వీక్ పాయింట్

19/05/2012

పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట. తెలుగు మీడియా పెత్తందార్లూ అదే టైపు. రేపోమాపో ‘సాక్షి’కి తాళం ఖాయం అని ఎవరూ అడక్కుండానే అవి జోస్యాలు చెబుతున్నాయి. దేవుడు మేలుచేసి, వాటి వాక్కు ఫలించి అంతపనీ జరగాలేగానీ ‘ఆ రెండు పత్రికల’కు పండగే పండుగ.

12/05/2012

ప్రపంచంలోని సెక్యులర్ దేశాలకూ, మనకూ తేడా ఏమిటి?
ఇతర దేశాలు అనుసరించేది సెక్యులరిజం. మనం నిష్ఠగా పాటించేది ‘పెక్యులరిజం.’

05/05/2012

తుపాకి గొట్టం నుంచి అధికారం తన్నుకొస్తుందన్నాడు మావో.
అదంతా పాత చాదస్తం. మావోను చంపి పుట్టిన మావోయిస్టుల చేతిలో విప్లవం చాలా ముందుకు పోయింది. ఇప్పుడంతా షార్ట్‌కట్టు. కిడ్నాపే విప్లవ కోర్కెలు తీర్చే కల్పతరువు!

21/04/2012

ఆంధ్రప్రదేశ్ స్థాయిలో ఉత్తరప్రదేశ్‌ను అభివృద్ధి పరచాలని కాంగ్రెసు రాకుమారుడు రాహుల్ పాపం చాలా ఉత్సాహపడ్డాడు. దుర్మార్గపు ఓటర్లు పడనివ్వలేదు. యు.పి.ని ఎ.పి.గా మార్చే చాన్సు చిక్కనప్పుడు యువరాజు కోరిక తీరాలంటే ఎ.పి.ని యు.పి.గా మార్చటమే సెకండ్ బెస్టు.

14/04/2012

బతకనేర్చినవాడు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు. బతకనేర్వనివాడు ప్రతి అవకాశంలోనూ ఒక సమస్యను చూస్తాడు.
సైకిల్ నాయుడు ఇందులో మొదటిరకం. చేతిగుర్తు వాళ్లు రెండో టైపు.

31/03/2012

ఎంతైనా సేనాపతి సేనాపతే! మెరపు వేగంతో ఊహించని వైపునుంచి దెబ్బమీద దెబ్బతీసి శత్రువును చక్రబంధంలో ఉక్కిరిబిక్కిరి చేసే విద్యలో ఇతరులు ఎంతటివారైనా సేనాధిపతుల ముందు బలాదూరే! భారత సైన్యాధిపతి జనరల్ వి.కె.సింగుగారి తాజా ప్రతాపమే ఇందుకు నిలువెత్తు రుజువు.

24/03/2012

ప్రజాస్వామిక ప్రభుత్వానికి చక్రధారి ప్రధానమంత్రి.
ఇండియా దటీజ్ భారత్‌లో మాత్రం మన్‌మోహన్ సింగ్ అనే ఆయన ఆఫ్టరాల్ ప్రధానమంత్రి! ప్రభుత్వపరంగా జరుగుతున్న వాటికి, జరగవలసిన వాటికి సాక్షీభూతంగా నిలిచి, అన్నిటికీ ‘మమ’ అనుకోవటమే ఆయన పని!

10/03/2012

‘పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం’ అని సిగరెట్ పెట్టెల మీద ముద్ర కొట్టించినట్టు ‘తెలుగు మాట్లాడటం ఆరోగ్యానికి హానికరం’ అని రాష్ట్రంలో అన్ని ఇంగిలిపీసు స్కూళ్లముందూ పెద్ద బోర్డులు వేలాడతీయిస్తే మంచిది.

03/03/2012

‘‘జడ్జిలకు తమ హద్దులు తెలియాలి. ప్రభుత్వాన్ని తామే నడపాలని వారు అనుకోకూడదు. చక్రవర్తుల్లా వ్యవహరించకూడదు.’’
అక్షర లక్షలు కాదు; అక్షర కోట్ల విలువైన మాట. అన్నది కూడా అల్లాటప్పా శాల్తీ కాదు. దేశంలో మొత్తం న్యాయవ్యవస్థకు మకుటంలాంటి సుప్రీంకోర్టు ధర్మాసనం!

25/02/2012

అమెరికాకీ మనకూ ఏమిటి తేడా?
అమెరికాలో టెర్రరిస్టు దాడి జరిగింది. మన మీదా జరిగింది. అక్కడ జంట టవర్లు కుప్ప కూలాయి. మూణ్నెల్లు తిరక్కుండా ఇక్కడ ఏకంగా పార్లమెంటు మీదే ఉగ్రవాదం పంజా విసిరింది.

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading