-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణానికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ ఎండీ చందాకొచ్చర్కు,యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖాశర్మకు సమన్లు జారీ అయ్యాయి. ఇప్పటి వరకు 16మంది అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: తెలుగు ఎంపీల ఆందోళనలతో మంగళవారం ప్రారంభమైన ఉభయ సభలు కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ టీడీపీ ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లి ఆందోళన చేశారు. అలాగే మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఆందోళన చేయటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
ముంబై: అలనాటి బాలీవుడ్ నటి షమీ మృతిచెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారంనాడు తుదిశ్వాస విడిచారు. 18ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన షమ్మి తొలి చిత్రం ఉస్తాద్షెడో. ఆ తరువాత మల్హర్ చిత్రంలో కథానాయికగా నటించారు. ఇంకా ఖుదాగవా, కూలీ నెం.1, హమ్ తదితర చిత్రాల్లో నటించారు. షమ్మి మృతికి పలువురు బాలీవుడ్ నటులు సంతాపం తెలిపారు.
అహ్మదాబాద్: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాద్ నగర్ సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న ఓ ట్రక్కు బోల్తాపడిన ఘటనలో 25మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. దాదాపు 60మందితో వెళుతున్న ఈ పెళ్లి బృందం ట్రక్కు వంతెనపై నుంచి బోల్తా పడటంతో దాదాపు 25మంది చనిపోయారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడివుండటంతో అక్కడ భీతివాహ వాతావరణం నెలకొన్నది.
న్యూఢిల్లీ, మార్చి 5: ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీ ఘోర పరాజయంపై ఎట్టకేలకు ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు రోజుల తర్వాత రాహుల్ గాంధీ వౌనాన్ని వీడారు. ‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు, ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ముంబయి, మార్చి 5: ఇంటర్ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థినుల పట్ల తనిఖీల పేరుతో అసభ్యకరంగా ప్రవర్తించిన తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయ. మహారాష్టల్రో లోనీ కల్బూర్లో ఎంఐటీ ఆధ్వరంలో నడుస్తున్న ఓ పాఠశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. 12వ తరగతి పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థునుల తనిఖీలు శ్రుతి మించాయి. తమ దుస్తులు తొలగించి మరీ తనిఖీలు చేశారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, మార్చి 5: ప్రేమ చిహ్నంగా ప్రఖ్యాతి పొందిన చారిత్రాక కట్టడం తాజ్మహల్ సందర్శకులను కేంద్రం ఒకింత ఉపశమనం కలిగించింది. సూర్యోదయానికి 45 నిమిషాల ముందే సందర్శన టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ ప్రకటించారు. సూర్యోదయ సమయంలో తాజ్ అందాలు చూడటం ఓ అద్భుత అనుభూతి.
న్యూఢిల్లీ, మార్చి 5: వివాదాస్పద డోక్లామ్ ప్రాంతంలో చైనా హెలిప్యాడ్లను ఇతర వౌలిక సదుపాయాలను భారీగానే నిర్మించుకుంటోందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. డోక్లామ్పై తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఇరు దేశాల దళాలు దూరంగా వైదొలిగాయని కానీ తాజాగా తమ సైనిక దళాల అవసరాలకోసం చైనా ఈ నిర్మాణ పనులను చేపట్టిందని తెలిపారు.
న్యూఢిల్లీ, మార్చి 5: లగ్జరీ రైళ్లలో సామాన్యులూ ప్రయాణించేందుకు వీలుగా భారతీయ రైల్వే శాఖ ఆ రైళ్ల చార్జీలను సగానికి సగం తగ్గించేందుకు నిర్ణయించింది. దేశంలో లగ్జరీ రైళ్లు ప్యాలెస్ ఆన్ వీల్స్, గోల్డెన్ చారియట్, మహారాజా ఎక్స్ప్రెస్ తదితర రైళ్లలో సామాన్యులతోపాటు విదేశీ యాత్రికులు ప్రయాణించేందుకు వీలుగా చార్జీలను తగ్గించనున్నారు.
న్యూఢిల్లీ, మార్చి 5: పది, పనె్నండు తరగతుల పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెబుతూ సోమవారం ట్వీట్ చేశారు. విశ్వాసంతో, చిరునవ్వుతో పరీక్షలు రాయాలని కోరారు. గతంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా మోదీ వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకు యత్నించారు.