అవీష్, అశ్విన్ ప్రధానపాత్రధారులుగా రామదూత క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘జీనియస్’. ఓంకార్ దర్శకత్వంలో ముత్యాల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండో షెడ్యూల్కు సిద్ధమైంది.
చిత్ర
అవీష్, అశ్విన్ ప్రధానపాత్రధారులుగా రామదూత క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘జీనియస్’. ఓంకార్ దర్శకత్వంలో ముత్యాల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండో షెడ్యూల్కు సిద్ధమైంది.
‘జర్నీ’ చిత్రంలో శర్వానంద్కు జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసిన అనన్య గుర్తుంది కదా. అందానికి అందంతోపాటు నటిగా మంచి పేరు రావడంతో మలయాళంలో టాప్స్టార్గా వెలుగొందుతోంది. ఎంత తెలివున్నా ఒక్కోసారి మోసపోతారనడానికి అనన్య ఉదాహరణగా చెప్పచ్చు. మలయాళంలోనే ఆమె ఓ వీరాభిమానితో ప్రేమలో పడింది.
‘శ్రీరామరాజ్యం’ చిత్రం తర్వాత నయనతారకు ఫ్యామిలీ హీరోయిన్గా ముద్రపడింది. ఒక రకంగా పౌరాణిక చిత్రాల్లో నటించడానికి సరైన హీరోయిన్లు లేరు అని అనుకుంటున్న సమయంలో నేనున్నానంటూ వచ్చింది నయనతార. అయితే కెరీర్ ఎండింగ్లో ఈ మంచి చిత్రంలో నటించడంవల్ల నయనతారకు మళ్లీ అవకాశాలు రావటం మొదలుపెట్టాయి.
ఒక భాషలో అగ్రస్థాయి హీరోయిన్గా తాంబూలం అందుకుంటుంటే మరో భాషలో ద్వితీయస్థాయి హీరోయిన్గా అవకాశాలు ఇస్తున్నారని బాధపడుతోంది హన్సిక. విషయంలోకెళ్తే హన్సిక తమిళంలో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది. తెలుగులో ఆమెకు మార్కెట్ తక్కువే.
మొదట నటిని అవుదామని అనుకోకపోయినా, ఇప్పుడు అయ్యాను కనుక నటనలో ఏదైనా సాధించాల్సిందేనని చెబుతోంది కేరళ కుట్టి అసిన్. ‘అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం ద్వారా టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ అమ్మడు చాలా త్వరగానే హిట్లు కొట్టేసి ముంబాయి రూటుపట్టింది.
సిద్దార్థ్, అమలాపాల్ జంటగా వైనాట్ స్టూడియోస్ పతాకంపై బాలాజీమోహన్ దర్శకత్వంలో నిర్మించిన ‘లవ్ ఫెయల్యూర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ను హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాల్లో నిర్వహించారు.
అచ్చతెలుగు అమ్మాయి, గృహిణి పాత్రలు చేయాలంటే స్నేహ పేరే గుర్తొస్తుంది ఎవరికైనా. అయితే మోడ్రన్ డ్రస్సుల్లో స్నేహ నప్పకపోవడంతో కమర్షియల్, మాస్ చిత్రాలలో అవకాశాలు సన్నగిల్లాయామెకు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోవడంతో చివరికి తన కోస్టార్ ప్రసన్నతో పెళ్లికి సిద్ధమైంది.
తెలుగు చిత్రాలలో తనకంటూ ఓ గుర్తింపు ఉన్న విభిన్న నటుడు గిరిబాబు. 1973 నుండి తన కెరీర్లో 550 చిత్రాలలో నటించి విలన్గా పేరు తెచ్చుకున్నారు. హాస్యనటుడిగా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ఆయన శైలి.
ఒకేఒక చిత్రంతో స్టార్గా ఎదిగిన నిత్యామీనన్ నిత్యం నలుగురు నోళ్ళల్లో నానడానికే ఇష్టపడుతోంది. అది చెడు మాటలైనా, మంచి మాటలైనా ఏదో విధంగా నలుగురికీ తన పేరు వినబడుతోందని సంతోషపడుతోంది. ఇప్పటికే తెలుగు చిత్రాలలో అవకాశాలు లేకుండా పోయినా కనీసం మలయాళంలో అవకాశాలు బాగా వున్నాయి.
తెలుగులో 70వ దశకంలో అనేక మంచి చిత్రాలను నిర్మించిన పర్వతనేని మల్లిఖార్జునరావు (76) హైదరాబాద్ మెడ్విన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారు లు ఉన్నారు. కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూసారు.