S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/02/2015 - 13:33

చెన్నై : భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. మంగళవారం సాయంత్రం నుండి చైన్నై ఎయిర్‌పోర్టులో విమానాలు నిలిచిపోయాయి. దాదాపు 19 రైలు సర్వీసులను రద్దు చేశారు. కుండపోత కారణంగా ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు రద్దు చేశారు. దీంతో 4 వేల మందిపైగా అక్కడే చిక్కుకుపోయారు. మరో 4 రోజుల వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

12/02/2015 - 13:17

న్యూఢిల్లీ : తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో అకాల వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సంపై లోకసభలో 193 రూల్ కింద ఈ చర్చను చేపట్టారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వరదలపై చర్చకు నోటీసు ఇచ్చారు. ఉత్తర చెన్నై ఎంపీ టీజీ వెంకటేష్ బాబు చెన్నై వరదలపై మాట్లాడారు. వర్షాల వల్ల చెన్నైలో అనూహ్య నష్టం జరిగిందన్నారు. 14 వేల ఇండ్లు జలమయం అయ్యాయని అన్నారు.

12/02/2015 - 13:15

చెన్నై :కుండపోత వర్షాలు కురుస్తుండటంతో జలదిగ్బంధంలో ఉన్న తమిళనాడులోను ఆదుకునేందుకు తమిళ సినీ నటులు ముందుకొస్తున్నారు. తమిళనాడుకు తక్షణ సాయం కింద సూపర్‌స్టార్ రజినీకాంత్ సీఎం నిధికి రూ. 10 లక్షలు సాయం చేశారు. ఈ సాయం శ్రీరాఘవేంద్ర పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లించనున్నట్లు రజినీకాంత్ తెలిపారు. రజినీ అల్లుడు ధనుష్ రూ. 5 లక్షలు, సూర్య, అతని సోదరుడు కార్తీ రూ.

12/02/2015 - 11:37

చెన్నై: కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై నగరం నీట మునిగింది. బుధవారం కూడా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్, రవాణా వ్యవస్థలకు ఆటంకం కలిగింది. తమిళనాడులోని 8 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక్కడి వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో కేంద్ర మంత్రులు వెంకయ్య, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో సమావేశమై వివరాలు తెలుసుకున్నారు.

12/02/2015 - 07:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుడుగా నియమితులయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం కేంద్ర అల్పసంఖ్యాల వర్గాల సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన కేంద్ర వక్ఫ్ మండలిని ఏర్పాటు చేసింది.

12/02/2015 - 07:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేసన్లకు ఏమాత్రం ఇబ్బంది రాకుండా కాపులను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటారన్న విశ్వాసాన్ని లోక్‌సభలో టిడిపి పక్షం నేత తోట నరసింహం వ్యక్తం చేశారు.

12/02/2015 - 07:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించటంలో జరుగుతున్న జాప్యం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోందని కాంగ్రెస్ సభ్యుడు జె.డి.శీలం ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగంపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక కేటగిరీ హోదాను ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని పాటిస్తోందని ఆయన విమర్శించారు.

12/02/2015 - 06:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఎన్‌డిఏ హయాంలో దేశంలో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయన్న విపక్షాల ఆరోపణలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా క్షమించేది లేదని హెచ్చరించారు. దాద్రీ ఘటన, కల్బుర్గీ హత్యలపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడానికి తమ ప్రభుత్వ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

12/02/2015 - 06:58

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు ఆచితూచి మాట్లాడాలని, రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద అంశాల జోలికి వెళ్లొద్దని బిజెపి అధినాయకత్వం పార్టీ ఎంపీలకు హితవు చెప్పింది. అసహనం సాకుతో ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ సభ్యులు బాధ్యతతో మెలగాలని పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

12/02/2015 - 06:52

అహ్మదాబాద్, డిసెంబర్ 1: దేశంలో ప్రబలుతున్న అసహన ధోరణులపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రజలు తమ మనసుల్లోని విద్వేష ఆలోచనలను తొలగించుకోవాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం గట్టి సందేశం ఇచ్చారు. వీధుల్లో పోగుపడి ఉన్నది అసలు చెత్త కాదని, మనుషుల మనస్సుల్లో ఉన్న విద్వేష ఆలోచనలే నిజమైన చెత్త అని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల హింసనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ఆయన ఉద్బోధించారు.

Pages