S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/01/2017 - 02:48

న్యూఢిల్లీ, ఆగస్టు 25: గర్భంలోని శిశువు కారణంగా తల్లి ప్రాణాలకు ముప్పు ఎదురవుతుందన్న వైద్యుల నివేదిక ఆధారంగా ఓ తల్లి తన 25 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. సాధారణంగా ఆరు నెలలకు పైబడిన గర్భాన్ని తొలగించుకోవడానికి చట్టం అనుమతించదు.

09/01/2017 - 02:46

చండీగఢ్, ఆగస్టు 31: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కేసులో అయిదుగురు హర్యానా పోలీసులను హర్యానా ప్రభుత్వం బర్తరఫ్ చేసింది. గుర్మీత్‌ను పోలీస్ కస్టడీ నుంచి తప్పించే ప్రయత్నం చేసినందుకు ఏడుగురిపై దేశద్రోహం, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వీరిలో అయిదుగురు పోలీసులు కూడా ఉన్నారు.

09/01/2017 - 02:45

న్యూఢిల్లీ, ఆగస్టు 31: మహిళ గర్భంలో బిడ్డ ఎదుగుదల లేనందున అబార్షన్‌కు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. పూణెకు చెందిన ఓ మహిళకు ఉపశమనం కలిగిస్తూ జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. పూణెకు చెందిన బిజె ప్రభుత్వం మెడికల్ కళాశాల నివేదికను పరిశీలించిన బెంచ్ 24 వారాల పిండాన్ని తొలగించుకోడానికి అనుమతి తెలిపింది. 20 ఏళ్ల యువతి గర్భం దాల్చింది.

09/01/2017 - 02:45

న్యూఢిల్లీ, ఆగస్టు 31: సిబిఐ డైరెక్టర్ నియామకానికి సంబంధించిన వివరాలు ఇవ్వడానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ వాఖ నిరాకరించింది. సమాచార హక్కు చట్టంలోని గోప్యత క్లాజు ప్రకారం ఈ వివరాలు ఇవ్వడానికి వీల్లేదంటూ వివరాలు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ నిరాకరించింది.

09/01/2017 - 02:32

న్యూఢిల్లీ, ఆగస్టు 31: రద్దయిన 500,1000 రూపాయల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి తాజాగా ఎలాంటి గడువు ఇచ్చే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం తేల్చిచెప్పింది. రద్దయిన కరెన్సీ అంతా బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చేస్తుందన్న ఉద్దేశంతోనే గతంలో గడువు ఇవ్వడం జరిగిందని, తాజాగా అలాంటి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది.

09/01/2017 - 03:01

ముంబయి, ఆగస్టు 31: ఓ వైపు భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మరో ఘోరం సంభవించింది. గురువారం ఉదయం దక్షిణ ముంబయిలోని భిండీబజార్‌లో అయిదంతస్తుల పురాతన నివాస భవనం కుప్పకూలిపోవడంతో 16 మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ఇప్పటివరకు 26 మందిని శిథిలాల కిందినుంచి వెలికి తీశారు. అయితే మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.

09/01/2017 - 00:56

నెల్లూరు/సూళ్లూరుపేట, ఆగస్టు 31: వరుస విజయాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చుకొన్న ఇస్రోకు చాలాకాలం తరువాత ఎదురుదెబ్బ తగిలింది. ఒకటి రెండు కాదు ఏకంగా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించడమే కాకుండా భారీ ప్రయోగాలను సైతం సునాయాసంగా విజయాలను అందుకొన్న ఇస్రోకు తన నమ్మిన బంటు పిఎస్‌ఎల్‌వి ప్రయోగం విఫలమవడంతో నిరాశ మిగిల్చింది. 24 ఏళ్లగా పిఎస్‌ఎల్‌విల వరుస విజయపరంపరలకు షార్‌లో బ్రేకు పడింది.

09/01/2017 - 00:51

న్యూఢిల్లీ,ఆగస్టు 31: కేంద్ర మంత్రివర్గాన్ని శనివారం మధ్యాహ్నం పునర్‌వ్యవస్థీకరించాలనుకుంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొందరు మంత్రుల రాజీనామాలు తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కనీసం ఐదుగురు మంత్రుల చేత మోదీ రాజీనామా చేయించే అవకాశాలున్నాయని బిజెపి నాయకులు అనధికారికంగా చెబుతున్నారు.

08/31/2017 - 01:50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లపై సుప్రీం కోర్టు నవంబర్‌లో విచారణ జరుపుతుంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడానికి ఆధార్‌ను సమర్పించే గడువును డిసెంబర్ 31 దాకా పొడిగించనున్నట్లు కేంద్రం న్యాయస్థానానికి తెలియజేసింది.

08/31/2017 - 01:50

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల్లోని కొన్ని పోస్టులకు కూడా క్రీమీలేయర్ పరిధిని విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఈ అధికారులు, వారి కుటుంబ సభ్యులు ఒబిసి కేటగిరీ కింద లభించే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి వీలుండదు.

Pages