S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/18/2017 - 02:06

న్యూఢిల్లీ, జూలై 17: ఉపరాష్టప్రతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎం.వెంకయ్య నాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపరాష్టప్రతిగా ఎన్నికయ్యేవారు రాజ్యసభ అధ్యక్ష పదవీ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

07/18/2017 - 02:03

బెంగళూరు, జూలై 17: అన్నా డి ఎంకె ప్రధాన కార్యదర్శి వికె శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ నివేదిక ఇచ్చిన జైళ్ల శాఖ డిఐజి డి.రూపపై కర్ణాటక ప్రభుత్వం వేటు వేసింది. రూపతో పాటు డిజిపి(జైళ్లు) హెచ్ ఎన్ సత్యనారాయణరావుపై కూడా ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అదనపు డిజిపిగా ఉన్న ఎన్ ఎస్ మేఘారిఖ్‌ను జైళ్ల శాఖ అదనపు డిజిపిగా రావు స్థానంలోకి బదిలీ చేశారు.

07/18/2017 - 02:01

న్యూఢిల్లీ, జూలై 17: ఉపరాష్టప్రతి పదవికి సీనియర్ నేత వెంకయ్యనాయుడు సరైన అభ్యర్థి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. 68 ఏళ్ల వెంకయ్యనాయుడు రైతు బిడ్డ అని ప్రజాజీవితంలో అపారమైన అనుభవం కలిగిన వారని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారి మన్ననలను పొందిన వారని ప్రధాని ప్రశంసించారు. ‘నేను వెంకయ్యనాయుడుగారిని చాలాకాలంగా చూస్తున్నాను.

07/18/2017 - 02:01

న్యూఢిల్లీ, జూలై 17: కాశ్మీర్‌లో వేర్పాటువాదులకు సీమాంతర వ్యాపారస్తుల నుంచి ఆర్థికంగా మద్దతు లభిస్తున్నదన్న సమాచారం మేరకు రెవెన్యూ శాఖకు చెందిన కస్టమ్స్, సెంట్రల్ ఎక్స్‌జ్ అధికారుల సహాయ సహకారాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తీసుకోనుంది. కాశ్మీర్ వేర్పాటువాదులకు ప్రధాన ఆర్థిక వనరులు సీమాంతర వ్యాపారులు అందిస్తున్నారని అధికారులు తెలిపారు.

07/18/2017 - 01:23

జమ్ము/ న్యూఢిల్లీ, జూలై 17: ప్రతీకారం తీర్చుకునే హక్కు తాము ఎప్పటికీ కలిగి ఉంటామని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తే చేతులు ముడుచుకు కూర్చునేది లేదని పాకిస్తాన్‌కు భారత్ తెగేసి చెప్పింది. జమ్ము కాశ్మీర్ సరిహద్దుల్లో వాస్తవాధీనరేఖ వెంబడి రెండు మాసాలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించటంపై భారత్ తీవ్రంగా స్పందించింది.

07/18/2017 - 01:21

న్యూఢిల్లీ, జూలై 17:రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ప్రజలకు పదేపదే అవకాశాలు ఇవ్వలేమని కేంద్రం సోమవారం సుప్రీం కోర్టుకు నివేదించింది. ఇలా అవకాశాలను పెంచుతూ పోవడం వల్ల పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న నల్లధన నిర్మూలన లక్ష్యం నీరుగారిపోతుందని ఓ అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.

07/18/2017 - 01:45

న్యూఢిల్లీ, జూలై 17: బిజెపి మిత్రపక్షాల రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తేలిపోయింది. ప్రతిపక్షానికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు ఆయనకు ఓటు వేసినట్టు సమాచారం. భారతదేశ 14వ రాష్టప్రతిని ఎన్నుకునేందుకు ఉద్దేశించిన ఓటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

07/18/2017 - 01:12

న్యూఢిల్లీ, జూలై 17:మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్‌ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప రాష్టప్రతిగా బరిలోకి దిగుతున్న కేంద్ర సీనియర్ మంత్రి వెంకయ్య నాయుడు తాను నిర్వహిస్తున్న శాఖలకు రాజీనామా చేయడంతో కేబినెట్ విస్తరణ అనివార్యమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వెంకయ్య నాయుడి రాజీనామాతోనే సమాచార, ప్రసార, పట్టణాభివృద్ధి శాఖలు ఖాళీ అవుతాయి.

07/18/2017 - 01:12

న్యూఢిల్లీ, జూలై 17: కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఉప రాష్టప్రతి పదవికి ఆగస్టు 5న జరిగే ఎన్నికల్లో ఎన్డీయే తరఫున వెంకయ్యనాయుడిని రంగంలోకి దించుతున్నట్టు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే కేంద్ర మంత్రి పదవికి వెంకయ్య రాజీనామా చేశారు.

07/17/2017 - 04:18

న్యూఢిల్లీ, జూలై 16: కొత్త రాష్టప్రతి, ఉప రాష్టప్రతిని ఎన్నుకోవటంతోపాటు వివిధ అంశాలకు సంబంధించిన పద్దెనిమిది బిల్లులపై చర్చ జరిపి ఆమోదించేందుకు సోమవారం నుండి ఆగస్టు 11 తేదీ వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ముఖాముఖి యుద్ధానికి సిద్ధమయ్యాయి.

Pages