పగవాడిని పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణమన్నాడట. తెలుగు మీడియా పెత్తందార్లూ అదే టైపు. రేపోమాపో ‘సాక్షి’కి తాళం ఖాయం అని ఎవరూ అడక్కుండానే అవి జోస్యాలు చెబుతున్నాయి. దేవుడు మేలుచేసి, వాటి వాక్కు ఫలించి అంతపనీ జరగాలేగానీ ‘ఆ రెండు పత్రికల’కు పండగే పండుగ.













