జాతీయ వార్తలు

19/06/2013

న్యూఢిల్లీ, జూన్ 18: పదిహేడేళ్లు సాఫీగా సాగిన సహజీవన బంధం తెగిపోవటంతో ఆదివారం వరకూ మిత్రులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, జనతాదల్ యు ఇప్పుడు ఒకరిపై మరొకరు కులం పేరిట బురద జల్లుకుంటున్నాయి.

19/06/2013

న్యూఢిల్లీ, జూన్ 18: కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించిన జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జెడి శీలం బుధవారం ఉదయం తమ శాఖల బాధ్యతలు చేపట్టనున్నారు. కావూరి ఉదయం 9-10 గంటల మధ్య పదవీ బాధ్యతలు తీసుకోనుండగా, శీలం 10-11 గంటల మధ్య పదవిని చేపట్టనున్నారు.

19/06/2013

పూణే, జూన్ 18: పాకిస్తాన్‌లో శాంతియుత పరిస్థితులు, రాజకీయ సుస్థితర పొరుగున ఉన్న భారత్ ప్రయోజనాలకు ఎంతో అవసరం అని రక్షణ మంత్రి ఏకె ఆంటోనీ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య సుహృద్భావ సంబంధాలను పెంపొందించేందుకు వీలు కల్పించే చర్యలను పాకిస్తాన్ తీసుకోవాలని ఆయన కోరారు.

19/06/2013

బెంగళూరు, జూన్ 18: గత బిజెపి ప్రభుత్వంలోని అవినీతీని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుని కర్నాటక ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆచరణలో పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మంత్రులను నిజాయితీగా ఉండాలని కోరారు.

19/06/2013

తిరువనంతపురం, జూన్ 18: కేరళలో సోలార్ ప్యానెళ్ల కుంభకోణంపై సిపిఎం నేతృత్వంలోని ప్రధాన ప్రతిపక్షం ఎల్‌డిఎఫ్ ఆందోళనను తీవ్రతరం చేసింది. మంగళవారం కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీని సోలార్ స్కామ్ కుదిపేయగా, అసెంబ్లీ లోపల, వెలుపల ఎల్‌డిఎఫ్ పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది.

19/06/2013

న్యూఢిల్లీ, జూన్ 18: అమెరికా జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఎస్‌ఏ) భారత్‌కు చెందిన ఇంటర్నెట్ సమాచారంపై నిఘా పెడ్తున్న విషయం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.

19/06/2013

పాట్నా, జూన్ 18: బీహార్‌లో బిజెపి మంగళవారం నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విశ్వాస్‌ఘాత్ దినోత్సవం సందర్భంగా అనేక చోట్ల జెడియు, బిజెపి కార్యకర్తలు బాషాబాహీకి దిగారు. లాఠీలు, రాడ్‌లతో కొట్టుకున్నారు. ఈ కారణంగా ఇరు పార్టీలకు చెందిన అనేక మంది గాయపడ్డారు.

19/06/2013

డెహ్రాడూన్/సిమ్లా, జూన్ 18: ఉత్తరాఖండ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన కుండపోత వర్షాలకు చార్‌ధామ్‌లలో ఒకటయిన సుప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం బురద, పూడికలో దాదాపుగా మునిగిపోయింది.

19/06/2013

మీరట్, జూన్ 18: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రచార సారధిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని నియమించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ గట్టిగా సమర్ధించారు. భారత దేశంలో పరివర్తన అన్నది ఒక్క హిందుత్వ వల్లే సాధ్యమవుతుందని మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు.

19/06/2013

అహ్మదాబాద్, జూన్ 18: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తన అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్నారు. ఎన్‌డిఏ నుంచి జెడియు వైదొలిగిన నేపథ్యంలో తలెత్తిన వివాదంలో బిజెపి కొట్టుమిట్టాడుతున్నందున తదుపరి వివాదానికి ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading