S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/20/2017 - 03:57

కోహిమా, జూలై 19: నాగాలాండ్ రాజకీయ పరిణామాలు బుధవారం అనూహ్య మలుపులతో ముగిశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా నాటకీయ ఫక్కీలో సాగిన రాష్ట్ర రాజకీయం సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించింది. బలపరీక్షకు రాకపోవడంతో ముఖ్యమంత్రి షుర్హోజిలీ లీజిత్సును గవర్నర్ పి.బి.ఆచార్య బర్తరఫ్ చేశారు. తిరుగుబాటు నాయకుడు టి.ఆర్.జెలియాంగ్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. ఆయన చేత కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.

07/20/2017 - 03:55

బాన్స్‌వారా (రాజస్థాన్), జూలై 19: జిఎస్‌టి అమలు చేయడంలో ఉన్నంత ఆత్రుత, రైతు సమస్యలపై చూపించడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన ‘కిసాన్ ఆక్రోశ్ ర్యాలీ’లో రాహుల్ పాల్గొన్నారు.

07/20/2017 - 03:55

న్యూఢిల్లీ, జూలై 19: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ హిందూ దేవతలపై చేసిన వాఖ్యలు రాజ్యసభను కుదిపేయడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. రాజ్యసభలో అగర్వాల్ మాట్లాడుతూ హిందూ దేవతలను మద్యం బ్రాండ్లతో పోలుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. అగర్వాల్ వ్యాఖ్యలపై సభలో ఉన్న కేంద్రమంత్రులు, బిజెపి ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

07/20/2017 - 03:54

న్యూఢిల్లీ, జూలై 19: గోసంరక్షణ పేరిట దేశవ్యాప్తంగా సాగుతోన్న హత్యల వ్యవహారం బుధవారం రాజ్యసభను కుదిపేసింది. ఈ రకమైన దాడులను అరికట్టే అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయని స్పష్టం చేసిన కేంద్రం, ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదని చెప్పడంలో విపక్షాలు గగ్గోలెత్తాయి. ప్రభుత్వ సమాధానంతో ఏకీభవించని సమాజ్‌వాదీ సభ్యులు, ఇతర ప్రతిపక్షాలు సభమధ్యకు వెళ్లి నినాదాలు చేశాయి.

07/20/2017 - 03:54

న్యూఢిల్లీ, జూలై 19: చైనా తన చిరకాల స్నేహితుడు పాకిస్తాన్‌తో కలిసి భారతదేశంపై దాడి చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నదని సమాజ్‌వాదీ పార్టీ అధినాయకుడు ములాయం సింగ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ములాయం ప్రస్తావించారు.

07/20/2017 - 03:28

న్యూఢిల్లీ, జూలై 18:గోప్యత హక్కు పరిపూర్ణం కాదని, దీనిపై సహేతుక రీతిలో కొన్ని ఆంక్షలు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా పరిగణించవచ్చునా అన్న అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం బుధవారం పరిశీలనకు చేపట్టిన సందర్భంగా ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది.

07/20/2017 - 03:28

న్యూఢిల్లీ, జూలై 19: భారత రాష్టప్రతి ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ గురువారం మొదలవుతుంది. సాయంత్రం ఐదుగంటలకల్లా కొత్త రాష్టప్రతి ఎవరన్నది తేలిపోతుంది.

07/19/2017 - 04:57

న్యూఢిల్లీ, జూలై 18: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దళితుల, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్షాలు మంగళవారం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. రైతులు గిట్టుబాటు ధరలు లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ ఉభయ సభల్లో పెద్దఎత్తున గొడవ చేశారు.

07/19/2017 - 04:54

న్యూఢిల్లీ, జూలై 18: తల్లి తరువాత తల్లిలాంటిదైన బిజెపికి రాజీనామా చేయటం తనకు ఎంతో బాధను కలిగించిందని ఎన్‌డిఏ ఉపరాష్టప్రతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం ఉపరాష్టప్రతి పదవికి నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ, తన శక్తి మేరకు ఉపరాష్టప్రతి పదవికి, రాజ్యసభ చైర్మన్ పదవికి న్యాయం చేస్తానని తెలిపారు.

07/19/2017 - 04:52

న్యూఢిల్లీ, జూలై 18: ఎన్డీయే తరపున ఉపరాష్టప్రతి అభ్యర్థిగా ఎంపికైన ఎం.వెంకయ్య నాయుడికి అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం వెంకయ్యనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు వెంకయ్య మాజీ ప్రధాని వాజపేయి నివాసానికి వెళ్లి ఆయన అశీస్సులు తీసుకున్నారు. అలాగే బిజెపి అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ, మురశీ మనోహర్ జోషిని స్వయంగా కలిసి వారి దీవెనలు అందుకున్నారు.

Pages