S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/22/2016 - 05:03

న్యూఢిల్లీ, మార్చి 21: భారత మాతాకీ జై’ అంటే భారత దేశానికి జై కొట్టమేనని, ఈ నినాదాన్ని ఎవ్వరూ వివాదాస్పదం చేయకూడదని కేంద్ర పార్లమెంటరీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. భారత్ మాతాకీ జై అనటంలో మత సంబంధమైన అర్థమేదీ లేదని ఆయన స్పష్టం చేశారు.

03/22/2016 - 05:02

చెన్నై, మార్చి 21: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో అధికార అన్నాడిఎంకెకు మద్దతు ఇవ్వాలా లేక డిఎంకెతో వెళ్లాలా తెల్చుకోలేని పరిస్థితి ముస్లిం పార్టీల్లో నెలకొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో ముస్లింలు ఆరుశాతం ఉన్నారు.

03/22/2016 - 05:01

చెన్నై, మార్చి 21: తమిళనాట రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ నేతృత్వంలోని డిఎండికెతో పొత్తుకు సంబంధించి ఆ పార్టీతో చర్చలు కొనసాగుతున్నాయని ప్రతిపక్ష డిఎంకె సోమవారం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని విజయకాంత్ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

03/22/2016 - 05:09

న్యూఢిల్లీ, మార్చి 21: భూమికి సమీపంగా ఇటీవల గ్రహశకలాలు దూసుకుపోయి ఆందోళన రేకెత్తించిన నేపథ్యంలో మరో రెండు తోకచుక్కలు అతిసమీపంగా పుడమిని దాటుకుని వెళ్లపోతున్నాయి. ఇది ఖగోళపరంగా అత్యంత అరుదైన సంఘటనేనని చెబుతున్న ఖగోళవేత్తలు, ఈ రెండు తోకచుక్కలు జూపిటర్ కుటుంబానికి చెందినవేనని, అతి స్వల్ప వ్యవధిలో భూమికి సమీపంగా దూసుకుపోతున్నాయని వెల్లడించారు.

03/22/2016 - 04:56

న్యూఢిల్లీ, మార్చి 21: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి)లో దాఖలైన పిటిషన్ విచారణ ఏప్రిల్‌కు వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు సంవత్సరాల్లో 32 వేలకు పైగా ఇసుక అక్రమ రవాణా కేసులు నమోదు చేశామని, రూ 39 కోట్ల జరిమానా విధించామని ఎన్జీటికి ప్రభుత్వం నివేదించింది.

03/22/2016 - 04:55

న్యూఢిల్లీ, మార్చి 21: తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి శాఖ మంత్రి ఉమా భారతికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. గోదావరి నుంచి ప్రతి సంవత్సరం వృధాగా 1600 టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 350 టిఎంసిల నీటిని నిల్వ చేసుకునే వీలుంటుందని దత్తాత్రేయ చెప్పారు.

03/22/2016 - 04:54

న్యూఢిల్లీ, మార్చి 21: రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు రిజర్వేషన్ల అంశాన్ని వివాదాస్పదం చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన విమర్శలను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఖండించారు. ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఇతర బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లపై అనుమానాలను ఎవరు రేకెత్తించారని నిలదీశారు.

03/22/2016 - 04:53

న్యూఢిల్లీ, మార్చి 21: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణను ఢిల్లీ కోర్టు ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది. పాటియాలా హౌస్ కోర్టులో కాంగ్రెస్ తరపున వాదిస్తున్న న్యాయవాది.. భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించిన 2010-11 సంవత్సర ఆర్థిక వివరాలు ఆ పార్టీ ఆఫీస్ బేరర్లనుంచి ఇంకా తనకు అందలేదని సోమవారం విచారణ సందర్భంగా కోర్టుకు విన్నవించారు.

03/22/2016 - 04:50

బెంగళూరు, మార్చి 21: ఉత్తరాఖండ్‌లో కొద్ది రోజుల క్రితం బిజెపికి చెందిన ఎమ్మెల్యే ఒకరు పోలీసు గుర్రంపై ‘ప్రతాపాన్ని’ ప్రదర్శించి దాని కాలు విరగ్గొట్టిన సంఘటన తెర మరుగు కాకముందే ఇప్పుడు కర్నాటకలో కూడా ఇదేవిధమైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులోని కృష్ణానగర్‌లో పొన్నమ్మ అనే మహిళ అభం, శుభం తెలియని ఎనిమిది కుక్కపిల్లలను బండకేసి చావబాది తన కర్కశత్వాన్ని ప్రదర్శించింది.

03/22/2016 - 03:08

డెహ్రాడూన్/న్యూఢిల్లీ:ఉత్తరాఖండ్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం సోమవారం ముదురుపాకాన పడింది. మరోవారంలో ముఖ్యమంత్రి రావత్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కొంటున్న తరుణంలో కాంగ్రెస్, బిజెపిలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్నాయి.

Pages