ఫోకస్

23/02/2012

ప్రజాసమస్యలపై చర్చించి వాటికి పరిష్కానాన్ని కనుగొనేందుకు వేదికగా ఉండాల్సిన శాసనసభ నానాటికీ రాజకీయాలకు మాత్రమే వేదికగా మారుతోంది. ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదు. రాజకీయంగా తమకు ఉపయోగపడే, ప్రత్యర్థి పార్టీని దెబ్బ తీయడానికి ఉపయోగిస్తుందనే అంశాలకే రాజకీయ పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

23/02/2012

సభ సజావుగా జరగాలనే ఉద్దేశం ప్రధానంగా అధికారపక్షంలో కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎప్పుడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఎలాగైనా తప్పించుకొని పోదామనే ధోరణి తప్ప చర్చ జరుపుదామనే ఉద్దేశం కనిపించడం లేదు. కొంత కాలంగా సభలో ఎలాంటి చర్చలు జరగడం లేదు. సభ సజావుగా జరగకపోవడానికి అధికార పక్షమే ప్రధాన కారణం.

23/02/2012

చట్టసభలు దేనికోసం ఏర్పాటయ్యాయో, ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. ఇది మన రాష్ట్ర శాసనసభ, శాసనమండలికే కాదు.. ఇతర రాష్ట్రాల శాసనసభలకు, మండళ్లకు, పార్లమెంట్‌కు కూడా వర్తిస్తుంది. చట్టసభల్లో సమర్థత కలిగిన నాయకత్వం లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

23/02/2012

మాఫియా నాయకుడు దావూద్ ఇబ్రహీం అండర్‌గ్రౌండ్ నుండి బయటకు వచ్చి భారత్‌లో రాజకీయ పార్టీ పెట్టినా సదరు పార్టీ పెద్ద రాజకీయ పార్టీగా అవతరించే అవకాశాలు లేకపోలేదు. మన సమాజంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అలా ఉంది.

23/02/2012

చట్ట సభల్లో నాణ్యమైన చర్చ జరగాలి. మన రాష్ట్ర అసెంబ్లీ అనే కాదు లోక్‌సభ, రాజ్యసభల్లో సైతం ఇటీవల కాలంలో రోజుల తరబడి వివాదాలే తప్ప చర్చలు సాగడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలు జరుగుతున్న తీరు బాధ కలిగిస్తోంది. చట్ట సభల్లో ప్రమాణాలతో కూడిన చర్చలు జరగాలంటే సభ్యులందరి సహకారం అవసరం.

23/02/2012

అసెంబ్లీ సమావేశాల్లో ఈ మధ్య కాలంలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా రాజకీయ ప్రయోజనాల కోసం సభ్యులు వాగ్వివాదానికి దిగడం బాధ కలిగిస్తున్నది. తమ ఎమ్మెల్యే అసెంబ్లీలో తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారేమోనన్న ఆశతో ఆయా నియోజకవర్గాల ఓటర్లు ఎదురు చూస్తుంటారు.

23/02/2012

సభలో వివిధ అంశాలపై సభ్యులు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు శాసనసభకు పంపించే తమ సభ్యులకు అవగాహన కల్పించాలి. ఏయే అంశాలపై సభలో చర్చించాలన్నది వారు నిర్ణయించుకోవాలి. అప్పుడే శాసనసభలో అర్ధవంతమైన చర్చలు, ప్రజలకు ఉపయుక్తంగా ఉండే చర్చలు జరుగుతాయి.

16/02/2012

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు 45 రోజులుగా చేస్తున్న ఆందోళనను తాత్కాలికంగా విరమించారు.

16/02/2012

ప్రజలకు వైద్య చికిత్స అందించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి. బోధనాసుపత్రుల్లో రోగులకు నిరంతరం వైద్య సేవలు అందించేందుకు రెసిడెన్షియల్ విధానం ప్రవేశపెట్టాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

16/02/2012

వైద్య విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న తరువాత గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం తప్పనిసరి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వైద్య విద్యార్ధులు దీనిని కాదనడం సహేతుకం కాదు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading