S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/19/2015 - 14:00

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పాల్గొన్నారు. 2015లో భారత్ ఆర్థికంగా ఎంతో పురోగమించిందని జైట్లీ తెలిపారు. రాష్ర్టాల అభివృద్ధితోనే కేంద్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి పుష్కలంగా ఉంది. జీడీపీలో అత్యధిక శాతం వ్యవసాయరంగానిదేనని వెల్లడించారు.

12/19/2015 - 06:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యసభ, లోక్‌సభ నిర్వహణకు కనీస సంఖ్యలో కూడా సభ్యుల హాజరీ లేకపోవడం వల్ల ఉభయ సభలు శుక్రవారం అర్ధంతరంగా వాయిదా పడ్డాయి. పలుసార్లు వాయిదాపడ్డ అనంతరం మధ్యాహ్నం 2.30కు రాజ్యసభ సమావేశమైంది. అనంతరం అనధికార బిల్లులను చేపట్టేందుకు చైర్మన్ ప్రయత్నించారు. అదే సమయంలో రాజ్యాంగ (షెడ్యూలు కులాల) ఉత్తర్వును సవరించేందుకు ఉద్దేశించిన ఓ బిల్లుపై ఓటింగ్‌ను చేపట్టారు.

12/19/2015 - 07:21

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఎట్టకేలకు రాజ్యసభలో ప్రతిష్టంభన తొలగిపోయింది. చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఈ శీతాకాల సమావేశాలలో మిగిలిన మూడు రోజులు సభను సజావుగా సాగనివ్వడంతో పాటు ఏకాభిప్రాయం ఉన్న కొన్ని బిల్లుల ఆమోదానికి మద్దతివ్వడానికి ప్రతిపక్షం అంగీకరించింది. అయితే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.

12/19/2015 - 06:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం లోక్‌సభలో దాదాపు గంటరన్నర పాటు నినాదాలు చేసి, సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ విమర్శించారు.

12/19/2015 - 05:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, క్రైస్తవ్ర సంస్కృతీ సంప్రదాయాలు రెండూ ఒకటేనని కూడా ఆయన స్పష్టం చేసారు.

12/19/2015 - 05:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరించవలసిన అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే తీరులో వ్యవహరిస్తున్నందున వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం రాజ్యసభను స్తంభింపచేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల కొనసాగించడంతో ప్రయివేట్ మెంబర్ బిల్లులను కూడా చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడిపోయింది.

12/19/2015 - 05:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: నైజీరియాలో మన దేశానికి చెందిన ఐదుగురు నావికులను పైరేట్లు అపహరించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. భారతీయులను అపహరించినట్టు శుక్రవారం వచ్చిన వార్తలను మంత్రి ధ్రువీకరించారు. ‘నైజీరియాలోని భారత హైకమిషనర్ ఎఆర్ ఘనశ్యాం ఆ దేశాధ్యక్షుడితో మాట్లాడారు. బందీల విడుదలకు ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.

12/19/2015 - 05:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో సీట్ల పెంపుదల, రెండు రాష్ట్రాల్లో హైకోర్టుల ఏర్పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు బెంచిలను ఏర్పాటు చేయాలంటూ టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్ మూడు ప్రైవేట్ బిల్లులను లోకసభలో శుక్రవారం ప్రతిపాదించారు. సీనియర్ నాయకుడు బి.వినోద్‌కుమార్ ప్రతిపాదించిన ఈ మూడు బిల్లులపై చర్చ జరిపేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ ఆమోదం తెలిపారు.

12/19/2015 - 05:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర ప్రభుత్వం లెవీ బియ్యం సేకరణ విధానాన్ని రద్దు చేయటం పట్ల తెలంగాణ కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. సుఖేందర్ రెడ్డి శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

12/19/2015 - 02:16

కోల్‌కతా, డిసెంబర్ 18: నోబెల్ శాంతిబహుమతి గ్రహీత, ఆర్తులను ప్రేమగా అక్కున చేర్చుకుని కరుణామయిగా నిలిచిపోయిన మదర్ థెరెసాను సన్యాసినిగా ప్రకటించనున్నారు. దివంగత మదర్ థెరెసాలోని అతీత శక్తిని పోప్ ప్రాన్సిస్ గుర్తించిన తర్వాత ఆమెను సెయింట్‌గా ప్రకటించడానికి మార్గం సుగమం అయింది.

Pages