-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
శ్రీనగర్, జూలై 10: జమ్మూకాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు మిలిటెంట్లను మట్టుబెట్టాయి. మంగళవారం ఉదయం భద్రతాదళాలు, మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక జవాన్ గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. కుందుల్లాన్ గ్రామంలో జరిగిన ఘర్షణల్లో ముగురు పౌరులు గాయపడ్డారు.
న్యూఢిల్లీ, జూలై 10: మనదేశంలో ప్రాచీన భాషలకు రానురాను ఆదరణ తగ్గుతుంది. మున్ముందు వీటి మనుగడే కష్టమవుతుందేమోనని భాషాభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా సంస్కృతం, పాళి, ప్రాకృతి భాషలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వీటిమీద అభిమానంతో డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు చదివిన వారు తమ కెరీర్ పట్ల ఆందోళన చెందుతున్నారు.
న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్కు మధ్య మళ్లీ లడాయి మొదలైంది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) ఆదేశాలు జారీ చేశారు. గత వారమే సుప్రీంకోర్టు ఎల్జీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని తీర్పు ఇచ్చిన విషయం విదితమే. తీర్పు నేపథ్యంలో వివాదం సద్దుమణుగుతుందనుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 10: కొరియా ద్వీపకల్పంలో శాంతి సాధన ప్రక్రియలో భారత్ ప్రధాన భూమిక వహిస్తుందని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారేందుకు భారత్ తన వంతు కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జీతో చర్చలు జరిపారు. దక్షిణ కొరియా, భారత్ మధ్య సంబంధాలు బలపడాలని, ఈ రెండు దేశాల మధ్య మైత్రి పటిష్టంగా ఉందని చెప్పారు.
న్యూఢిల్లీ, జూలై 10: పార్లమెంట్ ప్రతిష్టను కాపాడేందుకు ఎంపీలు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ విజప్తి చేశారు. గతంలో వారు గొడవ చేశారు కాబట్టి తామిప్పుడు గొడవ చేస్తామనే వాదన ఎంతమాత్రం మంచిది కాదని ఆమె స్పష్టం చేశారు. ఎంపీలు నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సుమిత్రా మహాజన్ హితవు చెప్పారు.
న్యూఢిల్లీ, జూలై 10: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో బీజేపీ లేదా బీజేపీ సమర్థించే అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రకటించారు. మంగళవారం విజయసాయి రెడ్డి, శాసన మండలి సభ్యుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ లా కమిషన్ను కలిసి జమిలి ఎన్నికలపై పార్టీ విధానాన్ని తెలియజేశారు.
న్యూఢిల్లీ: లోక్సభ, శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించే ప్రతిపాదనను వైఎస్ఆర్సీపీ సమర్థించింది. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, శాసన మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మంగళవారం లా కమిషన్ను కలిసి జమిలి ఎన్నికలను పార్టీ సమర్థిస్తోందని తెలిపారు. వారీ మేరకు లా కమిషన్కు పార్టీ లేఖను అందజేశారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సులభతర వ్యాపార విధానంలో మొదటి స్థానం, రెండో స్థానం దక్కింది. మూడో స్థానం హర్యానా, నాలుగో స్థానం గుజరాత్ రాష్ట్రాలకు దక్కాయి. కేంద్ర వాణిజ్య శాఖ డీఐపీపీ కార్యదర్శి రమేష్ అభిషేక్ మంగళవారం ఒక కార్యక్రమంలో రాష్ట్రాలు సాధించిన ర్యాంకులను ప్రకటించారు.
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు సంబంధించి కేసులను త్వరితగతిన విచారించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదిస్తోంది. హోం కార్యదర్శితో చర్చల అనంతరం ఆ శాఖ ప్రత్యేక ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడానికి ఈ మేరకు ఒక నివేదికను సిద్ధం చేసింది.
న్యూఢిల్లీ: సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. ఈమేరకు ఆమె పార్లమెంటు సభ్యులకు లేఖలు రాశారు. గత పార్లమెంటు సమావేశాలు జరగకపోవటంతో పాటు ఎలాంటి తీర్మానాలు లేకుండా వాయిదా పడిన విషయం విదితమే. సభ సజావుగా నిర్వహించటం పట్ల ఎంపీలకు ఉన్న బాధ్యతను ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.