్తతరం ఇష్టాలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. కానీ గతంలో పౌరాణిక సినిమాలకు పెద్దఎత్తున ఆదరణ లభించేది.
సాయిధరమ్ తేజ్, రకుల్ప్రీత్ సింగ్ జంటగా ‘విన్నర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు గోపీచంద్ మలినేని. ‘డాన్ శీను, ‘బలుపు’ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న ఆయనకు రామ్ నటించిన ‘పండగ చేస్కో’ కాస్త నిరాశపరిచింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మెగా మేనల్లుడుతో చేస్తున్న చిత్రం ‘విన్నర్’. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో మాటామంతీ...
సునీల్ కథానాయకుడిగా క్రాంతి మాధవ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై పరుచూరి కిరీటి రూపొందిస్తున్న చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ను శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు.
రకుల్ప్రీత్సింగ్ టాలీవుడ్లో ఒకప్పుడు సమంత, కాజల్లు ఎలా వరుస ఆఫర్స్తో దూసుకుపోయారో అలా ఇప్పుడు ఆమె కూడా హీరోయిన్గా మంచి ఆఫర్స్ పట్టేసి దూసుకుపోతోంది. తెలుగులో స్టార్ హీరోల చిత్రాలతోనే కాకుండా చిన్న హీరోల సినిమాల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా గడుపుతోంది. ఆమె సాయి ధరమ్ తేజ్ పక్కన నటించిన ‘విన్నర్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మరోప్రక్క సూపర్స్టార్ మహేష్ పక్కన నటిస్తోంది.
ఇషాన్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తన్వి ఫిలింస్ పతాకంపై సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి రూపొందిస్తున్న చిత్రం ‘రోగ్’ (మరో చంటిగాడి ప్రేమకథ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్, మోషన్ పోస్టర్కు మంచి ఆదరణ లభిస్తోందని నిర్మాతలు తెలియజేశారు. నేడు శివరాత్రి సందర్భంగా కథానాయకుడికి ఫస్ట్లుక్ విడుదల చేశారు.
గ్లామర్ రోల్స్కి చెక్పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఎక్కువ దృష్టిపెట్టిన స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్గా ఒక క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. దర్శకుడు హరి తన హిట్ కాంబినేషన్ను రిపీట్ చేస్తూ విక్రమ్తో ‘సామి’ చిత్రానికి సీక్వెల్గా ‘సామి-2’ని తెరకెక్కిస్తున్నారు.
బాలీవుడ్ తొలి స్టంట్ విమెన్ మేరి ఇవాన్స్ కథానాయిక ప్రాధాన్య చిత్రాలకు ఆద్యురాలు
‘్ఫయర్లెస్ నదియా’గా పేరుప్రఖ్యాతలు ఆమె జీవితకథ నేపథ్యంతో ‘రంగూన్’?
కోర్టు వివాదం నడుమ రేపు విడుదల
ప్రఖ్యాత దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన డ్రామా పీరియాడికల్ చిత్రం. రొమాంటిక్ సన్నివేశాలుంటాయి. రెండో ప్రపంచయుద్ధ నేపథ్యంలో సినిమా కొనసాగుతుంది. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జమాందార్ నవాబ్ మాలిక్గా షాహిద్కపూర్, రుస్తుం ‘రుషి’ బిల్లిమొరియాగా సైఫ్ అలీఖాన్, మిస్ జూలియాగా కంగనారనౌత్ నటిస్తున్నారు. జపాన్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ నటీనటులకు ఇందులో అవకాశం ఇచ్చారు.
నాని కథానాయకుడిగా డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ రేపు విడుదల కానుంది. హీరో జన్మదినోత్సవం సందర్భంగా 24న ఫస్ట్లుక్తోపాటుగా సినిమా పేరును ప్రకటించనున్నారు.
దర్శకుడు వెంకటేష్ రూపొందించిన చిత్రం ‘ఇప్పట్లో రాముడిలా, సీతలా ఎవరుంటారండీ బాబూ..’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు స్పైసీగా వుండడంతో వెబ్సైట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత ప్రశ్నార్థ్ తాత మాట్లాడుతూ- దర్శకుడు వెంకటేష్ తాను ఏం చెప్పదలచుకున్నాడో అదే తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాడని, లాభనష్టాల సంగతి పక్కనపెట్టి, యువతకు గిలిగింతలు పెట్టేలా చిత్రాన్ని రూపొందించారని తెలిపారు.