S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తేజ కాకుమాను (బాహుబలి ఫేం), రేష్మిగౌతం, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను...వచ్చేనంట’. ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ అచ్యుత ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫస్ట్లుక్ను, మోషన్ పోస్టర్ని చూసి చాలామంది మెచ్చుకున్నారు. ఈ చిత్ర రచయిత మరియు నిర్మాత అయిన చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ..
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షిసిన్హా కెరీర్ తొలినాళ్లల్లో భారీగా విజయాలు అందుకొని నటిగా స్థిరపడింది. అప్పట్లో గ్లామర్ పాత్రలకు తాను దూరం అంటూ అనేక కండిషన్లు పెట్టి క్రేజీ హీరోయిన్గా ఎదిగింది. ఆమె నటిస్తే చాలు, సినిమా హిట్ బాటపట్టడంతో ఆమె చెప్పినట్లుగా అందరూ విన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ సినిమా చేసినా అది కెరీర్కు ప్లస్ కాకపోవడంతో, ప్లాపులు ఎక్కువై అవకాశాలు తగ్గిపోయాయి.
సాధారణంగా స్టార్ హీరోల వారసత్వంతో ఎక్కువగా హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చే తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది నిహారికా.. ‘మెగా ఫ్యామిలీ’ అన్న బ్రాండ్వల్ల నిహారిక నటించిన ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. నిహారిక నాగశౌర్యతో కలిసి నటిస్తున్న చిత్రం.. ‘ఒక మనసు’. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారతీయ సినిమా పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయిలో పేరున్న ఫిలిమ్ ఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్లో శనివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషలకు సంబంధించి విడివిడిగా ప్రకటించే ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హెచ్.ఐ.సి.సిలో నిర్వహించారు.
పవన్కళ్యాణ్ తాజాగా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి మొదట తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహిస్తాడని ప్రకటించారు. కానీ సూర్య బిజీగా ఉండడంతో ఆ చిత్రానికి దర్శకుడు మారాడు. ‘గోపాల గోపాల’
చిత్రంతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న డా లీ ఈ చిత్రానికి దర్శకత్వం
ఎ.వి.ఆర్. ఇంటర్నేషనల్ పతాకంపై ఎమ్.డి.నజీమ్ దర్శకత్వంలో నవీద్ఖాన్, శిరీషా, ఛాహత్, రిమా ప్రధాన పాత్రల్లో టీమ్వర్క్ మూవీ మేకర్స్వారి అలీ నిర్మిస్తున్న చిత్రం ‘ఫాలో ఫాలో యూ’. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్తోపాటు ట్రైలర్ ఆవిష్కరణ ఆదివారం ఫిలిం ఛాంబర్లో జరిగింది. నటుడు ఖయ్యూం, సాయివెంకట్ చేతుల మీదుగా ఫస్ట్లుక్, ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. దర్శకుడు ఎమ్.డి.నజీమ్ మాట్లాడుతూ...
మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్వర్మ పాలకపాటి నిర్మాణ నిర్వహణలో తెలుగు, హిందీ భాషలలో ఏక కాలంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఆదివారం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అశోక్కుమార్ మాట్లాడుతూ.. ‘టీజర్లో ప్రతి ఫ్రేం పెర్ఫెక్ట్గా ఉంది. హారర్కు క్రైమ్ను జోడించి తీసిన సినిమా ఇది.
మారుతి టాకీస్ బ్యానర్లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్పై రూపొందుతున్న చిత్రం ‘రోజులు మారాయి’. మారుతి కథ, స్క్రీన్ప్లే అందించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.బి. సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల చేశారు. రాజు తొలి సీడీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ‘మారుతివల్ల ఈ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించా.
బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటుపై హీరోయిన్గా తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. తాజాగా తెలుగు తెరకు పరిచయమై నటించిన చిత్రం ‘జంటిల్మన్’. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, సురభి హీరోయిన్లుగా నటించారు.
తెలుగులోకంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలికి ఈమధ్య టాలీవుడ్లో కూడా మంచి ఇమేజ్ దక్కింది. వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న అంజలి, ఇటీవలే అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘చిత్రాంగద’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఇదిలా వుంటే ప్రస్తుతం కోలీవుడ్లో అంజలిపై ఓ న్యూస్ జోరుగా ప్రచారం సాగుతోంది.