-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: మూడు రోజులపాటు సాఫీగా జరిగిన రాజ్యసభ సమావేశాలకు బుధవారం అవరోధం తప్పలేదు. సభా నాయకుడు అరుణ్ చైట్లీ చేసిన ప్రకటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ సభ్యులు సభను స్తంభింపచేయటతో సమావేశాలకు గండిపడింది. ప్రశ్నోత్తరాలతోసహా ఏ ఇతర అంశాలను చేపట్టకుండా అనేకసార్లు వాయిదాపడిన సభ మధ్యాహ్నం మూడున్నర తరువాత వరదలపై చర్చతో తిరిగి ప్రారంభమైంది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఉపాధి కల్పనలో కీలకపాత్ర వహించే నైపుణ్యతను యువతలో పెంపొందించటానికి ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టిన శిక్షణ కార్యక్రమాల అమలుకు ఆర్థిక సాయం అందించటానికి కేంద్ర స్కిల్ డెవలప్పెంట్ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో సాలీనా మూడువేల మంది యువకులకు స్థానిక అవసరాలకు తగిన శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించటానికి చర్యలు తీసుకుంటారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పట్టణాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంతోపాటు వాటి స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయడానికి ఉద్దేశించిన అమృత్ పథకం కింద మొదటి విడతగా కేంద్రం 13 రాష్ట్రాలకు వెయ్యి కోట్లకు పైగా నిధులను మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా 500 నగరాల్లో అన్ని గృహాలకు తాగునీరు, మురుగునీటి పారుదల సౌకర్యాలను కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భద్రతా సంస్థలు ఫోన్ కాల్స్ను నేరుగా అడ్డుకునే ఒక కొత్త కేంద్రీకృత పర్యవేక్షక వ్యవస్థ వచ్చే సంవత్సరం మార్చి నాటికి పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తే సర్వీస్ ప్రొవైడర్ల జోక్యం లేకుండానే భద్రతా సంస్థలు నేరుగా ఫోన్ కాల్లను అడ్డుకోవచ్చు. టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం చెప్పారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: పార్లమెంట్ సభ్యుల జీతాల పెంపునకు సంబంధించిన అన్ని అంశాలపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించటానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సభ్యులతో ఏర్పాటైన సంఘం (జెపిసి) పని తీరును పర్యవేక్షించటానికి ప్రభుత్వం మరో కమిషన్ వేసిందంటూ ప్రతిపక్షాలు రాజ్యసభలో అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ నెహ్రూ చిత్రపటం లేకుండా ప్రకటనలు విడుదల చేసిన స్ర్తి శిశు సంక్షేమ అభివృద్ధి శాఖపైనా, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నాడు ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయని దూరదర్శన్ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
ఇదో విపత్తు. వరుణ విలయం. వందేళ్లలో కనీవీనీ ఎరుగని కుంభవృష్టి. గత రెండు రోజులుగా తమిళనాడును ముంచెత్తుతున్న భీకర వర్షాలు బుధవారం రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించాయి. ఒక్క రోజులోనే అనూహ్య రీతిలో 45 సెంటీమీటర్ల వర్షం పడటంతో అన్ని రహదారులూ జలమయమయ్యాయి. కొన్నిచోట్ల మొదటి అంతస్తులోకీ నీళ్లు రావడం వర్ష తీవ్రతను కళ్లకు కడుతోంది. జన జీవనం పూర్తిగా స్తంభించింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కరవు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను ఆదుకునేందుకు తొలివిడతగా ఎస్డిఆర్ఎఫ్ కింద వందకోట్లు విడుదల చేస్తున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించారు. దీంతోపాటు ప్రధానమంత్రి కృషి యోజన పథకం కింద 46 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రతించకుండా కేంద్ర చట్టాల కింద విచారించిన, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు ఏజన్సీలు దర్యాప్తు జరిపిన కేసుల్లో యావజ్జీవ శిక్షలుపడిన నేరస్థుల శిక్షలను తగ్గించే అధికారం రాష్ట్రాలకు లేదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఆంధ్ర ప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా ఆరు ఐఐటిలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్నాటక, కేరళ, జమ్ము,కాశ్మీర్, చత్తీస్గఢ్, గోవా రాష్ట్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తారు. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆమోదించారు.