S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/24/2017 - 02:18

న్యూఢిల్లీ, నవంబర్ 23: డిజిటల్ టెక్నాలజీ ఆధునిక సశక్తీకరణ మంత్రం, ఆర్థిక, వ్యాపారాభివృద్దికి తోడ్పడటంతోపాటు వ్యవసాయాదాయం పెంచేందుకు కూడా సహకరిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర ఉద్ఘాటించారు. అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతున్న డిజిటల్ టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

11/23/2017 - 00:52

అనంతపురం, నవంబర్ 22: శాంతి, సామరస్యత లేనిదే సమాజంలో అభివృద్ధి లేదని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమను ప్రబోధించి సమాజాన్ని ప్రశాంతమార్గంలో నడిపించిన సత్యసాయిబాబా ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని భారత ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.

11/22/2017 - 23:57

హైదరాబాద్, నవంబర్ 22: ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు భారత్‌కు బాగా కలిసొచ్చేలా ఉంది. అమెరికాతో పలు అంశాల్లో ధృడమైన అనుబంధం పెరగడంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న అరమరికలు తగ్గి స్నేహబంధం పెరిగేందుకు తోడ్పడేలా ఈ సదస్సు ఒక వేదిక కాబోతోంది.

11/22/2017 - 23:35

అందం ఆనందమవగ
చందంగా బౌద్ధికతయు విందేజేయన్
పందెం గెలిచెను మానుషి
చిందేసెను దేశమంత వందేయనుచున్!

11/22/2017 - 23:31

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే
ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లుకు కేంద్రం కసరత్తు
శీతాకాల సమావేశాల వాయిదాను సమర్థించుకున్న బీజేపీ

11/22/2017 - 22:22

న్యూఢిల్లీ, నవంబర్ 22: పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్యక్షుడు హార్దిక్ పటేల్‌తో సీట్ల సర్దుబాటు కుదరటంతో కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురించాయి. పటేల్ వర్గాన్ని బీసీల జాబితాలో చేర్చే అంశంపై బహిరంగంగా హామీ ఇవ్వకుండానే హార్దిక్ పటేల్‌ను దారికి తీసుకురాగలిగినందుకు కాంగ్రెస్ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

11/22/2017 - 22:22

అహమ్మదాబాద్, నవంబర్ 22: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ‘పటీదార్ కోటా ఉద్యమ నేత’ హార్దిక్ పటేల్ ఎట్టకేలకు బుధవారం ప్రకటించారు. ఎన్నికల్లో గెలిస్తే పటేల్ సామాజిక వర్గానికి ‘ప్రత్యేక కేటగిరీ’ కింద రిజర్వేషన్ల సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆయన తెలిపారు.

11/22/2017 - 22:21

న్యూఢిల్లీ, నవంబర్ 22: అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసి వచ్చేనెల 6వ తేదీ నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజు దేశవ్యాప్తంగా ‘బ్లాక్ డే’ పాటించాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఉద్దేశ పూర్వకంగానే బాబ్రీ మసీదును కూల్చివేసినందుకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ (ఎం), సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఎఎల్‌ఎఫ్‌బీ, సిపిఐ (ఎంఎల్), ఎస్‌యుసీఐ (సీ) పార్టీలు బుధవారం ప్రకటించాయి.

11/22/2017 - 22:20

లక్నో, నవంబర్ 22: అయోధ్యలో ఇరవై ఏడేళ్ల క్రితం కరసేవకులపై పోలీసు కాల్పులకు ఆదేశించడాన్ని అప్పటి యూపీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సమర్థించుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదుపై దాడికోసం కరసేవకులు వెల్లువలా తరలివచ్చారు. ఆనాడు అక్కడ నెలకొన్న పరిస్థితుల్లో కాల్పులకు ఆదేశించిడం సరైన చర్యేనని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం స్పష్టం చేశారు.

11/22/2017 - 22:19

గాంధీనగర్, నవంబర్ 22: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ కూడా పద్మావతి సినిమాను నిషేధించింది. ఇప్పటికే ఈ సినిమాను నిషేధించిన రాజస్తాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానే్న మూడో బిజెపి పాలిత రాష్టమ్రైన గుజరాత్ కూడా అనుసరించింది. ‘పద్మావతి సినిమా విడుదలను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదు. ఈ సినిమా నిర్మాణంతో రాజ్‌పుత్‌ల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Pages