S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇటీవలే గోపీచంద్తో ‘సౌఖ్యం’ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. నందమూరి కళ్యాణ్రామ్, మెగా హీరో సాయిధరమ్తేజ్లతో మల్టీస్టారర్ చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గురువారం దర్శకుడు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్, మడొన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ల కాంబినేషన్లో దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల ఎఫ్.ఎం.
ధన్రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రల్లో ప్రవీణ్ చందర్ నెల్లుట్ల దర్శకత్వంలో ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి రామ్ నిర్మిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రామ్ మాట్లాడుతూ,‘మా బ్యానర్లో వస్తున్న తొలి చిత్రం ఇది.
ప్రముఖ నటుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న ఖైదీ నెం.150 చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్
ఈమధ్య రామ్చరణ్ స్పీడ్ పెంచాడు. ఇప్పటికే ‘ధ్రువ’ సినిమాలో నటిస్తున్నాడు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా దసరాకు విడుదల కానుంది. ధ్రువ సినిమా తరువాత చరణ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్పై రూపొందే ఈ సినిమా అక్టోబర్లో మొదలుకానుంది. ఇక ఇప్పుడు మరో సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు చరణ్.
ధనుష్, రిచా గంగోపాధ్యాయ జంటగా ఓం శివగంగ ఎంటర్ప్రైజెస్ పతాకంపై శ్రీరాఘవ (సెల్వరాఘవన్) దర్శకత్వంలో రూపొందించిన ‘మయక్కం ఎన్నా’ చిత్రాన్ని తెలుగులో కె.బాబురావు, కె.మల్లికార్జున్ ‘మిస్టర్ కార్తీక్’గా అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాలోని పాటలను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో మంగళవారం విడుదల చేశారు.
జనతా గ్యారేజ్ చిత్రంలో నటించడం ఓ మంచి అనుభవాన్ని ఇచ్చిందని, తన సోషల్ మీడియాలో కొరటాల శివకు ధన్యవాదాలు తెలిపారు ఎన్టిఆర్.
హాట్భామ హన్సిక ఈమధ్య కోలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఈసారి ఆమె జతకట్టేది మంచు విష్ణుతో. వరుస ప్లాపుల్లో ఉన్న తనకు ‘దేనికైనా రెడీ’ చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చిన హీరోయిన్ హన్సికతో విష్ణు రెడీ అవుతున్నాడు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ‘గీతాంజలి’ఫేమ్ ‘రాజ్కిరణ్’ తెరకెక్కించనున్నాడు.
సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వర్మ, అలాంటి సంచలనాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా వాస్తవ కథలను సెల్యులాయిడ్ రూపం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. రక్తచరిత్ర, వీరప్పన్, 26/11 వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనున్నారు. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న గ్యాంగ్స్టర్ నరుూం జీవిత కథతో సినిమా చేస్తాడని తెలిసింది.
ధీరు మహేష్, సురేష్, సుదర్శన్ కళాధర్, ప్రియ, ఇషికాసింగ్ ముఖ్యపాత్రల్లో మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మధు, అనీష్, అభిరాం నిర్మించిన చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ సినిమా టీజర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. టీజర్ను నిర్మాత బెక్కం వేణుగోపాల్ విడుదల చేశారు. మోషన్ పోస్టర్ను మాదాల రవి ఆవిష్కరించారు.