S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై జీవా, కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఎంతవరకు ఈ ప్రేమ’. ‘కావలై వేండాం’ పేరుతో తమిళనాట సంచలన విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ,‘కావలై వేండాం అద్భుత ప్రేమకథా చిత్రం. ఈక్రేజీ మూవీని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి ‘యామిరుక్క బయమేన్’ ఫేమ్ డీకె దర్శకత్వం వహించారు.
మహానటి సావిత్రిపై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లుగా రెండు మూడు నెలలుగా వినిపిస్తున్న వార్త. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ కార్యక్రమాలన్నీ పూర్తిచేసినట్లు నాగ్ అశ్విన్ ప్రకటించారు. అయితే సావిత్రి పాత్రలో ఎవరు నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారన్న ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. ఆ పాత్రను నిత్యామీనన్, విద్యాబాలన్, సమంతలు నటించనున్నారని పుకార్లు వెల్లువెత్తాయి.
అమీర్ఖాన్ కథానాయకుడుగా రూపొందిన దంగల్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారతీయ మార్కెట్లోనే కాక విదేశీ మార్కెట్లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. గత డిసెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం 31నాటికి మొత్తం రూ.239.01 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.
బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణిగా నటిస్తున్న చిత్రం ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్ఠాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో వై.రాజీవ్రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ..
బాహుబలి ఘన విజయంతో జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న ‘బాహుబలి-2’కోసం దేశంమొత్తం ఎదురుచూస్తోంది. అలాగే ఇంత భారీ ప్రాజెక్ట్ తరువాత ప్రభాస్ ఎలాంటి సినిమా తీస్తాడు. ఏ పెద్ద దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడు అనే ఆసక్తికూడా అందరిలోనూ నెలకొంది. అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ప్రభాస్ ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్కు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
భాను, శరత్, జై, అనూష, హరిణి, కారుణ్య ప్రధాన తారాగణంగా శాన్వీ క్రియేషన్స్, అమృతసాయి ఆర్ట్స్ పతాకాలపై సాయిరామ్ దాసరి దర్శకత్వంలో హరికుమార్ రెడ్డి జి. రూపొందిస్తున్న చిత్రం దేవుడా. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో సినిమాకు సంబంధించిన టీజర్ను నిర్మాత రాజ్కందుకూరి, లోగోను వంగవీటి ఫేమ్ వంశీ ఆదివారం ఉదయం విడుదల చేశారు.
‘ఎక్స్ప్రెస్ రాజా’ వంటి కమర్షియల్ హిట్ తరువాత యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ దిల్రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2017 సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ప్రస్తుతం శర్వానంద్ ఒక కొత్త సినిమాకి ఓకే చెప్పాడని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సూపర్ స్టార్ మహేష్బాబు కొత్త సంవత్సరంలో తను చేయబోయే కొత్త సినిమాల వివరాలను న్యూఇయర్ డే సందర్భంగా ఆదివారం నాడు ప్రకటించాడు. ఎన్నాళ్లుగానో ఈ వార్తకోసం ఎదురుచూస్తున్న అభిమానులు మహేష్ చేసిన ట్వీట్లతో సంబరపడిపోతున్నారు. మహేష్ చెప్పిన ప్రకారం తన 24వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనుంది.
ఆర్.ఎస్. క్రియేషన్స్, శ్రీ శివపార్వతి కంబైన్స్ సంయుక్తంగా స్మితికాచార్య కథానాయికగా బాలా జి. దర్శకత్వంలో తన్నీరు సింహాద్రి, సిందిరి గిరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఏరోజైతే చూశానో’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 6న విడుదలకి సిద్ధం చేశారు.
‘జబర్దస్త్’ కామెడీ బృందంలో గుర్తింపు తెచ్చుకున్న షకలక శంకర్, వెండి తెరపై కూడా అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన చిత్రాలలో షకలక శంకర్కు మంచి పాత్రలు దొరికాయి. అవి ప్రేక్షకుల ఆదరణ కూడా పొందాయి. తాజాగా శంకర్ కథానాయకుడుగా నటించనున్నాడు. సింహ ఫిలిమ్స్ పతాకంపై గంటా రామకృష్ణనాయుడు దర్శకత్వంలో జి.అనీల్కుమార్ ఓ సినిమాని రూపొందిస్తున్నారు.