ఆటాపోటీ
టెస్టు క్రికెట్లో వరుసగా మూడు ఇన్నింగ్స్లో 150 లేదా అంతకుపైగా పరుగులు చేసిన ఘనత ఇద్దరికే దక్కుతుంది. వీరిద్దరూ పాకిస్తాన్ క్రికెటర్లు కావడం ఒక విశేషమైతే, ఒకే సిరీస్లో ఈ ఫీట్ను ప్రదర్శించడం మరో విశేషం. 1982-83 సీజన్లో భారత జట్టు పాకిస్తాన్ టూర్కు వెళ్లి, ఆరు టెస్టులు ఆడింది.
రాజ్ కుంద్రా.. ఇప్పుడు భారత క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని వివాహం చేసుకునే వరకూ కుంద్రా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. మధ్య తరగతికి చెందిన కుంద్రా తండ్రి బతుకు తెరువుకోసం లూథియానా నుంచి బ్రిటన్కు తరలి వెళ్లాడు. అక్కడే స్థిరపడ్డాడు.
ఇండోనేషియా మాజీ ఒలింపియన్, ప్రపంచ చాంపియన్ తౌఫీక్ హిదాయత్ బాడ్మింటన్ కెరీర్కు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీలో పాల్గొన్న అతను, ఈ పోటీలు ముగిసిన వెంటనే అంతర్జాతీయ కెరీర్ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించాడు.
క్రీడా రంగాన్ని కార్పొరేట్ సంస్థలు వ్యాపారంగా మార్చేస్తున్నాయి. ప్రపంచ కప్ సాకర్ చాంపియన్షిప్ నుంచి ఎన్బిఎ బాస్కెట్బాల్ పోటీల వరకూ అన్ని క్రీడలు ఇప్పుడు కార్పొరేట్ దిగ్గజాల కనుసన్నల్లో నడుస్తున్నాయి. క్రీడా సంఘాలు, సమాఖ్యల్లోనూ వారి పెత్తనమే కొనసాగుతోంది.
భారత క్రికెట్ జట్టులో ‘గ్లామరస్ బాయ్’ ఇమేజ్ని తెచ్చుకున్న యువరాజ్ సింగ్ పూర్తిగా మారిపోయాడు. పార్టీలకు దూరంగా ఉంటున్నాడు. కొత్తకార్లు అంటూ భారీగా ఖర్చు చేసే అలవాటు మానుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సాధువుగా మారిపోయాడు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సభ్యురాలు, జర్మన్ మాజీ ఫెన్సర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత క్లాడియా బొకెల్కు బ్యాగ్ను వేసుకోవడంలో సహకరిస్తున్న రష్యా మాజీ పోల్వాల్టర్ సెర్గీ బుబ్కా.
క్రికెటర్లను ప్రమోట్ చేయడానికి ఓ సంస్థకు ఒక కెప్టెన్ భాగస్వామిగా ఉండడం క్రికెట్ చరిత్రలో ఎన్నడూ జరగలేదు. సన్నిహితులతో కలిసి వివిధ పేర్లతో కంపెనీలు పెట్టడం, బినామీ పేర్లతో వాటాలు పొందడం ధోనీలోని అసలుసిసలైన వ్యాపారవేత్తను మన కళ్ల ముందు సాక్షాత్కరింప చేస్తాయి.
ఆరిపోయే ముందు దీపం గొప్పగా వెలుగుతుంది. కొంతమంది క్రికెటర్ల కెరీర్ కూడా అంతే. అద్భుతంగా రాణించినప్పటికీ కొందరికీ అదే చివరి మ్యాచ్ కావడం చిత్రమే.
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) రోజువారీ వ్యవహారాలను చూసుకునే బాధ్యతను స్వీకరించిన జగ్మోహన్ దాల్మియాది నామమాత్రపు హోదానే అన్న వాదన వినిపిస్తుండగా, అతనికి సర్వాధికారాలు ఉంటాయని బోర్డు వర్గాలు అంటున్నాయి.
అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనావళిని మార్చడానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) కొత్త రూపాన్ని సంతరించుకోనుంది. ఈ దిశగా సన్నాహాలు ప్రారంభించింది.