S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అప్పట్లో బాలీవుడ్లో తనదైన గ్లామర్తో ఆకట్టుకున్న గ్లామర్ భామ శిల్పాశెట్టి రీ ఎంట్రీకి సన్నాహాలు మొదలుపెట్టింది. హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల్ని మత్తెక్కించిన ఈ భామ ఈమధ్యే రాజ్కుంద్రాని వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లైంది కూడా. సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈమె అప్పుడప్పుడు పలు సినీ కార్యక్రమాల్లో మెరుస్తూ ఉండేది.
టాలీవుడ్లో పలు సినిమాలు చేసిన సొట్టబుగ్గల తాప్సీకి ఇక్కడ సరైన కమర్షియల్ సక్సెస్ దక్కలేదు. దీంతో ఈ భామ బాలీవుడ్కి చెక్కేసి అక్కడ అడపాదడపా అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. బాలీవుడ్లో హీరోయిన్ అంటే ఓ రేంజ్లో గ్లామర్ ఆరబోయాలి. అసలే కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఇప్పటికే తాప్సి బాలీవుడ్లో చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా సంతృప్తిని కానీ, విజయాన్ని కానీ ఇవ్వలేదు.
బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్లో జరుగుతోంది. రెండవ శతాబ్దానికి చెందిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. ఆయన జీవిత కథను ఆధారంగా ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్లో శరవేగంగా సాగుతోంది.
పవన్కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులకు అదోక్రేజ్. పవన్ కూడా సాధ్యమైనంత వరకూ వైవిధ్యం ఉండేలా సినిమాను ఎంపిక చేసుకుంటారు. అందులోభాగంగానే పవన్ నటించే తదుపరి సినిమాకు వెరైటీ టైటిల్ను ఫిక్స్ చేశారు. పవన్కల్యాణ్ తదుపరి సినిమా పేరు ‘కాటమరాయుడు’ అని ఖరారు చేశారు. డాలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో నడిచే ప్రేమకథ.
చిరంజీవి 151వ సినిమా దర్శకుడు బోయపాటేనా? అంటే ఔననే అంటున్నాయి సినీవర్గాలు. ‘సరైనోడు’తో మాస్ హిట్ కొట్టాడు బోయపాటి శ్రీను. వందకోట్లకిపైగా వసూళ్లు సాధించింది ఆ చిత్రం. ఆ సినిమాకి సంబంధించిన ఓ వేడుకలో స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ తాను బోయపాటితో సినిమా చేయడానికి రెడీ అని గ్రీన్సిగ్నల్ ఇచ్చేడు. అంతకంటే బంపర్ ఆఫర్ బోయపాటికి ఇంకేముంటుంది? ఆ మాటతో బోయపాటి ప్లానింగ్ అంతా మారిపోయిందని సమాచారం.
ధనుష్ కథానాయకుడిగా, కీర్తి సురేష్ కథానాయికగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘రైల్’. ఆదిత్య మూవీ కార్పొరేషన్, శ్రీ పరమేశ్వరి రగ్న పిక్చర్స్ పతాకాలపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆదిరెడ్డి, ఆదిత్యరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది.
గాదె తరుణ్, తేజ్, భావన ప్రధాన తారాగణంగా సిక్స్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ పతాకంపై శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో డా కృష్ణమోహన్ రూపొందిస్తున్న చిత్రం ‘కుర్ర తుఫాను’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- మంచి ఔట్పుట్ కోసమే సినిమా షూటింగ్ ఆలస్యమైనా రాజీపడకుండా చేస్తున్నామని, ఈ నెలతో షూటింగ్ పూర్తిచేస్తామని అన్నారు.
తమిళంలో సంచలన విజయం సాధించిన ‘తరకప్పు’ చిత్రాన్ని తెలుగులో ‘ఈ చరిత్ర ఇంకెన్నాళ్లు’గా అనువదిస్తున్నారు. శక్తివేల్ వాసు, సముద్రఖని ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని వి.జె.వై.ఎస్.ఆర్ ఆర్ట్స్ పతాకంపై రవి దర్శకత్వంలో వై.శేషిరెడ్డి అందిస్తున్నారు.
గ్లామర్ భామ నయనతార ఇప్పుడు కోలీవుడ్లో మంచి జోరుమీదుంది. ఇప్పటికే గ్లామర్తో ఆకట్టుకుంటూ.. అటు స్టార్ హీరోల సరసన, ఇటు యువ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ జోరుమీదుంది. ఇటీవలే తెలుగులో వెంకటేష్ సరసన ‘బాబు బంగారం’ చిత్రంలో నటించిన ఈ భామ ఇప్పుడు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోందని తెలిసింది. ఇప్పటికే ఆమె ఎఐఎడిఎంకె పార్టీతో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది.
‘హాయ్’ అంటూ పలకరించి ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నిఖిత ఆ తర్వాత డజనుకు పైగా తెలుగు సినిమాలతోపాటు.. అంతకుమించిన సంఖ్యలోనే కన్నడ..తమిళ్.. మలయాళ సినిమాల్లో నటించింది. చాలాకాలంగా సౌత్లో హీరోయిన్గా కెరీర్ కంటిన్యూ చేస్తున్న ఈ భామకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కానీ.. అవేవీ కెరీర్కి బ్రేక్ఇచ్చే రేంజ్వి కావు. అందుకే తన కెరీర్కి తనే టర్నింగ్ ఇచ్చుకోవాలని డిసైడ్ అయిపోయింది నిఖిత.