-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, జనవరి 8: కేంద్రానికి, ఢిల్లీ సర్కార్కు మధ్య మళ్లీ డిడిసిఎ వివాదం రాజుకుంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి సంబంధం ఉన్నట్టుగా చెబుతున్న ఈ ఆర్థిక అవకతవకల వ్యవహారంపై ఢిల్లీ సర్కార్ వేసిన దర్యాప్తు కమిషన్ను ‘అక్రమం, రాజ్యాంగ విరుద్ధం’అంటూ కేంద్రం కొట్టివేసింది. దీనిపై విరుచుకు పడ్డ కేజీవాల్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ దర్యాప్తును ఆపే ప్రసక్తి లేదని తెగేసి చెప్పింది.
కోల్కతా, జనవరి 8: రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఉద్రిక్తతలు లేవని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ పార్టీ అడ్డు కాదనీ, త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు మళ్లీ చేపడతామని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా కోర్ గ్రూప్ను ఏర్పాటుచేశామన్నారు. ‘త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయినా ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదు.
సీలేరు, జనవరి 8: ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పైబర్గూడ్ పోలీస్ పరిధి రామగిరి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు శుక్రవారం మందుపాతర పేల్చిన ఘటనలో 143 బిఎస్ఎఫ్ బెటాలియన్కు చెందిన ఒక జవాన్, మరో డిప్యూటీ కమాండర్ మృతి చెందగా, మరొక జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి.
చండీగఢ్, జనవరి 8: పఠాన్కోట్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సైనిక దుస్తులు పోలిన వాటిని ధరించడంపై మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సైన్యాన్ని పోలిన దుస్తులు ధరించడాన్ని మానుకోవాలని, అలాగే ఈ తరహా దుస్తులను ఎవరూ ఎక్కడా అమ్మకూడదని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. సైనిక దుస్తులు ధరించి ఉగ్రవాదులు పఠాన్కోట్ ఎయిర్బేస్లోకి చొరబడ్డారన్న కథనాల నేపథ్యంలో తాజాగా వీటిని జారీచేశారు.
న్యూఢిల్లీ, జనవరి 8: పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిపై ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కొనసాగుతూనే ఉంది. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన దేశాల జాబితాలో శుక్రవారం జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండోనేసియా చేరాయి. అమెరికా, చైనా, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్తో పాటు తమ నావికులపై హత్య కేసు విషయంలో భారత్తో పోరాడుతున్న ఇటలీ కూడా ఈ ఉగ్రవాద దాడిని ఇదివరకే ఖండించాయి.
న్యూఢిల్లీ, జనవరి 8: తమిళనాట వివాదాస్పద జల్లికట్టు పోటీల నిర్వహణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఆబోతుల (బలిష్ఠమైన ఎద్దుల)ను లొంగదీసుకునే ఈ క్రీడకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పొంగల్ (సంక్రాంతి) పండుగ సమీపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తమిళనాట పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమయింది.
న్యూఢిల్లీ, జనవరి 8: పఠాన్కోట్ ఎయిర్ బేస్పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన దాడి ఘటనను పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నీరుగార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. దాడి సంఘటనపై విచారణ జరిపించి కుట్రదారులను శిక్షించే అంశంపై రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. భారత్ అందజేసే సాక్ష్యాలను జాగ్రత్తగా పరిశీంచిన తరువాతే ముందుకు సాగాలని షరీఫ్ ఇంటిలిజెన్స్ బ్యూరోను ఆదేశించడమే తాజా ఉదాహరణ.
పఠాన్కోట్, జనవరి 8: పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఆరుగురు ఉగ్రవాదులు దాడి చేసిన ఆరు రోజుల తర్వాత ఈ సువిశాలమైన ఎయిర్బేస్లో భారీ ఎత్తున చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ శుక్రవారం ముగిసింది. అయితే రెండు రోజుల క్రితం సైనిక దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారని స్థానికులు చెప్పిన నేపథ్యంలో పఠాన్కోట్, గురుదాస్పూర్ జిల్లాలు ఇప్పటికీ హై అలర్ట్లోనే ఉన్నాయి.
మిజోరాం : మిజోరాం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లా సెలింగ్ గ్రామంలో ఓ క్యాబ్ లోయలో పడిన ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, ఎనిమిది మంది గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున చాంపై జిల్లాలోని జొకాతర్ నుంచి వస్తుండగా ప్రమాదం సంభవించిందని పోలీసులు వెల్లడించారు.
చెన్నై: సంక్రాంతి పర్వదినాన తమిళనాడులో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు జల్లికట్లు నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చిందని.. కేంద్ర మంత్రి పన్ రాధాకృష్ణన్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా జల్లికట్టు నిర్వహణకు మద్దతిచ్చిన ప్రధానమంత్రి మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్షా తదితరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాధాకృష్ణన్ ట్వీట్ చేశారు.