S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/29/2017 - 02:23

పుణె, ఆగస్టు 28: మహారాష్టల్రోని పుణె జిల్లాలో సంభవించిన సోమవారం తెల్లవారుజామున ఘోరప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 12 మంది గాయపడ్డారు. నాసికా త్రయంబకేశ్వర్‌నుంచి పుణె వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాం సంస్థకు చెందిన బస్సు నారాయణ్ గావ్ సమీపంలో ఆగి ఉన్న టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని నారాయణ్ గావ్ పోలీసులు చెప్పారు.

08/29/2017 - 02:22

న్యూఢిల్లీ/వాషింగ్టన్, ఆగస్టు 28: హార్వే హరికేన్ అమెరికాను వరదలతో ముంచెత్తింది. హోస్టన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో దాదాపు 200మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం తెలిపారు. షాలిని, నిఖిల్ భాటియా అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు అనారోగ్యం పాలు కావటంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారని ఆమె పేర్కొన్నారు.

08/29/2017 - 02:28

న్యూఢిల్లీ, ఆగస్టు 28: తన డ్రీమ్ స్కీం జన్‌ధన్ పథకం ద్వారా లక్షలాది ప్రజల ఆకాంక్షలకు రెక్కలు వచ్చాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జన్‌ధన్ పథకం ప్రారంభించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో దీనిపై వ్యాఖ్యానించారు. ఈ పథకం సామాజిక సురక్ష పథకాల్లో ఒకటని పేర్కొన్నారు.

08/29/2017 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 28: గోవాలో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పనాజీలో భారీ ఓట్లతో గెలుపొందారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణె వాల్పోయ్ స్థానాన్ని గెలుచుకున్నారు. అటు ఢిల్లీలోని బావనా నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నిక ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ ఉత్తేజాన్నిచ్చింది. ఈ స్థానంలో ఆప్ ఘనవిజయం సాధించింది.

08/29/2017 - 02:15

రోహ్‌తక్, ఆగస్టు 28: అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌదా అధినేత, వివాదాస్పద గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్షను విధించగానే గుర్మీత్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. జడ్జి శిక్షలను ప్రకటించిన వెంటనే గుర్మీత్ సింగ్ కోర్టు గదిలో ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయి భోరున విలపిస్తూ‘ ముఝే మాఫ్ కర్ దో’(నన్ను క్షమించండి) అంటూ జడ్జిని వేడుకున్నాడు.

08/29/2017 - 02:38

చండీగఢ్, ఆగస్టు 28: అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారించిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శిక్షను ఖరారు చేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనా జరగలేదని హర్యానా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

08/29/2017 - 02:11

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మహారాష్ట్ర రాజకీయ గురువు, ఎన్‌సిపి అధినాయకుడు శరద్ పవార్ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ సెప్టెంబర్ 3న చైనాలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి వెళ్లేముందే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

08/29/2017 - 01:57

న్యూఢిల్లీ, ఆగస్టు 28: నూతన విద్యా విధానం అమలులో భాగంగా రానున్న రోజుల్లో పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై పాఠ్యాంశాలను చేర్చడం ద్వారా విద్యార్థులను చైతన్య పరచాలని కేంద్రం యోచిస్తోంది.

08/29/2017 - 01:45

సూళ్లూరుపేట, ఆగస్టు 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తలపెట్టిన నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగానికి శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 31న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి సి39 రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి చెందిన రిహార్సులను సోమవారం విజయవంతంగా నిర్వహించారు.

08/29/2017 - 01:28

చెన్నై, ఆగస్టు 28: రోజుకో మలుపుతిరుగుతున్న తమిళ రాజకీయాల్లో సోమవారం మరో కొత్త అంకానికి తెరలేచింది. శశికళ, ఆమె మేనల్లుడిని పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లుగా అన్నాడిఎంకె పార్టీ ప్రకటించింది. సోమవారం జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి హోదాలో శశికళ ఇప్పటివరకు జరిపిన నియామకాలేవీ చెల్లవని ప్రకటించారు.

Pages