S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘లేడీస్ టైలర్’ సినిమా అప్పట్లో తెలుగు సినిమాలో ఓ సంచలనం. రాజేంద్రప్రసాద్ నట జీవితానికి ఓ పెద్ద మలుపు. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేసే పనిలో ఉన్నారు సీనియర్ దర్శకుడు వంశీ. నిజానికి చాలా రోజులనుండే ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సరైన నిర్మాత దొరకక ఈ సినిమా పోస్ట్పోన్ అవుతూనే వుంది.
మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ‘జనతాగ్యారేజ్’ చిత్ర టీజర్ బుధవారం సాయంత్రం విడుదలైంది.
ముస్లిం వేషధారణలో హీరో ఎన్టీఆర్, మోహన్లాల్ ఇందులో కన్పిస్తారు. పవర్ఫుల్ డైలాగులతో ఈ టీజర్ అభిమానులను
అలరిస్తోంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఈ టీజర్ విడుదల చేశారు.
‘సినిమాలో నటించడం అంటే కేవలం గ్లామర్ను చూపించడమే కాదు. మనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో వాటిని ఎంచుకుని నటించాలి. ఆ విషయంలో నేను పూర్తి విశ్వాసంతో వుంటాను’ అని నటి సురభి తెలిపారు. నాని కథానాయకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన ‘జెంటిల్మన్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికలుగా సురభి, నివేదా థామస్ నటించారు. సురభిని చిత్ర విశేషాలు గూర్చి చెప్పమంటే ఇలా చెప్పారు..
బాహుబలి సినిమాతో స్ఫూర్తిపొందిన చాలామంది దర్శకులు ఇప్పుడు అదే స్థాయిలో భారీ సినిమాల్ని అందించడానికి అడుగులు వేస్తున్నారు. ఈ రేసులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ విజయాల్ని సాధిస్తున్న తమిళ దర్శకుడు సుందర్.సి ముందున్నారు. కొంతకాలంగా ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టు బడ్జెట్ అక్షరాలా 100 కోట్లు.
త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందించిన ‘నాయకి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్రామ్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇజం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇజం టైటిల్ను ఫస్ట్లుక్ను దర్శకుడు పూరి జగన్నాధ్ ట్విట్టర్లో విడుదల చేశారు.
వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మారుతి ద దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ను ఈనెల 9న విడుదల చేయనున్నారు.
సంజీవ్, సాయికృప జంటగా జావన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై సుధాకర్ వినుకొండ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఇద్దరం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 8న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా వినుకొండ సుధాకర్ మాట్లాడుతూ, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందించిన ఈ చిత్రం గ్యాంగ్రేప్ నేపథ్యంలో సాగుతుందని తెలిపారు.
ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్లు హీరో హీరోయిన్లుగా శ్రీ చైత్ర చలన చిత్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కొసరాజు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోందంటూ చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు.
లోకనాయకుడు కమల్హాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ తనదైన స్టైల్లో సినీ రంగంలో దూసుకుపోతోంది. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటనకుగాను ఉత్తమనటి అవార్డును కూడా అందుకుంది. కెరీర్ మొదట్లో ఐరన్లెగ్గా ముద్రపడినా ‘గబ్బర్సింగ్’ పవర్ఫుల్ హిట్తో గోల్డెన్ గాళ్గా మారిపోయింది. వరుస ఆఫర్లతో క్రేజీ స్టార్గా ఎదిగింది.