S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల విజయంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లంతా అతనితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఆ అవకాశాన్నీ బన్నీ దర్శకుడు హరీష్శంకర్కు ఇచ్చాడు.
బాలీవుడ్లో బయోపిక్ల హవా మామూలుగా లేదు. ఇప్పటికే ఈ తరహా సినిమాలు బాక్సాఫీస్వద్ద దుమ్మురేపుతున్నాయి. దాంతో ఈ సినిమాలకు బాలీవుడ్లో మంచి గిరాకీ ఏర్పడింది. ఈ తరహా స్ఫూర్తినిచ్చే జీవిత కథల అనే్వషణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తుంది హాట్ భామ సోనమ్కపూర్. బాలీవుడ్లో ఈమధ్య కెరీర్ హ్యాపీగా లేని ఈ అమ్మడికి ‘నీర్జా’ సినిమా కాస్త రిలీఫ్ని ఇచ్చింది.
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో క్రిష్ జె.సత్తార్ కథానాయకుడుగా మలయాళంలో రూపొందిన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని శ్రీప్రియ దర్శకత్వంలో రూపొందించారు. ఈ సినిమాను సన్మూన్ క్రియేషన్స్ పతాకంపై వి.ఆర్.కృష్ణ ఎం. తెలుగులో ఘటన పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ..
ప్రాచీ అధికారి, కులకర్ణి మమత, వెంకటేష్గౌడ్, మల్లేష్యాదవ్ ప్రధాన తారాగణంగా శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్గౌడ్, బిరాదర్ మల్లేష్యాదవ్ రూపొందిస్తున్న చిత్రం ‘సుడిగాలి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది.
విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ రష్యాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత జి.హరి మాట్లాడుతూ కోటిన్నర రూపాయల వ్యయంతో భారీ ఛేజ్ని సినిమాకు హైలెట్గా రూపొందిస్తున్నామని, హీరో ఇంట్రడక్షన్ పాటను కూడా ఇక్కడే చిత్రీకరిస్తున్నామని తెలిపారు.
అందాల పోటీల్లో నెగ్గి కన్నడలో తొలి సినిమా ఛాన్స్ కొట్టేసిన కొత్త హీరోయిన్ నక్షత్ర తెలుగులో అవకాశాలు వస్తే నటిస్తానని చెబుతోంది. అందాల పోటీలు అంటే మాటలు కాదు. ఎంతోమంది సుందరీమణులు పోటీపడతారు. అందులో పోటీచేసి విజేతగా నిలవడం అంత సులువైన పనేమీ కాదు. ఆ సెలక్షన్లో ఈసారి మిస్ సౌత్ ఇండియా 2016గా కిరీటం కొట్టేసిన బ్యూటీ ‘నక్షత్ర’. మిస్ సౌత్ ఇండియా టైటిల్ను తను ఊహించలేదనీ..
సూపర్గుడ్ ఫిలింస్ (ఆర్.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘ద్వారక’. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది.
నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ముఖ్యపాత్రల్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘జ్యో అచ్యుతానంద’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ రెజీనాతో ఇంటర్వ్యూ...
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా స్టార్ హీరోలందరితో నటించింది. ఇప్పుడు బాలీవుడ్వైపు కూడా కన్ను వేసింది. ‘బాహుబలి’తో కొత్తగా వచ్చిన ఇమేజ్ను ‘బాహుబలి-2’లో కూడా చూపిస్తానంటోంది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపిన బాహుబలి చిత్రానికి సీక్వెల్గా వస్తోన్న సినిమాలో తమన్నా పాత్ర మరింత పవర్ఫుల్గా వుండబోతోందట.
రామ్శంకర్, నికిషాపటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, వి.్భస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సినిమాలోని టీజర్ పాటను నటుడు ప్రభాస్ ఆర్ఎఫ్సిలో విడుదల చేశారు.