-
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశం మేరకు పలువురు కేంద్ర మంత్రులు సో
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: కోవిడ్-19 కారణంగా స్వదేశాలకు వెళ్లలేకపోయిన విదేశీయులక
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశ వ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్ డ
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: అసలే కరోనా మహామ్మారితో దేశ ప్రజలే కాదు యావత్ ప్రజలు త
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ వార్తలు
పనాజీ, నవంబర్ 20: దశాబ్దాలుగా భారతీయ సంగీతానికి ఎనలేని సేవలందిస్తూ దక్షిణాదిన వినూత్న బాణీలతో ఎప్పటికప్పుడు కొత్త ఒరవడులు సృష్టిస్తూ వచ్చిన సంగీత విద్వాంసుడు ఇళయరాజాకు ఈ ఏటి మేటి వ్యక్తిగా శతాబ్దపు అవార్డు లభించింది. భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా ఆర్థిక, సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఈ పురస్కారాన్ని ఇళయరాజాకు ప్రదానం చేశారు.
పాట్నా, నవంబర్ 20: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసారు. ఆ యనతో పాటుగా 28 మంది మం త్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసా రు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఆర్జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ ఇద్దరు కుమారులు తేజస్వి, తేజ్ప్రతాప్లు ఉండడం గమనార్హం.
రాయపూర్, నవంబర్ 20: నక్సల్స్పై ఇటీవల సాధించిన విజయాలతో చత్తీస్గఢ్లో భద్రతా దళాలు ఇప్పుడు దేశంలోనే మావోయిస్టులకు అత్యంత పటిష్ఠ స్థావరమైన దక్షిణ బస్తర్లో మావోయిస్టు సీనియర్ నేతలను మట్టుపెట్టడంపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. గత 17 రోజుల్లో బస్తర్లోని సుకుమా, బీజపూర్ జిల్లాల్లో పది మందికి పైగా మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరిలో అయిదుగురు మావో కమాండర్లున్నారు.
ముంబయి, నవంబర్ 20: షీనాబోరా హత్య వెనుక అసలు గుట్టు సిబిఐ బయటపెట్టింది. కన్నకూతురికి ఆస్తి మొత్తం పోతుందనే భయంతోనే మాజీ భర్తతో కలిసి షీనా బోరాను ఇంద్రాణి హత్యచేసిందని సిబిఐ కోర్టుకు తెలిపింది.
కౌలాలంపూర్, నవంబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి మూడు రోజుల పాటు చేసే మలేసియా పర్యటనలో ఉగ్రవాదం, మనుషుల అక్రమ రవాణా, తీరప్రాంత రక్షణ, దక్షిణ చైనా సముద్ర వివాదం, వాణిజ్యం అంశాలపై కేంద్రీకరించనున్నారు. ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులలో మోదీ ప్రసంగించనున్నారు. మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ సహా ఆ దేశ ఉన్నత స్థాయి నాయకత్వంతో మోదీ చర్చలు జరుపుతారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: మనీలాండరింగ్ కేసులో హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. మూడు రాష్ట్రాల్లోని కనీసం 12 చోట్ల ఈడి సోదాలు నిర్వహించింది. రాజధాని ఢిల్లీ, ముంబయి, కోల్కతా నగరాల్లోని పలు సంస్థల్లో తనిఖీలు చేసినట్టు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసిన వర్షాలు, జరిగిన నష్టంపై కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ను పౌర విమానయాన మంత్రి అశోక్గజపతిరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావువివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంపిన నివేదికతో పాటు ఏపికి తక్షణ సాయంగా 1000 కోట్ల రూపాలను విడుదల చేయాలని కోరుతూ ప్రధానికి రాసిన లేఖను పిఎంఓలో అందజేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 20: జిఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వివిధ రూపాల్లో ఎదురయ్యే నష్టాల భర్తీకి నష్టపరిహారాల చెల్లింపు నిధి ఏర్పాటు చేసి తీరాలని ఆంధ్రప్రదేశ్ కరాఖంఢిగా చెప్పింది. నిధి ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేసి బిల్లులో పొందుపర్చి తీరాలన్న తమ డిమాండ్ను ఆమోదించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 23: భారత దేశాన్ని రెడ్టేప్ నుంచి రెడ్ కార్పెట్ దిశగా సంస్కరణ పథంలో పరుగులు పెట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశంలో సంస్కరణల అమలు వేగం పెరగాలని ఇటు కార్పొరేట్లను అటు పౌరులను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగడమే వీటి ఉద్దేశమని వెల్లడించారు.
న్యూఢిల్లీ, జూన్ 23: మాజీ న్యాయశాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తప్పుడు డిగ్రీలకు సంబంధించి తనకు ముందస్తుగా సమాచారం లేదని, అవి బూటకపు డిగ్రీలన్న సంగతే తనకు తెలియదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశంలో తోమర్ డిగ్రీల వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. బిజెపి సభ్యులు ఈ అంశంపై అసెంబ్లీలో రాద్దాంతం సృష్టించారు.