S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/31/2017 - 01:49

న్యూఢిల్లీ: అవసరమైనప్పుడు ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా డివిజన్ రైల్వే మేనేజర్లకు (డిఆర్‌ఎం) మరిన్ని అధికారాలు ఇవ్వాలని రైల్వే సురేశ్ ప్రభు ఏర్పాటు చేసిన ఒక కమిటీ తన ముసాయిదా నివేదికలో సిఫార్సు చేసింది. ఆగస్టు నెలలో వరసగా సంభవించిన రైలు ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ సిఫార్సు చేసింది.

08/31/2017 - 01:49

హర్దా: మధ్యప్రదేశ్‌లోని హర్దా పట్టణంలో ముస్లింలు ఓ హిందూ ఆలయానికి సౌండ్ సిస్టమ్ బహూకరించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఇండోర్ రోడ్‌లో అభయదాత హనుమాన్ మందిర్ ఉంది. ఆలయంలోని సౌండ్ సిస్టమ్ చోరీకి గురైంది. లౌడ్ స్పీకర్లు దొంగలు ఎత్తుకెళ్లారని ఆలయ పూజారి దీపక్ ఉప్రిత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయం నుంచి నిత్యం భక్తి పాటలు వినిపిస్తాయి. గత ఆదివారం నుంచి నిశబ్ద వాతావరణం నెలకొంది.

08/31/2017 - 01:49

చెన్నై: తమిళనాడు సిఎం పదవి నుంచి తక్షణమే వైదొలగడం ఎంతైనా మంచిదంటూ పళనిస్వామికి శశికళ బంధువుటిటివి దినకరన్ తీవ్ర స్వరంతోహెచ్చరించారు. లేనిపక్షంలో అన్నాడిఎంకెలో తనకు ఉన్న అజ్ఞాత మద్దతుదారులను తెరమీదకు తెస్తానని చెప్పారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలోని అధికార అన్నాడిఎంకెలో కొనసాగుతున్న కుమ్ములాటలు దినకరన్ బుధవారం చేసిన హెచ్చరికతో ఆసక్తికర మలుపుతిరిగాయి.

08/31/2017 - 01:48

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పాఠశాలలు, కాలేజిలు, గ్రామసభల్లో అవినీతికి వ్యతిరేకంగా చైతన్యం తీసుకు వచ్చే బాధ్యతను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలకు అప్పగించింది. ఇందుకోసం ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థ, బ్యాంక్, బీమా కంపెనీలకు కొన్ని నగరాలను కేటాయిస్తూ సివిసి ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.

08/31/2017 - 01:48

న్యూఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ సింగ్ అరెస్టు తరువాత జరిగిన హింసకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తోసిపుచ్చారు. అల్లర్లను అరికట్టడంలో తమ ప్రభుత్వం సమర్థవంతంగానే పనిచేసిందని బుధవారం ఆయన చెప్పుకున్నారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమైన ఖట్టర్ తరువాత మీడియాతో మాట్లాడారు.

08/31/2017 - 01:53

ముంబయి: మంగళవారం ఎడతెగకుండా కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన ముంబయి మహానగరం బుధవారం వర్షాలు కాస్త తెరపినివ్వడంతో క్రమంగా కోలుకొంటోంది. ఎడతెరపి లేని కుండపోత వర్షాలు.. బలమైన ఈదురు గాలులు, రోడ్లపై నడుంలోతు నీళ్లతో ముంబయి నగర వాసులు మంగళవారమంతా నరకయాతన అనుభవించారు.

08/31/2017 - 01:30

న్యూఢిల్లీ: ఎట్టకేలకే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్టు తెలిసింది. సెప్టెంబర్ 1న తిరుమల వెళ్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, 2న మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. నరేంద్ర మోదీ సెప్టెంబర్ 3న చైనాలో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు.

08/31/2017 - 01:30

న్యూఢిల్లీ: భారత సైనిక దళాల్లో భారీ సంస్కరణలకు నాందిపడింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత సైనిక దళాల్లో ప్రభుత్వం పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టడం ఇదే తొలిసారి. సైనిక దళాల యుద్ధ నైపుణ్యాలను పెంచేందుకు తీసుకోవలసిన చర్యలను సిఫారసు చేసేందుకు రిటైర్డ్ ఎల్‌జి డాక్టర్ డిబి శెకట్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన 99 సిఫారసుల్లో 65 సిఫారసులను అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

08/31/2017 - 01:29

న్యూఢిల్లీ: దేశంలో విప్లవాత్మక రీతిలో చేపట్టిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) విధానం దిగ్విజయంగా అమలవుతోందని, దీనిపై మొదట్లో తలెత్తిన సందేహాలు, అపోహలు, భయాలు పటాపంచలయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత రెండు నెలలుగా పరోక్ష పన్నుల వ్యవస్థ అద్భుతంగా అమలు అవుతోందని, పాత వ్యవస్థ స్ధానంలో ఈ మార్పు అత్యంత సజావుగా ఇమిడిపోయిందన్నారు.

08/31/2017 - 01:28

న్యూఢిల్లీ: గత ఏడాది నవంబర్‌లో రద్దయిన 1000, 500 నోట్లలో 99 శాతం వెనక్కి వచ్చేశాయని రిజర్వ్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. 15.28 లక్షల కోట్ల విలువైన 15.44 లక్షల కోట్ల కరెన్సీ నోట్లు తిరిగి వచ్చేసినట్టు బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. అంటే 99శాతం రద్దయిన నోట్లు తిరిగి వ్యవస్ధలోకి వచ్చేసినట్టేనని వివరించింది.

Pages