హైదరాబాద్
హైదరాబాద్, జూన్ 18: గ్రేటర్ బల్దియాలో ముఖ్యమైన ప్లానింగ్ విభాగానికి కమిషనర్ తాజాగా కొత్త అదనపుకమిషనర్గా యువ ఐఎఎస్ అధికారి రోనాల్డ్ రాస్ను నియమించటం చర్చనీయాంశమైంది.
చార్మినార్, జూన్ 18: రోజుకో సమస్యతో సతమతమయ్యే పాతబస్తీలో ఇపుడు దోమల బెడద నెలకొంది. గుడ్డు దశలోనే దోమల నివారణ చర్యలను చేపట్టి, ఈ బెడద నుంచి నగర ప్రజలకు విముక్తి కల్గించాల్సిన గ్రేటర్ బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులిపించుకుంటున్నారు.
హైదరాబాద్, జూన్ 18: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ మధ్య బదిలీల కాలం కొనసాగుతోంది. కమిషనర్గా ఎంటి కృష్ణబాబు పదవీబాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదాపు అరడజను సార్లు సిబ్బంది, ఉన్నతాధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది.
ఖైరతాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆరే అడ్డంకి అని ఓయూ జెఎసి, తెంగాణ స్వతంత్య్ర జెఎసి విద్యార్ధులు మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 18: అదీ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయం..దీనికున్న రెండు ఎంట్రెన్స్ల్లో నిత్యం పెద్దపెద్ద కార్లలో తెల్లటి ఖాధీ దుస్తులు ధరించిన బడాబాబులు ఎంతో బిజీ బిజీగా రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా చూసేందుకు బడా నేతలుగా కన్పిస్తుంటారు.
ఉప్పల్, జూన్ 18: జిహెచ్ఎంసిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.12500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిహెచ్ఎంసి ఎంప్లారుూస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పల్ సర్కిల్ ఆఫీసు ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.
గచ్చిబౌలి, జూన్ 18: ఏడాదిక్రితం జరిగిన సమావేశంలో సూచించిన పనులనే ఇప్పటికీ చేయకపోతే వార్డు ఏరియా కమిటీలెందుకని సభ్యులు ప్రశ్నించారు. 112 డివిజన్ వార్డు కమిటీ మీటింగ్ స్థానిక అంజయ్యనగర్ కమ్యూనిటీ హాలులో జరిగింది. నాలుగు పర్యాయాలు వార్డు కమిటీ మీటింగులు నిర్వహించినా కోరంలేక వాయిదాపడ్డాయి.
హైదరాబాద్, జూన్ 17: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వయోవృద్థుల కోసం వార్డుకో డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ కృష్ణబాబు వెల్లడించారు. వయోవృద్థులను నిర్లక్ష్యం చేయరాదన్న నినాదంతో సోమవారం గ్రేటర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముషీరాబాద్, జూన్ 17: ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మభూషణ్ డా. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 67వ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ సుమధుర ఆర్ట్స్ అకాడమీ (అనూ సిస్టర్స్) సమర్పణలో నిర్వహించిన ‘నాపాట పంచామృతం’ సినీ స్వరలహరి ఆద్యంతం ఆహూతులను అలరించింది.
హైదరాబాద్, జూన్ 17: పర్మినెంటు ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.. ఔట్సోర్సు ఉద్యోగులను పర్మినెంటు చేయాలన్న ప్రధాన డిమాండ్లపై ఈనెల 18వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు జిహెచ్ఎంసి గుర్తింపు యూనియన్ జిహెచ్ఎంఇయూ నోటీసులు జారీచేసిన సంగతి తెల్సిందే!