S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం

04/18/2016 - 08:03

ఇస్ర్తి చొక్కా డబ్బూ దస్కం
డాబూ దర్పం మందీ మార్బలం
ఎనె్నన్నో ఉన్నా స్వార్ధం తలపై
కూర్చున్న వాడికి డబ్బే సర్వస్వం
ధర్మానికి జడవక తెగ దోచుకు తింటూ
తాగి జోగే వాడికి నిరుపేదల బాధ వేదన రోదన
వినబడని పాట ఎవరికీ ఎన్నడూ సహాయ మందించక
సమాజ వృక్షాన్నుండి తెగిపడ్డ కొమ్మావాడు
చిగురించడు అతకడు చేతుల్లోని కుర్చీలో

04/18/2016 - 07:59

శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలో మాదొక చిన్న పల్లెటూరు. ఇది ఒక మారుమూల గ్రామం. సరైన కాలంలో వర్షాలు పడకపోవడం వల్ల కరవు కాటకాలు వచ్చాయి. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. సాగు చేయడానికి పొలం ఉన్నా నీరు లేకపోవడంతో భూములు ఎండిపోయాయి. తాగడానికి నీరు లేక ప్రజలందరూ విలవిల్లాడిపోతున్నారు.

04/18/2016 - 07:56

శరీర బరువు మోతకన్నా కష్టాలు కన్నీళ్లు, అపవాదులు, వ్యసనాలు మున్నగువాటిని మోసే మోతే ఎక్కువంటున్న కవి ఇంకా ఇలా అంటున్నాడు. ఎందరో శత్రువులు నాలోనే దాక్కున్నారు. నాలోనే ప్రపంచ యుద్ధాలున్నాయి. వీటన్నింటినీ నిత్యం మోస్తున్నా అన్నీ మోసిన వానికి ఈ మోత ఓలెక్కా? ప్రపంచ మోతలన్నింటీనీ నేనే మోస్తున్నా, నాకు నేనే ప్రళయాన్ని సృస్టించుకుంటాను.

04/18/2016 - 07:54

అక్కడ కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అక్కడ బాధలు భీతిల్లుతున్నాయి. ప్రతి మనిషికీ ఇది నా ఊరు అనేది ఉంటుంది కానీ నాకు లేదు. ఇదే నా బెంగ. ఉండడానికి నాకంటూ ఊరు ఉన్నా అక్కడ నాకంటూ బంధువులు లేరు. అక్కడ నాకంటూ ఉన్న రాళ్లు రప్పలు ఎవరో ఆక్రమించుకుంటున్నారు. వాటి గురించి పోరాడాలనే ఆశయం, ఆశ నాకు లేవు. అయినా పండక్కి అందరూ తమ సొంత ఊరు వెళుతున్నారు. నేను వెళ్లడానికి ఏ ఊరూ లేదు. అనేక సంబరాలు...

04/18/2016 - 07:51

చిన్నారులకు ఆలోచనలు రేకెత్తించేవి, విలువలు పెంచేవి, జ్ఞానవంతులుగా తయారు చేయగలిగేవి కథలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. అయితే చిన్నారులకు సరిపడే కథలను సంకలనం చేసి వాటిని ‘చిట్టెడు చిట్టికథలు’ పేరిట సృజన విశాఖ భావావిష్కరణ వేదికగా మన ముందుకు తెచ్చినవారు గుండాన జోగారావు. దీనిని సాహిత్య సృజనం-5 అనే సంచికగా విడుదల చేశారు.

04/12/2016 - 07:03

విశాఖపట్నం, ఏప్రిల్ 11: విమ్స్ సేవలు ప్రారంభమయ్యాయి. దీనిని సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రూ.115 కోట్లతో నిర్మించిన విమ్స్ ఆసుపత్రిలో పలు విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా కొంతమంది రోగులకు చికిత్స ప్రారంభించారు.

04/12/2016 - 07:02

విశాఖపట్నం, ఏప్రిల్ 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఎడ్యుకేషన్ సిటీకి మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) దృష్టి సారించింది. గంభీరం వద్ద దాదాపు 1100 ఎకరాల్లో నిర్మించనున్న ఈ సిటీకి అవసరమైన విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు ఆదేశించారు. గంభీరం వద్ద ఈ సిటీని నిర్మించనున్నారు. ఇప్పటికే స్థలాన్ని గుర్తించారు.

04/12/2016 - 07:02

విశాఖపట్నం, ఏప్రిల్ 11: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడికి వీలు కల్పించే చర్యల్లో భాగంగా విశాఖలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో ఈ మేరకు అవయవ మార్పిడి కేంద్రాన్ని (ఒటిసి) త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన భవనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తే త్వరలోనే పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించనుంది. చాలా కాలంగా ఒటిసి ఏర్పాటు చేయమని అవయవ దానాన్ని ప్రొత్సహించే సంస్థలు ఆందోళన చేస్తున్నాయి.

04/12/2016 - 07:01

విశాఖపట్నం, ఏప్రిల్ 11: జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రాయూనివర్శిటీలో సోమవారం జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతి కార్యక్రమం అనంతరం ఆయన ఎయులోనే అధికారిక చర్చలో పాల్గొన్నారు.

04/12/2016 - 07:00

విశాఖపట్నం, ఏప్రిల్ 11: అసమానతలు లేని సమసమాజ స్థాపనే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 190వ జయంతిని పురస్కరించుకుని ఎయు కాన్వొకేషన్ హాలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని భరోసానిచ్చారు.

Pages