ఢిల్లీ కబుర్లు -కే.కైలాష్

15/05/2012

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆదివారం అరవై వసంతాలు పూర్తి చేసుకున్నది. 1952 మే 13 తేదీనాడు లోక్‌సభ, రాజ్యసభల మొదటి సమావేశం జరిగింది. లోక్‌సభ పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో సమావేశమైతే రాజ్యసభ పాత ఢిల్లీలోని రాజ్యాంగ చట్ట సభలో సమావేశమై ప్రజాస్వామ్య వ్యవస్థకు శ్రీకారం చుట్టాయి.

08/05/2012

దేశ ప్రథమ పౌరుడి ఎంపిక ఏకాభిప్రాయ సాధన ద్వారా జరగాలి తప్ప రాజకీయ ఎత్తుగడల ద్వారా జరగకూడదు. అధికారంలో ఉన్న యు.పి.ఏ భాగస్వామ్య పార్టీలు, దాని మిత్రపక్షాలతోపాటు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల ఏకాభిప్రాయంతో కొత్త రాష్టప్రతి నియామకం జరగటం మంచిది.

01/05/2012

అవినీతికి పాల్పడే వారు దొరికితేనే దొంగలు, దొరకకపోతే వారంతా దొరలే. మన దేశంలో ఇలాంటి దొరలు కోకొల్లలు. బి.జె.పి మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు లక్ష రూపాయల అవినీతి కేసులో సి.బి.ఐ ప్రత్యేక కోర్టు నాలుగు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.

17/04/2012

ఇల్ల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఒక మంచి పథకాన్ని ప్రకటించగానే అది సమర్థంగా అమలై ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుందనుకోవటం కూడా తప్పే అవుతుంది.

10/04/2012

ప్రజలు తమకెందుకు దూరమైపోతున్నారు? ఎక్కడ తప్పు జరుగుతోంది? అనేది కాంగ్రెస్ అధినాయకత్వానికి అర్థం కావటం లేదట. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్ అధినాయకత్వం తప్పు ఎక్కడ జరిగిందనేది తెలుసుకునేందుకు గత వారం నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఈ నిజం వెలుగులోకి వచ్చిందట.

03/04/2012

భారత సైన్యం పేరు ప్రతిష్టలకు భంగం కలగటానికి సైన్యాధ్యక్షుడు విజయకుమార్ సింగ్‌తోపాటు రక్షణ శాఖ మంత్రి ఏ.కె.ఆంటోని, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ బాధ్యతవహించకతప్పదు.

27/03/2012

ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని పాలించే నైతికార్హతను కోల్పోయింది. రైల్వే బడ్జెట్ నిర్వాకం నేపథ్యంలో యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం అసలు పని చేస్తోందా? అనే అనుమానం కలుగుతోంది.

20/03/2012

యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం సగటు మనిషి అభివృద్ధిని మరిచిపోతోందా? ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన 2012-13 సంవత్సరం బడ్జెట్, దినేష్ త్రివేదీ ప్రవేశ పెట్టిన రైల్వే బడ్జెట్‌ను పరిశీలిస్తే సంకీర్ణ ప్రభుత్వం దశ, దిశ లేకుండా ముందుకు సాగుతోందనే అనుమానం కలుగుతోంది.

12/03/2012

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను నట్టేట ముంచితే మరో జాతీయ పార్టీ బి.జె.పిని బేజార్ చేసిపెట్టాయి. భవిష్యత్ రాజకీయం ప్రాంతీయ పార్టీలదే తప్ప జాతీయ పార్టీలది కాదనే సందేశాన్ని సుస్పష్టం చేశాయి.

06/03/2012

ఉత్తర ప్రదేశ్ తదితర ఐదు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగియగానే టి.వి. చానళ్లలో రాజకీయ విశే్లషకులు పెట్రేగిపోయారు. ఐదారు వేల మంది తో జరిపిన ఎగ్జిట్ పోల్స్ ద్వారా సేకరించిన అత్తెసరు సమాచారంతో ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ మట్టి కరుస్తుంది? ముఖ్యమంత్రి పదవిని ఎవరు చేపడతారు?

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading