ఫోకస్

23/05/2013

గోవు అణువణువూ భగవత్ స్వరూమన్నది హిందువుల నమ్మకం. తల్లికన్నా మిన్నగా భావించి గోవులను పూజిస్తారు.. ఆరాధిస్తారు. ఉదయానే్న గో ముఖం చూస్తే మంచిదని హిందువులు నమ్ముతారు. అంతవరకూ ఎందుకూ శ్రీరంగం వంటి అనేక పుణ్యక్షేత్రాల్లో సుప్రభాత సేవలో గోవును తీసుకువచ్చి స్వామివారి ముందుంచుతారు.

23/05/2013

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు భక్తులు కానుకగా ఇస్తున్న గోవులను సంరక్షించడం మా (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) బాధ్యత. ఈ బాధ్యత నుండి మేము తప్పుకునే ప్రసక్తే లేదు. డబ్బు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. గోసంరక్షణ కోసం నిధులకు ఎలాంటి కొరతా లేకుండా చూస్తాం.

23/05/2013

సమస్యల వలయంలో ఉన్న గోవులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటాం. గోశాలల్లో ఆవులతోపాటు ఇతర పశువులను కాపాడేందుకు చర్యలు చేపడతాం. కొన్నిచోట్ల పశువులకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. దీనిని అధిగమించేందుకు దృష్టి పెడతాము. రాష్ట్రంలో దాదాపు 89 గోశాలలు పనిచేస్తున్నాయి.

23/05/2013

గోసంరక్షణ భారతజాతికి పరమ ప్రధానమైన అంశం. గోసంరక్షణలో ప్రధానంగా రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. గోవులను సంరక్షించుకోవటం ఒక ఎత్తయితే రెండోది గోవధ నిషేధం మనముందున్న తక్షణ కర్తవ్యం. లేనిపక్షంలో అశ్రద్ధ ఆత్మవంచనే కాగలదు.

23/05/2013

గోవుల పరిరక్షణకు సింహాచల దేవస్థానం ఎన్ని నిధులైనా కేటాయిస్తుంది. గోవుల సంరక్షణకు ఏమాత్రం వెనకాడేది లేదు. అయితే జర్సీ దూడలను మొక్కుబడిగా తీసుకోకూడదన్నదే మా వాదన. కృత్రిమ గర్భోత్పత్తుల ద్వారా జర్సీ దూడలను ప్రభుత్వ పశువైద్యశాలల్లో పుట్టిస్తున్నారు. ముందు వాటిని నిలిపివేయాలి.

23/05/2013

గోవుల నిర్వహణ బాధ్యత తమది కాదని, వాటికి తమకు సంబంధం లేదని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం నిజంగా దురదృష్టకరం. సంబంధం లేనప్పుడు అలనాటి నుంచి గోవులను, దూడలను ఎందుకు మొక్కుబడిగా స్వీకరిస్తున్నారు? సింహాచలం గోశాలలో జరిగిన ఘటన దారుణాతి దారుణం.

23/05/2013

గోవులను కబేళాలకు తరలిస్తున్న అంశం తిరిగి తెరమీదకు వచ్చింది. గతంలో వేములవాడ, ఇపుడు సింహాచలం దేవాలయం. భక్తులు భక్తిశ్రద్ధలతో దేవాలయానికి ఇచ్చే గోవులు, గోసంతతి కాపాడాల్సిన బాధ్యత దేవాలయాల కమిటీ, ఎండోమెంట్ విభాగాలదే. ఆ బాధ్యత నుండి తప్పించుకోవడానికి రకరకాలుగా మాట్లాడటం తీవ్రంగా గర్హించదగిన విషయం.

16/05/2013

భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ (సిబిఐ). దురదృష్టవశాత్తు ఈ సంస్థ పనితీరు, దర్యాప్తు, అధికారుల వ్యవహార శైలి ఇటీవల కాలంలో తీవ్రమైన విమర్శలకు గురవుతోంది.

16/05/2013

విచారణ సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. ప్రజలకు సేవ చేసే సంస్థలు ప్రభుత్వ అజమాయిషీలో ఉండాలి కానీ ఇవి సేవా సంస్థలు కాదు నేరాన్ని విచారించే విచారణ సంస్థలు ఇవి స్వతంత్రంగా ఉండడమే మంచిది. సిబిఐతో పాటు విచారణ సంస్థలన్నీ స్వతంత్రంగా వ్యవహరించాలి.

16/05/2013

కేంద్ర ప్రభుత్వం అన్ని రాజ్యాంగ సంస్థలనూ బ్రస్టు పట్టించింది. రాజ్యాంగ సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని నీరుగార్చింది. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించేందుకు ఒక బృందాన్ని నియమించినట్టు ఆ బృందానికి చిదంబరం నాయకత్వం వహిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేవలం సిబిఐని సంస్కరిస్తే సరిపోదు.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading