S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/31/2017 - 01:28

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తలపెట్టిన నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్ )కేంద్రం నుంచి గురువారం రాత్రి 7గంటలకు పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ ప్రయోగం జరగనుంది.

08/30/2017 - 02:52

రోహ్‌తక్, ఆగస్టు 29: రెండు అత్యాచారాల కేసుల్లో 20 ఏళ్ల పాటు జైలు శిక్షకు గురైన డేరా బాబా గుర్మీత్ సింగ్ సోమవారం రాత్రంతా సురేనియా జైల్లో వౌనంగానే గడిపారు. రాత్రంతా ఆయన భోజనం చేయలేదని, కేవలం మంచినీళ్లు తాగే జైలు గదిలో పచార్లు చేశారని అధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. అయితే నేటి ఉదయం మాత్రం పాలు తీసుకున్నారని స్పష్టం చేశారు.

చిత్రం..డేరా సచ్చా సౌదా ప్రధాన భవనం

08/30/2017 - 02:50

సిర్సా, ఆగస్టు 29: హర్యానాలోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం క్రమేణా ఖాళీ అవుతోంది. పాత ప్రధాన కార్యాలయంలో ఉన్న డేరా సచ్ సౌదా సిబ్బంది అంతా బైటికి వచ్చేయడంతో విశాలమైన కొత్త కాంప్లెక్స్‌లో ఇంకా ఉన్న దాదాపు 200 మందిని సైతం ఖాళీ చేయించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

08/30/2017 - 02:45

అసన్‌గావ్, ఆగస్టు 29: ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రైలు ప్రమాదాలు నివారించలేకపోతోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నాగ్‌పూర్- ముంబయి మధ్య నడిచే దురంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

08/30/2017 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ఆధార్ చట్టాన్ని ద్రవ్య బిల్లుగా ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం స్పందించింది. ఇటీవల తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ప్రైవసీని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ ఇచ్చిన తీర్పును ముందుగా అధ్యయనం చేసిన తరువాత ఆధార్ పిటిషన్‌ను విచారిస్తామని స్పష్టం చేసింది.

08/30/2017 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 29: న్యాయ వ్యవస్థ పనితీరుకు ఎప్పటికప్పుడు పదును పెట్టే రీతిలో న్యాయ పనితీరు సూచీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ సూచించింది. ముఖ్యంగా దిగువ న్యాయస్థానాల్లో పేరుకుపోతున్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు జాప్యాన్ని నివారించడానికి కూడా ఈ సూచీ ఎంతగానో ఉపకరిస్తుందని స్పష్టం చేసింది.

08/30/2017 - 02:37

న్యూఢిల్లీ, ఆగస్టు 29: బ్రిక్స్ దేశాల సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 3-5 తేదీల్లో బ్రిక్స్ సమ్మిట్ జరుగుతోంది. డోక్లామ్‌లో 73 రోజులపాటు నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు సడలిపోయిన నేపథ్యంలో మోదీ పర్యటన జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

08/30/2017 - 02:36

న్యూఢిల్లీ, ఆగస్టు 29: అన్నాడిఎంకె ఎన్నికల గుర్తు రెండాకులకోసం పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ మంగళవారం మరోసారి ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారు. ఎన్నికల గుర్తుపై ఓ నిర్ణయం తీసుకునే ముందు ఓసారి తన వాదన వినాలని దినకరన్ అభ్యర్థించారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల వర్గాలు విలీనమై శశికళ, ఆమె బంధువు దినకరన్‌లను కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

08/30/2017 - 02:36

చెన్నై, ఆగస్టు 29: రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మురుగన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మొత్తం మెడికల్ రిపోర్ట్‌ను సమర్పించాలని మద్రాసు హైకోర్టు మంగళవారం జైలు అధికారులను ఆదేశించింది.

08/30/2017 - 02:12

సూళ్లూరుపేట, ఆగస్టు 29: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తలపెట్టిన పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. నెల్లూ రు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి ఈ నెల 31న పిఎస్‌ఎల్‌వి-సి 39 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.

Pages