S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. అనిత హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని యూని క్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జి.సి.జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రంలోని పాటలు శనివారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో గుణపాటి సురేష్రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్ పతాకంపై వేళ్ల వౌనికాచంద్రశేఖర్, ఉమాలక్ష్మీనరసింహ నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీబాంబ్.
గ్లామర్ భామ శృతిహాసన్ దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతోంది. హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఆమెలో మరో కోణాన్ని బయటపెడుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. శృతిహాసన్ నటిగానే కాకుండా సింగర్గా కూడా సుపరిచితమే. ఇప్పటివరకూ రెండు మూడు చిత్రాలకోసం పాటలు పాడిన ఈమె ఇప్పుడు మరో హీరోయిన్కోసం తన గాత్రాన్ని అరువు ఇయ్యనుంది.
‘ఇష్క్’, ‘మనం’, ‘24’ లాంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు విక్రమ్కుమార్. ముఖ్యంగా సూర్యతో తెరకెక్కించిన 24 సినిమాతో భిన్నమైన ప్రయోగం చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. త్వరలోనే ఈయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విక్రమ్ ఇటీవలే చెన్నయ్కి చెం దిన శ్రీనిధి అనే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగిం ది. ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ వద్ద సౌండ్ ఇంజనీర్గా పనిచేస్తోంది.
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇప్పటికీ మన్మధుడుగా తనదైన ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రొమాంటిక్ సినిమాల్లో చేస్తూనే మరోవైపు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతో కలిపి పోస్టల్ స్టాంప్ను విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియో సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
నిఖిల్ కథానాయకుడు అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై తొలి క్లాప్ అభిషేక్ నామ ఇవ్వగా మధుసూధనరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జెల హరికుమార్రెడ్డి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ 420’. రియాన్ ముస్త్ఫా సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణ్ సందేశ్ వివాహం అయ్యాక విడుదలవుతున్న ఈ చిత్రం తప్పక విజయం సాధించాలన్నారు.
నాగహృషీ ఫిలిమ్స్ పతాకంపై రష్మీగౌతమ్, శాంతన్ జంటగా ఎ.సి.ముగిల్ దర్శకత్వంలో విజయ్ గజగౌని రూపొందిస్తున్న చిత్రం ‘బలపం పట్టి భామ ఒడిలో’ (అఆఇఈ). ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. యూత్ఫుల్ కథనంతో సాగే ప్రేమకథా చిత్రంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని, అనువాదంలో ప్రతి డైలాగ్ తెలుగుతనంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.
‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాల్లో మంచు సరసన నటించిన గ్లామర్ భామ హన్సిక మరోసారి మంచు విష్ణుతో జోడీ కట్టనుంది. ఇటీవలే ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో విజయాన్ని అందుకున్న మంచు విష్ణు రాజ్కిరణ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిథ్రాన్ని నిర్మిస్తున్నారు.
షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీకపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్కుమార్ రూపొందిస్తున్న చిత్రం డర్టీగేమ్. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్టు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాత్రలకు తగిన విధంగా నటీనటులను నిర్మాత ఎంపిక చేశారని, అందుకు అతన్ని అభినందిస్తున్నానని అన్నారు.