మిర్చి మసాల

20/05/2012

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఈ మధ్య కాలంలో ఒక్కోసారి కోపం కట్టలు తెంచుకుంటున్నది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న భవంతులను మీడియాకు చూపించాలని, తనకు విజయనగరంలో ఉన్న ఆస్తులనూ చూపిస్తానని సవాల్ విసిరారు.

13/05/2012

లేస్తే మనిషిని కాదని గొప్పలు చెప్పుకొనే వ్యక్తుల సామెతలు గుర్తు చేస్తుంటారు. అలాగే అధికారంలోకి వస్తే తాను అందరినీ ఒక ఆటాడిస్తానని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఇంతకూ ఏ పార్టీ ద్వారా అధికారంలోకి వస్తారని అడిగితే ఆ ఒక్కటీ అడగొద్దు అంటున్నారు.

05/05/2012

మా పార్టీని ఆ ఏడుకొండల వాడే కాపాడాలని అని టీడీపీ సీనియర్ నాయకుడొకరు వాపోయారు. అంత కష్టం ఏమొచ్చింది అంటే ? మనుషులు బాగు చేస్తే బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే దేవుడిపై భారం వేశానంటున్నారు. జగన్ నాస్తికుడు అందుకే ఇప్పటి వరకు తిరుపతి వెళ్లలేదు అంటూ టిడిపి నాయకులు మండిపడ్డారు.

29/04/2012

మీతో ఇదే తంటాలు సర్టి ఫికెట్లు ఇస్తే తీసుకోకుండా, భూమి కూడా చూపించమంటే ఎలా? అని అధికారులు విసుక్కుంటున్నారు. మాకు సర్ట్ఫికెట్లు వద్దు సారూ..్భమి ఎక్కడుందో చూపండి చాలు అని లబ్దిదారలు అంటున్నారు. ఆ ఒక్కటీ అడక్కండి అని అధికారులు తప్పించుకుంటున్నారు. పేదప్రజలు.

21/04/2012

శత్రువును ఎవరు ఓడించినా, బాధించినా ఆనందపడడం ఆనవాయితీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే పరిస్ధితి నెలకొంది. క్రికెట్ ఆటకు పరిమితమైన ఈ ఆనందం రాజకీయాలకు పాకింది. గతంలో ప్రపంచ క్రికెట్ కప్ పోటీల్లో పాకిస్తాన్ ఫైనల్స్‌కు చేరితే, ఆ జట్టుతో ఆడే ఆస్ట్రేలియా గెలవాలని భారతీయులు కోరుకుంటారు.

15/04/2012

తెరిచిన పుస్తకం........

07/04/2012

రాజుతో పాటు కీలక స్థానాల్లో ఉన్నవారు అంతా కలిసి ఒకేసారి దేశాన్ని వీడి వెళ్లరాదనే నియమం రాజుల కాలం నుంచి పాటిస్తున్నారు. చివరకు వ్యాపార సంస్థల్లో సైతం ఈ సూత్రాన్ని పాటిస్తారు. అదేం చిత్రమో కానీ కాంగ్రెస్‌లో ఈ మధ్య తరుచుగా ముఖ్యమైన వారంతా రాజధాని నగరాన్ని వీడి ఢిల్లీలో మకాం వేస్తున్నారు.

31/03/2012

అసెంబ్లీ సమావేశాల తీరు చూసి సీనియర్లు ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అని శ్రీశ్రీ కవిత్వాన్ని పాడితే, జూనియర్లు మాత్రం మరీ ఇంత అధ్వాన్నమా? ఎందుకు ఎన్నికయ్యామా? అనిపిస్తోంది అని ఆవేదన చెందుతున్నారు. అటు సీనియర్లు ఇటు జూనియర్లు సమానంగా బాధపడే స్థాయిలో జరిగాయి సమావేశాలు అని తటస్థులంటున్నారు.

25/03/2012

ఎందుకంత హడావుడిగా వెళతారు? మీరు అసెంబ్లీకి వెళ్లేది వాయిదా వేయించుకోవడానికే కదా? అని ఇంట్లో శ్రీమతి గారు అన్నారు అని చెప్పుకోవడం ఎమ్మెల్యేలకు మామూలే. అలాంటిది ఈ మధ్య ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీ కార్యకలాపాలు యధావిధిగా సాగడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

18/03/2012

రాజకీయ ఆయాసం

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading