-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
గుజరాత్ : ఆర్థికంగా వెనుబడినవారికి గుజరాత్ ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మే నెలలో ప్రభుత్వం తీసుకున్ననిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీసీలు, విద్యార్థులు, సాంఘిక సంస్థలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.
చెన్నై: కృష్ణగిరి జిల్లా దసంపట్టి ప్రాంతంలో గత రాత్రి చెన్నై-పళని ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఇంజను, రెండు బోగీలు పట్టాలు తప్పాయి. సంఘటనలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. 3 గంటలపాటు ఆ మార్గంలో రైళ్లను నిలిపేసి తర్వాత తిరిగి ప్రారంభించారు.
మహద్, ఆగస్టు 3: వరదల ధాటికి మహారాష్ట్ర అల్లల్లాడిపోతోంది. రాష్ట్రంలోని సా విత్రి నది ఉప్పొంగటంతో రాయ్గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై బ్రిటిష్ కాలం నాటి ఓ వంతెన మంగళవారం అర్ధరాత్రి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ వారసుడి ఎంపిక బాధ్యతను బిజెపి పార్లమెంటరీ పార్టీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు బుధవారం అప్పగించింది. అమిత్ షా గురువారం గుజరాత్ వెళ్తున్నారు. అక్కడ ఆయన పార్టీ నాయకులతో చర్చలు జరపడమే కాకుండా లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడి ఎంపికకోసం శుక్రవారం జరగనున్న లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి కూడా హాజరవుతారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: చైనాను ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో అదనంగా సూపర్సోనిక్ బ్రహ్మస్ క్షిపణులను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 290 కి.మీ దూరంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించగలిగే సామర్థ్యం ఈ క్షిపణులకు ఉం టుంది. చైనాను ఆనుకుని ఉన్న తూర్పు సెక్టార్ సరిహద్దు పొడవునా రక్షణపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతోనే బ్రహ్మోస్ను మోహరింపును ఆమోదించినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.
ఖాట్మండు, ఆగస్టు 3: నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు పార్టీ అధినేత పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండ ఎన్నికయ్యారు. కొత్త రాజ్యాంగ పుణ్యమాని రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. దీంతో కెపి శర్మ ఓలి ప్రధాని పదవి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానిగా ప్రచండను సోమవారం పార్లమెంటు ఎన్నుకుంది. 595 మంది సభ్యులున్న సభలో ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు వచ్చాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డంకి అని ప్రజలను, సభను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, కెవిపి రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జెడి శీలంలు విలేఖరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రద్దు చేయలేదన్నారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ గ్యాంగ్రేప్ ఘటన సమాజ్వాదీ పార్టీ, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బులంద్షహర్లో తల్లీ, 13 ఏళ్ల కుమార్తెపై బందిపోట్ల ముఠా అత్యాచారం చేసింది. అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతోనే రాజకీయం చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ ఆరోపించారు. దీనిపై బిజెపి తీవ్రంగా మండిపడింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 3: మంగళవారం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి బుధవారం నిలకడగా ఉంది. మంగళవారం రాత్రి ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆమెను బుధవారం పశ్చిమ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ నుండి సౌదీ అరేబియాకు ఉపాధికోసం వెళ్లిన కార్మికులను కాపాడాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఈ మేరకు బుధవారం లేఖ రాశారు.
బిసిల జాబితాలో మార్పులు