S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నవీన్చంద్ర, ప్రియల్గోర్ జంటగా ధర్మరక్ష దర్శకత్వంలో ఐఇఎఫ్ కార్పొరేషన్ పతాకంపై కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చందమామ రావె’. ‘అది రాదు వీడు మారడు’ అనే క్యాప్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ హైదరాబాద్లో విడుదలైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి టీజర్ను విడుదల చేశారు.
నాని, సురభి, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘జెంటిల్మన్’ చిత్రం ఇటీవలే విడుదలై అర్థశతదినోత్సవం పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్లో విజయోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఈ చిత్రం 28 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం పూర్తిచేసుకోవడం ఆనందంగా వుంది.
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా, ప్రస్తుతం భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ‘అభినేత్రి’ చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా డాన్సులకు అందరూ షాక్ అవుతున్నారు.
‘నేను శైలజ’ చిత్రంతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. మొదటి చిత్రానికే భారీ ప్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె, ఆ తరువాత తెలుగులో మరే చిత్రమూ చేయలేదు. ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్న కీర్తికి బంపర్ ఆఫర్ దక్కింది. స్టార్ హీరో సూర్య హీరోగా నటించే చిత్రంలో హీరోయిన్గా అవకాశం దక్కిందట. ప్రస్తుతం సూర్య ‘సింగం-3’ చిత్రంలో నటిస్తున్నాడు.
సందీప్, విజయభాస్కర్, ఆనంద్, పూజిత, సారిక హీరో హీరోయిన్లుగా గణమురళి దర్శకత్వంలో శుభకరి క్రియేషన్స్ పతాకంపై మరిపి విద్యాసాగర్ నిర్మిస్తున్న చిత్రం ‘నినే్న కోరుకుంటా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత మరిపి విద్యాసాగర్ వివరాలు తెలియజేస్తూ, రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ఇది. ప్రస్తుతం యువత ఎలా వుంది?
ఎన్టీఆర్ కొత్త సినిమాపై మీడియా వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, నిజ జీవిత పాత్రలతో ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సినిమాలు తీసే బాల దర్శకత్వంలో నటిస్తాడనేది ఇప్పుడు అందరినీ ఆశ్ఛర్యపరుస్తున్న వార్త. ప్రస్తుతం ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చేసే సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా నిశాంత్ దర్శకత్వంలో మీడియా వాల్ స్టోరీ టెల్లర్స్ పతాకంపై పూదారి అరుణ నిర్మించిన చిత్రం ‘బొమ్మల రామారం’. సెన్సార్తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర నిర్మాత పూదారి అరుణ వివరాలు తెలియజేస్తూ, ఇటీవల విడుదలైన ట్రైలర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా కూడా అనుకున్న విధంగా తెరకెక్కించాం.
రామ్, రాశీఖన్నా జంటగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘హైపర్’. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనే క్యాప్షన్తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది.
పద్నాలుగేళ్లుగా ఏళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో సంతోషం అవార్డుల పేరిట కొండేటి సురేష్ అందిస్తున్న విషయం తెలిసిందే. సంతోషం సినీ వారపత్రిక ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ అవార్డు వేడుకలు ఈనెల 14న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హీరో నిఖిల్, కాథరీన్, తమన్, శివాజీరాజా, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
జ్ఞాన్, సూర్యశ్రీనివాస్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో పరంద్ కళ్యాణ్ దర్శత్వంలో రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భాషా మజహర్ నిర్మిస్తున్న చిత్రం ‘నేనొస్తా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆవిష్కరించారు.