-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రిగా రెండేళ్లు పనిచేయడం సంతృప్తినిచ్చిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. బుధవారం శాస్ర్తీభవన్లో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వెంకయ్యనాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తనమీద నమ్మకంతో మరో బాధ్యతను అప్పగించారని అన్నారు.
న్యూఢిల్లీ, జూలై 6: ఆందోళనలు జరక్కుండా చూడడానికి చర్చలు ఒక్కటే మార్గమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ జవడేకర్ స్పష్టం చేస్తూ, పార్టీ రాజకీయాలకు విద్యారంగం తగినది కాదన్నారు. ఇంతకుముందు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా ఉండిన స్మృతి ఇరానీ పదవీ కాలమంతా కూడా రకరకాల వివాదాలతో గడిచిపోయిన విషయం తెలిసిందే.
అస్సాం: బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు అస్సాంలో పొంగిపొరలుతున్నాయి. మోరిగావ్ జిల్లాలో వరద ప్రాంతాల్లోని ప్రజలను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లఖింపూర్ జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ఏడు పునరావాస శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలను తరలిస్తోంది. దాదాపు వంద గ్రామాలు నీట మునిగాయి. 7 జిల్లాల్లో దాదాపు 88వేల మంది ప్రజలు ఈ వరదల వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నారు.
దిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సియు)లో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, తదనంతర పరిణామాల వల్లే కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీని జౌళి, చేనేత శాఖకు మార్చారని దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ (జెఎన్యు) విద్యార్థి సంఘం నేత కన్నయ్య బుధవారం వ్యాఖ్యానించారు. ఆమెకు శాఖ మార్చడం శిక్ష కాదని, రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగినట్టు కాదని అన్నారు.
గయ : బీహార్లోని గయలో పిడుగుపాటుకు బుధవారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వర్షాలకు బీహార్లో పలు గ్రామాలు నీట మునిగాయి.
అసోం : ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉన్నందన ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో అసోం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. బ్రహ్మపుత్ర నదిలో మరబోట్ల సాయంతో గస్తీ తీవ్రతరం చేశారు. అసోం, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి బీఎస్ఎఫ్ బలగాలను తరలిస్తున్నారు.
చెన్నై: రెండంతస్థుల భవనం నుంచి కుక్కను కింద పడేసిన వైద్యవిద్యార్థి ఎస్.గౌతమ్ను, వీడియో తీసిన వ్యక్తిని చెన్నై పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గౌతమ్ ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్ కుక్కపిల్లను కిందపడేస్తుండగా వీడియో తీసిన ఆశిశ్ పాల్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
దిల్లీ: అవినీతిని అడ్డుకునేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు పదే పదే చెప్పే దిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమార్కులకు అండగా నిలిచారని బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వద్ద ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారిని సిబిఐ అరెస్టు చేసిన నేపథ్యంలో బిజెపి కార్యకర్తలు బుధవారం ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆందోళన చేశారు.
దిల్లీ : వాటర్ మీటర్ల కుంభకోణంపై దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు ఏసీబీ సమన్లు జారీ చేసింది. రూ. 341 కోట్ల వాటర్ మీటర్ల అవినీతి ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.