-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
బెంగళూరు : ఐబీఎంలో ఉద్యోగం చేస్తున్న కుసుమ్ సింగ్లా(31) దారుణ హత్యకు గురైన సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. కుసుమ్ బెంగళూరులోని ఓ ఫ్లాట్లో మరో మహిళతో కలిసి నివసిస్తోంది.
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 18 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పగటిపూట అధికంగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో అత్యల్పంగా 6.9 డిగ్రీలే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
అహ్మదాబాద్ :ప్రఖ్యాత భరత నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మృణాళిని సారాభాయి(97) కన్ను మూశారు. గురువారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో మరణించారని కుమార్తె మల్లికా సారాబాయి ఫేస్ బుక్పేజీలో వెల్లడించారు. భారత అంతరిక్షపితామహుడు విక్రం సారాబాయిని మృణాళిని 1942లో వివాహం చేసుకున్నారు. నృత్యకారిణిగానే కాకుండా మంచి రచయిత్రి, కవయిత్రిగా కూడా మృణాళిని గుర్తింపు పొందారు.
గుజరాత్: పాఠశాల బస్సుబోల్తా పడి ఆరుగురు మృతి చెందిన ఘటన గుజరాత్ రాష్ట్రంలోని కేషోడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో 20మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దిల్లీ: అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ‘ఐసిస్’తో సంబంధాలు ఉన్న నలుగురు అనుమానిత వ్యక్తులను ఉత్తరాఖండ్లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో దేశంలో ఉగ్రవాదుల దాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించటంతో పోలీసులు దిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్లో నలుగురిని అరెస్టు చేసి క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 20: బిజెపి తాత్కాలిక అధ్యక్షుడు అమిత్ షా ఈ నెలాఖరుకు పూర్తిస్థాయి అధ్యక్షుడుగా ఎన్నిక కానున్నారు. బిజెపి అధ్యక్ష పదవి చేపట్టేందుకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిరాకరించటంతో అమిత్ షా పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావటం దాదాపుగా ఖాయమైపోయింది.
న్యూఢిల్లీ, జనవరి 20: ఉత్తరాఖండ్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టుతో హరిద్వార్లో జరిగే అర్ధ్ కుంభమేళా సందర్భంగా దాడులకు పాల్పడాలన్న ఉగ్రవాదుల కుట్ర బయటపడిందని ఢిల్లీ పోలీసులు బుధవారం చెప్పారు. అర్ధ్ కుంభమేళా సందర్భంగా హరిద్వార్ వైపు వెళ్తున్న రైళ్లపై, దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలపై దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు.
న్యూఢిల్లీ, జనవరి 20: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ పిహెచ్.డి విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యను దళిత, దళితేతర వివాదంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. బుధవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గెహ్లాట్, సాంప్లాలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
దోస్నా/ రోరి/ మీరట్, జనవరి 20: ఇస్లామిక్ సైద్ధాంతిక పునాదులతో ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ ఐసిస్ను ఢీకొనేందుకు ధర్మసేన పేరిట ఓ సాయుధ బలగం సన్నద్ధమవుతోంది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ సరిహద్దు వరకూ హిందూ స్వాభిమాన్ పేరుతో ధర్మసేన శిక్షణా శిబిరాలు ఆవిర్భవించాయి.
ఢిల్లీ : భారత్ సంతతికి చెందిన వ్యక్తికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు వరించింది. టిక్నికల్ అచీవ్మెంట్ విభాగంలో రాహుల్ థక్కర్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తికి ఈ అవార్డు వచ్చింది. ఫిబ్రవరి 13న జరిగే వార్షిక సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డుల కార్యక్రమంలో రాహుల్ ఈ అవార్డును అందుకోనున్నారు.