రాష్ట్ర వార్తలు
టిఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ టిడిపి, బిజెపి వాకౌట్ బిల్లుల కోసమే సస్పెన్షన్లు సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సభ్యుల ఆగ్రహం =======================
హైదరాబాద్, జూన్ 19: తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తారన్న ప్రచారం కాంగ్రెస్ మంత్రుల్లో మళ్లీ వేడి పుట్టిస్తోంది. ఇన్నాళ్లూ ప్రత్యేక తెలంగాణపై రెండుగా చీలిపోయిన రాష్ట్ర మంత్రులు.. ఇప్పుడు ప్యాకేజి ప్రకటన అంశంపై అభిప్రాయ భేదాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 19: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి బుధవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు ఇకపై డిస్కాంలు ప్రతి మూడు నెలలకు సర్చార్జీల ప్రతిపాదనలను ఏపిఇఆర్సికి సమర్పించవు.
హైదరాబాద్, జూన్ 19: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జీవో 39, జీవో 40 ద్వారా ఎయిడెడ్ స్కూళ్లకు మంగళం పలకాలని చూస్తోంది. ప్రైవేటు పాఠశాలల స్థాపన , గుర్తింపు, నిర్వహణ అంశాల గురించి 1994లో ప్రభుత్వం జీవో-1 జారీ చేసింది.
హైదరాబాద్, జూన్ 18: కళంకిత మంత్రులను బహిష్కరించే విషయంలో టిడిపి తన వ్యూహం మార్చుకుంది. గతంలో పార్లమెంటులో మంత్రిని విపక్షాలు బహిష్కరించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అదే విధంగా రాష్ట్రంలో కళంకిత మంత్రులను సభలో బహిష్కరించాలని టిడిపి గతంలో తీసుకున్న నిర్ణయంలో ఈ రోజు మార్పు చేశారు.
హైదరాబాద్, జూన్ 18: కర్నాటకకు చెందిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ ముడుపుల కేసు దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేపట్టింది.
హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అవసరమైతే మళ్లీ సకల జన సమ్మె నిర్వహించేందుకైనా సిద్ధమేనని తెలంగాణ రాజకీయ, ప్రజాసంఘాల ఐకాస (టిజెఎసి) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. టిజెఎసి స్టీరింగ్ కమిటి మంగళవారం టిఎన్జివో భవన్లో జరిగింది.
హైదరాబాద్, జూన్ 18: రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా టిడిపి ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో కూడిన వినతుల పెట్టెలను టిడిపి శాసనసభాపక్షం మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్కు అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఈ తరహా వినతులను సభలో అందించరాదని సభ్యులను వారించారు.
హైదరాబాద్, జూన్ 18: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు ఆరోగ్యశ్రీలో నిర్ధారించిన ధరలను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని వైద్య ఆరోగ్య మంత్రి కొండ్రు మురళి చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఎ.
హైదరాబాద్, జూన్ 18: జగన్ అక్రమాస్తుల కేసుల్లో మంత్రులకు న్యాయ సహాయం అందించడం సరైన చర్యేనని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. అధికారులకు అందిస్తున్న మాదిరిగానే మంత్రులకూ న్యాయ సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.