ఉత్తరాయనం

21/05/2012

ఫస్ట్ ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయి మానసిక వ్యధతో ఐదు మంది, సెకెండ్ ఇంటర్‌లో ఫెయిల్ అయి ఓ ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈవిధంగా ఆత్మహత్యలకు పాల్పడటంవల్ల కలిగే తల్లిదండ్రుల గర్భశోకం ఎవరు తీర్చగలరు? ర్యాంకులకోసం విద్యా ర్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నది జగమెరిగిన సత్యం.

19/05/2012

తణుకు సంత మార్కెట్‌లో గోవుమాంసం బహిరంగంగా అమ్ముతున్నారు. ఫారం కోడిలాగా గోవుని కూడా కట్టివేసి పబ్లిక్‌గా అమ్ముతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. అసలు గోవధ నిషేధం అంటూ ఉన్నదా లేదా అన్నది ప్రజలకు అర్ధంకావడం లేదు.

18/05/2012

పిల్లల చదువులు, ర్యాంకులు, మార్కుల శాతంపట్ల నేటి తల్లిదండ్రులు చూపుతున్న శ్రద్ధ వారి మనో వికాసంపై చూపడం లేదనడానికి ఉదాహరణ నేటి యువతలో పెచ్చు పెరుగుతున్న వింత పోకడలు. అధికశాతం అనైతిక కార్యకలాపాలు, మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు చేసుకోవడం నేటి యువతకు సర్వసాధారణమైపోయింది.

17/05/2012

ఈమధ్య చెన్నై వెళ్లినప్పుడు నాలుగు ట్యూబులైట్లు, మూడు ఫ్యాన్లు, ఒక ఫ్రిజ్, ఒక మోటారు ఉన్న ఇంటికి రెండు నెలల కరెంట్ బిల్లు మూడు వందల రూపాయిల కన్నా తక్కువ అని చెప్పారు. కాని అదే లోడ్‌తో ఆంధ్రాలో ఒక నెల బిల్లు నాలుగువందలు పైగా అవుతోంది.

16/05/2012

ఈ సంవత్సరం క్రొత్తగా రెండువందలు సక్సెస్ స్కూళ్లను స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. పేద, మధ్యతరగతి వారికి తక్కువ ఖర్చులో కార్పొరేట్ విద్యాసంస్థలతో సమానంగా నాణ్యమైన విద్యను అందించడమే ఈ సక్సెస్ స్కూళ్ల ముఖ్యఉద్దేశం.

15/05/2012

ఆదర్శ, అభ్యుదయ రైతుల ఎంపిక ప్రజాప్రతినిధుల మెప్పుపొందేటందుకా? లాభసాటి కాని, పండగా కాని వ్యవసాయం ఎందు కు? రుతువులు గతి తప్పుతున్నాయి. రైతులను అధోగతిపాలు చేస్తున్నారు. ఎరువులు, కూలీల రేట్లు ఆకాశానికి ఎగబాకినాయి. చీడపీడల బాధలు అంతు చిక్కదాయె. భూగర్భ జలాలు అడుగంటినవి.

14/05/2012

వేగంగా విస్తరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి కారణంగా పవిత్రమైన మన సంస్కృతి సంప్రదాయాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను మరిచిపోయి విదేశీయుల పద్ధతులను అనుకరించడం శోచనీయం. యువతరంలో అధికులకు మన పండుగల వైశిష్ట్యం తెలియదు.

12/05/2012

మన రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలతోపాటు సెకండరీ తరగతుల పరీక్షలలో హిందీ సబ్జెక్టుకు పాస్ మార్కులు వందకి ఇరవై మాత్రమే కేటాయించడం అసమంజసం.

11/05/2012

ఎన్నికల్లో ముఖ్యంగా గెలుపు ఓటములు ఉద్యోగస్తుల చేతులలో ఉన్నాయి. కేంద్రం తమ ఉద్యోగులకు డి.ఏ. జనవరిలో పెంచితే, రాష్ట్రం నేటికి ఆ ఊసెత్తలేదు. ఎన్నికలలోగా డి.ఏ చేతికి రాకపోతే, ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాలలో ఒక్కరు కాంగ్రెస్‌కు ఓటెయ్యరు.

10/05/2012

ఇండియాలో వున్న చట్టాలన్నీ నేరస్థులకు అంటే టెర్రరిస్టులు, దోపిడీదారులు, ఖూనీకోరులు, ఆర్థిక నేరస్థులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు అక్రమంగా దోచినవారికి చుట్టాలుగానే వున్నాయి. నీతిమంతులను, అమాయక ప్రజలను కాపాడే విధంగాను, రక్షింపబడే విధంగాను కన్పించటం లేదు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading