అందువలన అక్కడ ఉండే సేవకులకు కొంత డబ్బు ఇచ్చి తృప్తిపరిస్తే, వారు అక్కడినుంచి నన్ను తొలగించరని అనుకొన్నాను. అంతేకాక స్వామివారు సంజ్ఞ చేసినా, అక్కడే నిలిచి ఉండాలని, నా అనుమానం తీరిపోయేవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను.
త్రిపిటిక కథలు
అందువలన అక్కడ ఉండే సేవకులకు కొంత డబ్బు ఇచ్చి తృప్తిపరిస్తే, వారు అక్కడినుంచి నన్ను తొలగించరని అనుకొన్నాను. అంతేకాక స్వామివారు సంజ్ఞ చేసినా, అక్కడే నిలిచి ఉండాలని, నా అనుమానం తీరిపోయేవరకూ తిరిగి రాకూడదని నిశ్చయించుకొన్నాను.
దానిని కనిపెట్టుకొని వున్న రామచంద్ర ముఖోపాధ్యాగారికి చటోపాధ్యాయగారు ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చి, నాకు కాశీలో వసతి కల్పించారు. ఆ ఉత్తరంవల్ల నాకెంతో ఉపకారం జరిగింది. రామచంద్ర ముఖోపాధ్యాయ నాకు అన్నిసౌకర్యాలు కలిగించి ఆదరించాడు. మొదట నేను నా తల్లిదండ్రులకు శ్రాద్ధ కర్మలు చేశాను.
స్వామివారి అద్భుత శక్తులుచూసి ఆకర్షితుడై, ఆనాటినుంచే ధర్మమార్గంలో నడవసాగాడు. హిందూ ధర్మప్రాశస్త్యం తెలిసికొని, స్వామివారి సేవకు ప్రతినెలా ధనం ఇవ్వటానికి నిశ్చయించుకొన్నాడు. ఆ విషయాన్ని మంగళదాస్ ఠాకూర్ ద్వారా స్వామీజీకి నివేదించుకొన్నాడు. అది విని స్వామివారు ఆగ్రహోదగ్రులై తన అసమ్మతిని తెలిపారు.
ఆయన హిందూ దేవతలను ఉపాసించటం వ్యర్థమని ప్రబోధింపసాగాడు. వారిని నిందింపసాగాడు. ప్రజలను తన ధర్మం వైపుకు తిప్పుకోవటానికి ప్రయత్నించసాగాడు. ఒక్క ఈశ్వరుడే జగత్కర్త అని, ఆయన నిరాకారి-చైతన్య స్వరూపుడు-సర్వవ్యాపి అయి జగత్కల్యాణ కారకుడవుతున్నాడని ప్రబోధించాడు.
మహారాజు చాలా సంతోషించారు. అంతేకాక, తాను చెప్పకముందే స్వామిజీ తన మనస్సులోని అభిప్రాయాన్ని గుర్తించినందుకు మహారాజు ఆశ్చర్యపడ్డారు. మహారాజు చేతిలో ఒక ఖడ్గం ఉండింది. మహారాజుగారి శౌర్య సాహసాలకు సంతుష్టులైన బ్రిటీషువారు ప్రశంసాపూర్వకంగా ఆయనకిచ్చిన ఖడ్గమది.
అది చూసి గాభరా పడిన పరివారం, కారణం ఏమిటో తెలియక గొడవపడసాగారు. కొద్దిసేపటికి రాజుగారికి తెలివి వచ్చింది. అట్లా పెద్దగా అరవటానికి కారణమేమిటని పరిజనం రాజును ప్రశ్నించారు. కాని మహారాజు ఆ రాత్రి వారికేమీ చెప్పలేదు.
ఆ తరువాత స్వామీజీ యథేచ్చగా తిరుగవచ్చని అనుమతి ఇచ్చాడు. స్వామీజీకి అయిష్టమైన పని ఎవ్వరూ చేయరాదని ఆజ్ఞాపించాడు.
స్వామివారి అసలు పేర్లయిన త్రైలింగధరుడు- గణపతిస్వామి వంటివి వారికి తెలియకపోవడంవలన, త్రిలింగ దేశానికి చెందినవాడని తెలుసుకొని, ఆయనను త్రైలింగస్వామి అని పిలువసాగారు.
తన ఎదుట ఉన్న దైవస్వరూపులైన స్వామివారి పాదాలను పట్టుకొని నమస్కరించి, తనకు సంక్రమించిన భయంకర వ్యాధి నుంచి విముక్తిని ప్రసాదించమని ప్రార్థించాడు. కరుణామయులైన స్వామీజీ గంగానదిలోని మట్టిని తెచ్చి తినమని చెప్పి, తాము స్నానానికి వెళ్లిపోయారు.