S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/27/2016 - 08:13

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో భారత్‌కు అత్యంత ఆప్తమిత్రుడు. ఆలీన ఉద్యమంలో ఆయన కీలకభూమిక పోషించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఫిడెల్‌తో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి. 1959లో క్యూబా విప్లవం తరువాత అధికారం చేపట్టిన క్యాస్ట్రో అలీన దేశాలకు స్నేహపాత్రుడిగానే ఉండేవారు.

11/27/2016 - 08:04

న్యాయ వ్యవస్థ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం
న్యాయమూర్తుల కొరతతో కోర్టులు పనిచేయట్లేదని సిజెఐ జస్టిస్ ఠాకూర్ ఆవేదన
సంక్షోభ ముగింపునకు సర్కారు చొరవ చూపాలని సూచన
విభేదించిన న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఈ ఏడాది 120 మంది జడ్జీలను నియమించామని వెల్లడి

11/27/2016 - 07:59

న్యూఢిల్లీ, నవంబర్ 26: క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. క్యాస్ట్రో భారత్‌కు ఓ మంచి స్నేహితుడని రాష్టప్రతి, ప్రధాని తమ సందేశంలో స్పష్టం చేశారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. క్యూబా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

11/27/2016 - 07:04

న్యూఢిల్లీ, నవంబర్ 26: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు చెప్పినా శిరసావహిస్తామని అఖిలభారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ, బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యస్వామి అంగీకరించారు. టీవి జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్వహించిన టైమ్స్ లిట్‌ఫెస్ట్ కార్యక్రమంలో ఇద్దరు నేతలూ ఒకే వేదికపై కలిశారు.

11/27/2016 - 05:30

ప్రభుత్వ విభాగాలు ‘లక్ష్మణ రేఖ’కు లోబడే ఉండాలి
వాటిని కనిపెట్టాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థది
చట్టాలు, ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండొద్దు
ఉంటే.. న్యాయ వ్యవస్థ సహించదు: సిజెఐ ఠాకూర్

11/27/2016 - 05:22

న్యూఢిల్లీ, నవంబర్ 26: జవాను తల నరికినందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైనిక పోస్టులపై భారత బలగాలు భీకర దాడులు జరపడంతో దాయాది దేశం దిగివచ్చి ఆ దాడులను ఆపాల్సిందిగా భారత్‌కు విజ్ఞప్తి చేసిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ వెల్లడించారు.

11/26/2016 - 07:42

భటిండా, నవంబర్ 25: సట్లెజ్, బియాస్, రవి నదుల జలాలపై భారత్‌కే హక్కు ఉందని, అందువల్ల ఈ జలాలను వృథాగా పాకిస్తాన్‌లోకి పోనివ్వకుండా నిలిపివేస్తామని, ఇక్కడి రైతులే ఉపయోగించుకునేలా చూస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ‘సింధూ జలాల ఒప్పందం- సట్లెజ్, బియాస్, రవి- ఈ నదులలోని జలాలు భారత్‌కు, మన రైతులకే చెందుతాయి. ఈ నీటిని పాకిస్తాన్ పంట పొలాల్లో ఉపయోగించుకోవడం లేదు.

11/26/2016 - 07:39

పాట్నా, నవంబర్ 25:రద్దయిన 500నోటును చికిత్స కోసం ఆసుపత్రి వర్గాలు స్వీకరించక పోవడం వల్ల గయలో ఓ గర్భిణి మరణించిన సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను స్వీకరించిన బీహార్ మానవ హక్కుల సంఘం జిల్లా మెజిస్ట్రేట్, సంబంధిత ఆసుప్రతి వర్గాలపై నిప్పులు చెరిగింది. పక్షం రోజుల్లో తమకు నివేదిక అందించాలని ఆదేశించింది.

11/26/2016 - 07:39

చెన్నై, నవంబర్ 25: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని, శరీరంలో అన్ని కీలక అవయవాలు మామూలుగా పనిచేస్తున్నాయని అపోలో ఆసుప్రతి వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. శ్వాస సంబంధిత సమస్యంలో అపోలో ఆసుపత్రిలో చేరిన అన్నాడిఎంకె అధినేత్రి కొద్ది నిముషాలసేపుమాట్లాడడం జరిగిందని తాజా బులెటిన్‌లో పేర్కొన్నారు.

11/26/2016 - 07:39

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘రాజ్యాంగం అంటే బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంటే రాజ్యాంగం’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగ లక్ష్యాల స్ఫూర్తిని అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

Pages