S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/12/2020 - 05:34

బెంగళూరు: కర్నాటకలో కరోనా వైరస్ సోకిన 76 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అధికారులు మాత్రం అతని మృతికి స్పష్టమైన కారణాలు ప్రకటించలేదు. కాల్‌బురిగి జిల్లా ప్రధాన కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సదరు వ్యక్తి ఇటీవలే సౌదీ అరేబియా నుంచి భారత్‌కు వచ్చాడని కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బీ శ్రీరాములు ప్రకటించారు. అయితే, కరోనా వైరస్‌తోనే అతను మృతి చెందాడు అని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలేవీ లేవని అన్నారు.

03/12/2020 - 05:33

న్యూఢిల్లీ, మార్చి 11: ‘నేను కాంగ్రెస్ పార్టీలో సాధారణ నాయకుడిని మాత్రమే. నన్ను ఎవరైనా, ఎప్పుడైనా కలవచ్చు. ఇందులో అనుమానాలకు తావులేదు’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరడానికి ముందు జ్యోతిరాదిత్య సింధియా పలుమార్లు రాహుల్ గాంధీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన సమయాన్ని కేటాయించలేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

03/12/2020 - 05:31

న్యూఢిల్లీ, మార్చి 11: అధికార, ప్రతిపక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బుధవారం ఏడుగురు కాంగ్రెస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఉపహరించుకున్నారు. ఈ నెల 2న లోక్‌సభలో ప్రతిపక్షాల సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరుకు బాధ పడిన స్పీకర్ ఓం బిర్లా ఆ రోజు నుంచి బుధవారం ఉదయం వరకు లోక్‌సభ నిర్వహణకు దూరంగా ఉండిపోయారు.

03/12/2020 - 05:29

న్యూఢిల్లీ, మార్చి 11: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివిధ రాష్ట్రాలలోని ప్రతిపక్షాల శాసన సభ్యులను కొనుగోలు చేస్తోందని, ప్రతిపక్షాల ప్రభుత్వాలను చోరీ చేస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు ఆనంద్ శర్మ ఆరోపించారు. ఆనంద్ శర్మ పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సుమావేశంలో మాట్లాడుతూ మధ్య ప్రదేశ్‌లో కాంగ్రెస్ శాసన సభ్యులను బీజేపీ అపహరించిందని ఆరోపించారు.

03/12/2020 - 05:57

న్యూఢిల్లీ, మార్చి 11: కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మధ్యప్రదేశ్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా బుధవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్న వెంటనే ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీలో చేరగానే బీజేపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చి రికార్డు సృష్టించింది. ప్రధాని మోదీ చేతుల్లో దేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నదని సింధియా కితాబు ఇచ్చా రు.

03/12/2020 - 00:31

*చిత్రం...పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో బుధవారం ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్న ప్రతిపక్ష పార్టీల సభ్యులు

03/12/2020 - 06:49

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు. బీజేపీ అధినాయకత్వం బుధవారం ఈమేరకు ప్రకటన చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ స్థానంలో సంజయ్‌ను నియమించారు. సంజయ్ కూడా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. యువతలో గట్టి పట్టున్న బండి సంజయ్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో మంచి సంబంధాలున్నాయి.

03/11/2020 - 23:31

న్యూఢిల్లీ, మార్చి 11: కరోనా వైరస్ కుదిపేస్తున్న ఇటలీ, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అయితే ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించడానికి ముందుగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించి, వైరస్ లేదని నిర్ధారించుకుంటామన్నారు.

03/11/2020 - 23:30

న్యూఢిల్లీ, మార్చి 11: చైనా నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు వ్యాప్తి చెందుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల భారత్‌కు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత పరిశ్రమలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా అందించిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

03/11/2020 - 23:30

భోపాల్, మార్చి 11: మధ్యప్రదేశ్‌లో 52 ఏళ్లనాటి పరిస్థితులు పునరావృతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సింధియా కుటుంబీకులే ఈ భారీ సంచలనాలకు కారకులు కావడం విశేషం. అప్పట్లో గ్వాలియర్ సంస్థానానికి చెందిన ‘రాజమాత’ విజయరాజే సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఆ వంశానికే చెందిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

Pages