బికనీర్ (రాజస్థాన్), మే 25: ఓ పాకిస్తానీ చొరబాటుదారుడిని శనివారం సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్ఎఫ్) శ్రీగంగానగర్ జిల్లాలో కాల్చి చంపాయి.
జాతీయ వార్తలు
బికనీర్ (రాజస్థాన్), మే 25: ఓ పాకిస్తానీ చొరబాటుదారుడిని శనివారం సరిహద్దు భద్రతా దళాలు (బిఎస్ఎఫ్) శ్రీగంగానగర్ జిల్లాలో కాల్చి చంపాయి.
న్యూఢిల్లీ, మే 25: మాజీ భారత రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలామ్ను అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సౌసైటీ (ఎన్ఎస్ఎస్) వెర్న్హర్ వోన్ బ్రౌన్ మెమోరియల్ అవార్డుతో సత్కరించింది. శాండియాగోలో అంతర్జాతీయ అంతరిక్ష్య అభివృద్ధి సదస్సులో శుక్రవారం సాయంత్రం కలామ్కు ఎన్ఎస్ఎస్ ఈ అవార్డును ప్రదానం చేసింది.
సిమ్లా, మే 24: చట్టసభల కార్యకలాపాలకు తరచూ గందరగోళాలు, వాయిదాల కారణంగా అవరోధం కలుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ పార్టీలను కోరారు.
అహ్మదాబాద్, మే 24: కేంద్రంలోని యుపిఏ సంకీర్ణ ప్రభుత్వంపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. తొమ్మిదేళ్ల యుపిఏ పాలన అవినీతితో పూర్తిగా నిండిపోయిందని ఆయన నిప్పులు చెరిగారు.
శ్రీనగర్, మే 24: దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఒక మిలిటెంట్ హతమయ్యాడు.
న్యూఢిల్లీ, మే 24: యుద్ధ సామగ్రిని మరింతగా సమకూర్చుకోవడంతోపాటు ప్రస్తుతమున్న మానవ వనరులను రెట్టింపు చేసుకునేందుకు నావికాదళం సిద్ధమవుతోంది. న్యూక్లియర్ సబ్మెరైన్లు, యుద్ధ విమానాలు, విమాన వాహక నౌకలు సమకూర్చుకోవాలని నిర్ణయించింది.
కోల్కతా, మే 24: ప్రస్తుతం మూతపడిన శారదా గ్రూపునకు చెందిన తారా ముసిక్, తారా న్యూస్ చానళ్లను మానవతా దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడం లేదు.
న్యూఢిల్లీ, మే 24: క్రమశిక్షణను ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశం పట్ల పార్టీలో హర్షం వ్యక్తమవుతోంది.
మదురై/న్యూఢిల్లీ, మే 24: చెన్నై సూపర్కింగ్స్ యజమాని తన అల్లుడు గురునాథ్కు ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్తో సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. తక్షణమే బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ శ్రీనివాసన్పై వత్తిడి పెరుగుతోంది.
న్యూఢిల్లీ, మే 23: దేశవ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. ఎన్నడూ లేని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనజీవనం ఉక్కిరిబిక్కిరిగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల పరిస్థితి మరీ దారుణంగా వుంది. వడగాడ్పులకు జనం బయటకు రావడానికే జంకుతున్నారు.